అన్వేషించండి

Vijaya Sai Reddy : విజయసాయి రెడ్డి పొలిటికల్‌ రీ-ఎంట్రీ; వైసీపీనా? బీజేపీనా? ట్వీట్ డీ కోడ్‌ ఇదేనా?

వ్యవసాయం చేసుకుంటా రాజకీయాలు వద్దని వెళ్లిపోయిన విజయసాయిరెడ్డి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఏ పార్టీలోకి అనేది మాత్రం సస్పెన్స్‌. ఆయన చేసిన ట్వీట్‌ను రాజకీయ విశ్లేషకులు డీ కోడ్ చేస్తున్నారు.

Vijaya Sai Reddy : "నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానేమో కానీ రాజకీయం మాత్రం నా నుంచి దూరంగా లేదు" అంటూ అప్పట్లో చిరంజీవి చెప్పిన డైలాగ్‌ ఇప్పుడు విజయసాయిరెడ్డికి కరెక్ట్‌గా సరిపోతుంది. తనకు ఈ రాజకీయాలు వద్దు వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయి ఆరు నెలలు దాటింది. అయినా సరే ఆయనను మాత్రం రాజకీయాలు వదలడం లేదు. ఏదో రూపంలో రాజకీయాల్లో ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువైంది. వీటికి తోడు ఆయన చేసిన ట్వీట్ మరింత ఆసక్తిని రేపుతోంది. 

ట్వీట్‌తో సంచలనం 

విజయసాయిరెడ్డి ట్వీట్ చూస్తే మాత్రం ఆయన రాజకీయ రంగ పునఃప్రవేశానికి రెడీ అయినట్టు స్పష్టమవుతోంది. అయితే ఏ పార్టీలోకి వెళ్తారు ఆయనకి ఉన్న ఆప్షన్స్‌ ఏంటో ఒక్కసారి పరిశీలిస్తే...  విజయసాయిరెడ్డి వైసీపీలోకి రావాలని ఓ వర్గం నేతలు బలంగా కోరుకుంటున్నారు. ఈ మధ్య వైసీపీ సోషల్ మీడియాలో కూడా విజయసాయి రెడ్డి రీ ఎంట్రీపై చర్చ సాగింది. దీన్ని కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీలోకి విజయసాయిరెడ్డి వస్తే ప్రత్యర్థులకు చుక్కలే అంటూ కూడా కొందరు కామెంట్ చేశారు. దీన్ని వ్యతిరేకించిన వాళ్లు కూడా అదే రేంజ్‌లో ఉన్నారు. ఆయన్ని నమ్మే పరిస్థితిలో జగన్ లేడనే వాళ్లు లేకపోలేదు. 


Vijaya Sai Reddy : విజయసాయి రెడ్డి పొలిటికల్‌ రీ-ఎంట్రీ; వైసీపీనా? బీజేపీనా? ట్వీట్ డీ కోడ్‌ ఇదేనా?

వైసీపీలోకి వెళ్లగలరా?

అయితే వైసీపీ అధినాయకత్వంపై విజయసాయిరెడ్డి ఘాటుగానే విమర్శలు చేశారు. సజ్జల, వైవి సుబ్బారెడ్డిన టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించారు. జగన్‌పై ఎలాంటి విమర్శలు చేయకపోయినప్పటికీ వారి మాటలు విని తనపై ధ్వేషం పెంచుకున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన్ని మళ్లీ వైసీపీ అక్కున చేర్చుకుంటుందా అనేది అనుమామే. అయితే ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వాళ్లనే జగన్ అక్కున చేర్చుకొని మంత్రిపదవులు ఇచ్చారని వారితో పోల్చుకుంటే విజయసాయిరెడ్డి చాలా బెటర్ అంటున్నారు. బొత్స, ధర్మాన ప్రసాదరావు, వంశీ లాంటి వాళ్లను గుర్తు చేస్తున్నారు. 

సజ్జల, వైవీతో కలిసిపోగలరా?

ఒకవేళ విజయసాయిరెడ్డిని జగన్ ఆహ్వానించినా మిగతా నాయకులతో పొసగడం అంత ఈజీ కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వారిపై విమర్శలు చేసిన వ్యక్తి ఇప్పుడు వారితో కలిసి పని చేసే పరిస్థితి ఉంటుందా అనేది అనుమానే అంటున్నారు. ఆయన స్థాయికి తగ్గట్టు ఉండదని భవిష్యత్‌లో ఎలాంటి పదవుల్లో కూడా ప్రాధాన్యత ఉండకపోవచ్చనే మాట గట్టిగా వినిపిస్తోంది. అందుకే అలాంటి ఆలోచన విజయసాయిరెడ్డి చేయకపోవచ్చని మాట బలంగా వినిపిస్తోంది. 

బీజేపీలోకి గ్రాండ్ వెల్కమ్ గ్యారంటీ!

రెండో ఆప్షన్ బీజేపీ. విజయసాయిరెడ్డికి బీజేపీ అధినాయకత్వం వద్ద మంచి పలుకుబడే ఉంది. వైసీపీతో పోల్చుకుంటే బీజేపీ నేతలతో ఎలాంటి విభేదాలు లేవు. కేవలం రాష్ట్రంలో టీడీపీ, జనసేన నేతలు మాత్రమే అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి నెల్లూరు బీజేపీ వరకు అందరూ ఆయన్నిఆహ్వానించే వాళ్లే అంటున్నారు. ఉన్న రెండు ఆప్షన్స్‌లో దీనికే విజయసాయిరెడ్డి మొగ్గు చూపుతారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

భగవద్గీత శ్లోకంతో హింట్ 

భగవద్గీత శ్లోకం చెప్పిన విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నట్టు హింట్ ఇచ్చారనే వారు ఉన్నారు. ప్రతిపక్షంతోపాటు అన్ని రాజకీయా పార్టీలు రాజధర్మాన్ని పాటించాలనే స్టేట్మెంట్‌తో తన ట్వీట్ ప్రారంభించారు. కర్మణ్యే వాధికారస్తే అనే శ్లోకంతో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కర్మలను ఆచరించడంపైనే అధికారము ఉంటుందని వాటి ఫలితాలపై ఉండదని చెప్పుకొచ్చారు. ఆ ఆ ఫలితాలకు కారణం కాకూడదని అలాగనే పనులు చేయకుండా ఉండొద్దని అన్నారు.  ఇది కచ్చితంగా తన పొలిటికల్ రీ ఎంట్రీపై ఇచ్చిన హింటే అంటున్నారు అభిమానులు. 

ఈ ట్వీట్‌పై మరో వాదన కూడా వినిపిస్తోంది. లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డిని మరోసారి సిట్ పిలిచింది. దానిని ఉద్దేశించే పెట్టి ఉంటారని అంటున్నారు. సిట్ విచారణ ఫలితం ఎలా ఉన్నా సరే నీకు తెలిసింది చెప్పి రావడం ధర్మం అనే యాంగిల్‌లో ఈ ట్వీట్‌ను డీ కోడ్ చేస్తున్నారు మరికొందరు. 

ఏమైనా సరే విజయసాయిరెడ్డి మాత్రం ఒక్క ట్వీట్‌తో అందరి బుర్రలకు పని చెప్పారు. ఆయన సీఏ బుర్రలో ఏముందో తెలియదు కానీ దాన్ని డీ కోడ్ చేసే పని మాత్రం సోషల్ మీడియాకు ఇతరులకు ఇచ్చేశారు. దీనిపై ఎవరు ఎన్ని విశ్లేషణలు చేసినా సిట్ విచారణకు వచ్చినప్పుడు ఆయన చెప్పే విషయాల కోసం మరికొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget