అన్వేషించండి

Madhuyashki on KCR: కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప, అధోగతి పాలు: మధుయాష్కి

తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని... కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని విమర్శించారు కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రాష్ట్ర దుస్థితిని కాగ్ నివేదిక బయటపట్టిందన్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్. కాంగ్రెస్ ఇచ్చిన సంపన్న తెలంగాణ రాష్ట్రం ముదనష్టపు బీఆర్ఎస్  పాలనలో అప్పులు కుప్పగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయిందని సాక్షాత్తు కాగ్ రిపోర్ట్‌ చెప్తోందన్నారు. బడ్జెట్ రణాలు,  గ్యారంటీలు కలిసి రాష్ట్రాన్ని నిట్టనిలువునా అప్పుల్లో ముంచేశాయన్నారు. 

తెచ్చిన అప్పులు ఏ కలుగులో ఉన్నాయో.. ఎవరి బొక్కసంలో భద్రంగా ఉన్నాయో ప్రజలంతా అర్థం  చేసుకోవాల్సిన సమయం ఇదే అన్నారు మధుయాష్కీ. ఇవన్నీ ప్రగతి భవన్ నేలమాళిగలో దాక్కున్నాయి కనుకే దేశమంతా ఎన్నికల ఖర్చును భరిస్తాననే స్థాయికి కేసీఆర్  అవినీతి చేరిందని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ వచ్చినప్పటినుంచి గత తొమ్మిదిన్నర ఏళ్లుగా తెలంగాణ ప్రజలని తాగుడుకు బానిసలు చేసి.. రక్తమాంసాలను సైతం పీక్కుతిని 2 లక్షల కోట్ల రూపాయాలుగా  మార్చుకున్నాడని ఆరోపించారు. అసరా పింఛన్ల రూపంలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విదిల్చిన ముష్టి... కేవలం 68వేల కోట్ల రూపాయాలు మాత్రమేనని అన్నారాయన.  

తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిట్టనిలువునా చంశారని దుయ్యబట్టారు. కాళేశ్వరం పేరుతో మేడిగడ్డ, అన్నారం, సుందళ్ల వంటి మూడు చెక్  డ్యాములు కట్టి.. లక్ష కోట్ల రూపాయాలను కేసీఆర్ దోచేశాడని ఫైరయ్యారు. కాళ్లేశ్వరం నీళ్లు అని చెప్తున్న కేసీఆర్.. ఆ ప్రాజెక్టుకు సంబంధించి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్,  పొలాలకు నీళ్లు తీసుకెళ్లే డిస్టిబ్యూటరీ కెనాల్స్‌ను ఎక్కడైనా ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణ భూములకు పారుతున్న నీళ్లన్నీ నాడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు,  వాటికి తవ్విన కాలువల ద్వారా మాత్రమే ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక వినానం వైపు తీసుకెళ్లిన్న పొలిటికల్ టెర్రరిస్ట్ కేసీఆర్‌కు తెలంగాణ బిడ్డలు వచ్చే ఎన్నికల్లో  మర్చిపోలేని గుణపాఠం చెప్తారన్నారు మధుయాష్కీ. 

మద్యం ద్వారా కేసీఆర్‌కు ఇప్పటి వరకు రెండు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే.. ఆసరా పింఛన్ల కోసం బడ్జెట్‌లో కేటాయించింది రూ.68,065.36కోట్లు మాత్రమే ఖర్చు  పెట్టాడంటూ లెక్కలు చూపించారు. మద్యం ద్వారా 2014-15లో రూ.10,238 కోట్లు ఆదాయం వస్తే... ఆ ఏడాదిలో ఆసరా పింఛన్ల కోసం రూ.1,317.77 కోట్లు ఖర్చు చేశారు.  2015-16లో మద్యం ద్వారా రూ.12,200 కోట్ల ఆదాయం వస్తే.. ఆసరా పింఛన్ల కోసం రూ.4వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. అలాగే, 2016, 17లో మద్యం ద్వారా  రూ.14,092కోట్లు ఆదాయం రాగా... ఆసరా పింఛన్ల కొసం రూ.4,693 ఖర్చు చేశారు. 2017-18లో మద్యం ద్వారా రూ.17,683 కోట్లు ఆదాయం వస్తే... ఆసరా ఫించన్ల కోసం  రూ.5,330.59 కోట్లు ఖర్చు చేశారు. ఇక, 2018-19లో మద్యం ద్వారా రూ.20,447కోట్లు ఆదాయం వస్తే... పింఛన్ల కోసం రూ.5,300 కోట్లు ఖర్చు చేశారన్నారు.

అలాగే.. 2019-20లో మద్యం ద్వారా రూ. 22,209 కోట్లు ఆదాయం రాగా.. ఫించన్ల కోసం ఖర్చు చేసింది రూ.12వేల కోట్లు. 2021-22లో మద్యం ఆదాయం రూ.30,  733కోట్లు కాగా... పింఛన్ల కోసం ఖర్చు చేసింది రూ.11,726 కోట్లు. 2022-23లో మద్యం ఆదాయం రూ.35,145కోట్లు.. పింఛన్ల ఖర్చు రూ.11,728కోట్లు, 2023-24లో  మద్యం ఆదాయం రూ.15,346 కోట్లు.. పింఛన ఖర్చు రూ. 12వేల కోట్లని లెక్కలు చెప్పారు మధుయాష్కీ. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget