అన్వేషించండి

Komatireddy RajaGopal Reddy: రాజన్న నీ దారెటు, క్లారిటీ మిస్సయితే పాలిటిక్స్‌ల్ ఖేల్ ఖతమ్ !

కాంగ్రెస్‌ పార్టీలో సరైన గుర్తింపు లేదని, కోరుకున్న పదవులను అధిష్టానం ఇవ్వలేదన్న అసంతృప్తితోనే రోజగోపాల్‌ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న మాటలైతే వినిపించాయి. కానీ ఆయన క్లారిటీ ఇవ్వలేదు.

ప్రజాప్రతినిధులకే క్లారిటీ లేనప్పుడు ఇక ప్రజలకు ఏముంటుందిలే అనుకోవద్దు సుమా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి  సలహా  ఇస్తున్నారు. గతకొన్నిరోజులుగా రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సీరియల్‌ ఎపిసోడ్‌ ఈ రాజకీయం సాగుతూనే ఉంది కానీ ఇంతవరకైతే రాజగోపాల్‌ నుంచి క్లారిటీ మాత్రం రాలేదు. 

గుర్తింపు కావాలా.. అసంతృప్తితో వెళతారా !
కాంగ్రెస్‌ పార్టీలో సరైన గుర్తింపు లేదని, కోరుకున్న పదవులను అధిష్టానం ఇవ్వలేదన్న అసంతృప్తితోనే రోజగోపాల్‌ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న మాటలైతే వినిపించాయి. ఇది బహిరంగ రహస్యమైనా ఆయన మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. పదవుల కోసం కాదు తెలంగాణ స్వేచ్ఛ కోసం సీఎం కేసీఆర్‌ పై సమరశంఖాన్ని పూరిస్తున్నానని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ స్పష్టత పార్టీ మారే విషయంలో లేదన్నది ఇంకో వాదన. అందుకు కారణం ఇంతకుముందు రాజగోపాల్‌ మాట్లాడిన తీరు.. అధిష్టానం, సీనియర్ల చర్చల తర్వాత నోటివెంట వచ్చిన మాటల తీరు భిన్నంగా ఉన్నాయంటున్నారు. బీజేపీలో చేరేది లేనిది స్పష్టత నివ్వలేదు. అలాగే కాంగ్రెస్‌ ని వీడే విషయంలోనూ సరైన క్లారిటీ లేదన్నది గుర్తు చేస్తున్నారు. ప్రతి పక్ష పార్టీనుంచి మరో ప్రతిపక్ష పార్టీలోకి పోతుంటే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి ఇదే ఇప్పుడు రాజన్న ముందున్న పెద్ద ప్రశ్న. ప్రజల మద్దతు కోరుకుంటున్నానని మాత్రమే చెప్పిన రాజగోపాల్‌ రెడ్డి పొలిటికల్‌ కార్యాచరణ ఏంటన్న విషయంపై స్పష్టత నివ్వకపోవడంతో ఆయనకు కూడా వివేక్‌ పరిస్థితే ఖాయమంటున్నారు.
మరో వివేకాలాగా అయిపోతారా?
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వెంకటస్వామి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ ఎంపీగా గెలిచి తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. మొదట్లో కేసీఆర్‌ తో మంచి సంబంధాలున్న వివేక్ ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. అర్నెళ్లో పార్టీ మారి 2014 ఎంపీగాపోటీ చేసి ఓడిపోయి, తిరిగి మళ్లీ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 టీఆర్ఎస్ నుంచి టిక్కెట్ రాకపోవడంతో బీజేపీ గూటికి చేరారు. ఎంపీ టిక్కెట్‌ ఇవ్వలేదన్న కారణంతో బీజేపీలోకి చేరారు. ఇలా కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌ , టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి రావడంతో ఆయన ఏ పార్టీలో ఉన్నారన్న క్లారిటీ ఓటర్లకు కూడా లేకుండా పోయింది. ఫలితంగా ఎంపీగా గెలవలేకపోయారు. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నా పెద్దగా పేరు మాత్రం వినిపించడం లేదు.
ఇప్పుడిలాంటి కన్ఫ్యూజనే రాజగోపాల్‌ రెడ్డి ఓటర్లలో తీసుకొచ్చారంటే.. రానున్న ఎన్నికల్లో ఆయన ఓడిపోయవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముందుగా ఆయనకు పార్టీ మారాలన్న ఆలోచన ఉందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ ఉంటే భవిష్యత్‌ రాజకీయం బాగుంటుందని సలహా ఇస్తున్నారు.
మరోవైపు బీజేపీ ఆకర్షలో మరికొంతమంది నేతలున్నారన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వాళ్లంతా కాషాయం కప్పుకుంటారని తెలుస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో జంపింగ్‌ జపాంగ్‌ లకు ఇది అవకాశంగా మారింది.

Also Read: Jeevan Reddy: ఆ పని చేస్తే చెప్పులతోనే సత్కారం, జిల్లాలోనే తిరగనివ్వం - ఎంపీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget