అన్వేషించండి

Prakasam YSRCP: ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌కాశం వైసీపీలో అల‌జ‌డి- పార్టీకి న‌ష్ట‌మా? లాభ‌మా?

ప్ర‌కాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మ‌ధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఎవ‌రికి వారు త‌గ్గ‌క‌పోగా.. కొత్త ఇంచార్జికి కూడా ప‌రీక్ష‌లు పెట్టడంతో ప్ర‌కాశం వైసీపీ గంద‌ర‌గోళంలో ప‌డింది.

Prakasam YSRCP Politics: ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా(Prakasam District)పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప‌ట్టు కోల్పోతోందా?  సంస్క‌ర‌ణ‌ల పేరిట చేప‌ట్టిన మార్పులు ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయా?  నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త‌, ఐక్య‌త కూడా లోపిస్తోందా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రో రెండు మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న తరుణంలో ప్ర‌కాశం జిల్లా వైసీపీలో జ‌రుగుతున్న మార్పులు.. నేత‌ల మ‌ధ్య విభేదాలు స్థానికంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. పదేపదే ప్రాంతీయ సమన్వయకర్తలు మారుతున్నా సమన్వయం చేయలేకపోతున్నారు. 

పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. 
ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన గిద్దలూరు(Giddaluru), కనిగిరి, మార్కాపురం, దర్శి(Darsi), సంతనూతలపాడు, యర్రగొండపాలెం(Yerragondapalem) నియోజకవర్గాల్లోని వైఎస్సార్ సీపీ నేత‌ల మ‌ధ్య‌ అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. ఈ జిల్లాలో తొలుత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత ప్ర‌స్తుత టీటీడీ బోర్డు చైర్మ‌న్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, రాజ్య‌స‌భ స‌భ్యుడు బీదా మస్తాన్‌రావు, అనంతరం రాజ్య‌స‌భ స‌భ్యుడు, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వేణుంబాకం విజయసాయిరెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తలుగా పనిచేశారు. అయినా పార్టీని ఏకతాటిపై నడపడంలో విఫలమయ్యారు. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు మ‌రో సంచ‌ల‌న మార్పు చోటు చేసుకుంది. చంద్ర‌గిరి ఎమ్మెల్యేగా ఉన్న‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ని ప్రాంతీయ సమన్వయకర్తగా నియ‌మించారు. దీంతో స‌మ‌స్య‌లు తీర‌క‌పోగా.. మ‌రింతగా పెరిగాయ‌నే వాద‌న వినిపిస్తోంది.  

చిన్న కార్య‌క్ర‌మం.. పెద్ద గంద‌ర‌గోళం! 
ఒక‌ప్పుడు చిన్న కార్య‌క్ర‌మ‌మైనా.. వైఎస్సార్ సీపీ(YSRCP)లో పెద్ద ఎత్తున ఉత్సాహం ఉండేది. నాయ‌కులు ఎక్క‌డెక్క‌డ నుంచో వ‌చ్చి పాల్గొనేవారు. కానీ, తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి(Ashok Kumar Reddy) ఆధ్వర్యంలో దివంగత మాజీ సీఎం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekarreddy కాంస్య విగ్రహావిష్కరణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. సింగరాయకొండలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప్రాంతీయ సమన్వయకర్త హోదాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. అయినా శ్రేణుల నుంచి పెద్దగా స్పందన క‌నిపించ‌లేదు. భారీగా కార్యకర్తలు హాజరవుతారని ఏర్పాట్లు చేసినా.. ఎక్క‌డా ఆ మేర‌కు రాలేదు. ఇక‌, ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ కొండపిలో మొదటి నుంచి వరికూటి అశోక్‌బాబు వ‌ర్గం మాదాసి వెంక‌య్య వ‌ర్గాల‌కు మ‌ధ్య వివాదం ఉంది. దీంతో వీరిద్ద‌రూ కూడా ఈ కార్య‌క్ర‌మానికి ముఖం చాటేశారు. యర్రగొండపాలెం కొత్త సమన్వయకర్తగా నియ‌మితులైన‌ తాటిపర్తి చంద్రశేఖర్‌ వర్గానికి కూడా ఆహ్వానం లేద‌ని స‌మాచారం. దీంతో వారు కూడా దూరంగానే ఉన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు సామంతుల రవికుమార్‌రెడ్డి హాజరైనా శిలాఫలకంపై పేరు లేకపోవడంతో కినుక వహించి వేదిక పైకి వెళ్లలేదు. 

ఆదిమూల‌పు సురేష్‌కు సెగ‌!
ఇటీవ‌ల ఎమ్మెల్యే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గానికి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ప్ర‌స్తుత మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ను నియ‌మించారు. అయితే.. ఆయ‌న ఇక్క‌డ‌కు వచ్చి రెండు నెలలు దాటిపోయింది. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయినప్పటికీ వర్గ విభేదాలు చక్కదిద్దడంలో విఫలమవుతున్నారు. రాష్ట్ర సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్‌రావు మాత్రమే ఆయన వెన్నంటి నడుస్తున్నారు. మిగిలిన వర్గాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో సహకరించ‌డం లేదు. 

ర‌గులుతున్న బాలినేని 
వైఎస్సార్ సీపీ అధిష్టానం వైఖ‌రిపై ఇటీవ‌ల కాలంలో విముఖ‌త వ్య‌క్తం చేస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి లోలోన ర‌గిలిపోతున్నారు.  ఒంగోలు ఎంపీ స్థానాన్ని మాగుంట శ్రీనివాసులురెడ్డికే కేటాయించాలంటూ ఆయ‌న ప‌ట్టిన ప‌ట్టును పార్టీ అధిష్ఠానం ప‌ట్టించుకోలేదు. అంతేకాదు.. ఆ వెంట‌నే ఈ స్థానానికి తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని రంగంలోకి దించింది. ఎంపీ మాగుంట కోసం పట్టుబట్టిన బాలినేని.. ఒంగోలు ఇళ్లపట్టాలకు నిధుల కేటాయింపు, సీఎంతో సంప్రదింపుల అనంతరం మెత్తబడ్డారు. నూతన సమన్వయకర్త చెవిరెడ్డితో సర్దుకుపోయారు. ఈ పరిణామాల తర్వాత ఇటు మాగుంట, అటు బాలినేని ఇద్దరూ ఏ వేదిక పైనా ఇంతవరకు తారసపడలేదు. మ‌రోవైపు.. నూత‌న స‌మ‌న్వ‌య క‌ర్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అంద‌రినీ క‌లుపుకొని పోవాల‌ని భావిస్తున్నా.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు మాత్రం ఆయ‌న‌కు క‌లిసి రావ‌డం లేదేని అంటున్నారు. 

క‌లిసి వ‌చ్చేనా? 
ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో గ‌త 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాల్లో(చీరాల‌-ప‌ర్చూరు-అద్దంకి-కొండ‌పి) విజ‌యం ద‌క్కించుకుంది. వీరిలో ఒకరు పార్టీ ఫిరాయించి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా మారారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆ సీట్లు కూడా తాము ద‌క్కించుకోవాల‌ని వైఎస్సార్ సీపీ భావిస్తున్నా.. ఆ మేర‌కు క్షేత్ర‌స్థాయిలో అయితే ప‌రిస్థితి క‌లిసి రావ‌డం లేద‌ని పార్టీ సీనియ‌ర్లు న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

GenZ Politics India: నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న జెన్జీ ట్రెండ్ !
నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న GenZ ట్రెండ్ !
Pawan Kalyan Political Strategy: పవన్ కళ్యాణ్ పక్కా పొలిటికల్ స్కెచ్ - జనసేన 36 వేల దరఖాస్తుల సునామీ... టీడీపీకి రాబోయే రోజుల్లో చెక్ తప్పదా?
పవన్ కళ్యాణ్ పక్కా పొలిటికల్ స్కెచ్ - జనసేన 36 వేల దరఖాస్తుల సునామీ... టీడీపీకి రాబోయే రోజుల్లో చెక్ తప్పదా?
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Embed widget