అన్వేషించండి

YSRCP News: ఎట్టకేలకు జగన్ ను కలిసిన బాలినేని- రెండు ఆప్షన్లు ఇచ్చిన సీఎం- మాగుంటకు నో టికెట్

YSRCP 4th List: పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ల నాలుగో జాబితాపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. మూడు జాబితాల్లో 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారు.

Balineni Met With Jagan : పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జులు మార్పులతో సీఎం జగన్‌ నాలుగో జాబితా సిద్ధం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్న సీఎం జగన్‌...టికెట్ల కేటాయింపులో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. మూడు జాబితాలను రిలీజ్ చేసిన  చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి... నాలుగో జాబితాపై కసరత్తు చేస్తున్నారు. సర్వేల్లో రిపోర్టులు అనుకూలంగా లేకపోతే...ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గెలిచే వారికే టికెట్‌ అని చెప్పేస్తున్నారు.  అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రత్యర్థులు ఎత్తులు చిత్తయ్యేలా...కూటమికి ఝలక్‌ ఇచ్చేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా...మంత్రులయినా...మాజీ మంత్రులైనా...ఎంపీలయినా సరే...దుకాణం సర్దుకోవాల్సిందేనని ఖరాఖండిగా చెబుతున్నారు. ఎన్నికల బరిలోకి దించితే గెలుస్తున్నారా లేదా అన్న దానికే సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు. 

తాడేపల్లికి జగ్గిరెడ్డి, గోపిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి 

పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ల నాలుగో జాబితాపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. మూడు జాబితాల్లో 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారు. ఆరు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. నాలుగో లిస్టును ఎంత మందికి సీట్లు ఖరారు చేస్తారు ? సిట్టింగ్ లు ఎంత మందికి టికెట్ ఇస్తారు ? కొత్త వారికి ఏ యే నియోజకవర్గాల్లో బరిలోకి దించుతారు ? ఇంకెంత మంది టికెట్లు గల్లంతు అవుతాయోనని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, నేతల తాడేపల్లి క్యాంపు కార్యాలయం సీఎంవోకు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి, శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, క్యాంపు కార్యాలయానికి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డితో మంతనాలు జరిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి ఎమ్మెల్యేలతో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుపై చర్చించారు.

ఎట్టకేలకు బాలినేనికి జగన్ అపాయింట్ మెంట్
మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డికి జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. సీఎంవో సహా ముఖ్యనేతల సంప్రదింపులతో ఎట్టకేలకు బాలినేని తాడేపల్లికి వచ్చారు. తొలుత ధనుంజయరెడ్డి, ముఖ్యనేతలతో మంతనాలు జరిపారు. అనంతరం సీఎం జగన్‌ని కలిసి నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రకాశం జిల్లాలో తనకు చెప్పకుండా పలు నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చడంపై బాలినేని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గిద్దలూరు, దర్శి, కొండేపి ఇంఛార్జుల నియామకం విషయంలో  తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒంగోలు ఎంపీ సీటు మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు. తన నియోజకవర్గంలో పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కొద్దిరోజులుగా జిల్లాలో ఎవరికీ అందుబాటులోకి రాకుండా హైదరాబాద్‌కి వెళ్లారు. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపురావడంతో జగన్ తో సమావేశం అయ్యారు. 

అయితే మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పేసినట్టు టాక్. బాలినేనికి రెండు ఆప్షన్లు కూడా ఇచ్చారట. ఒంగోలు నుంచి పోటీ చేస్తారా.. గిద్దలూరు వెళ్తారో తేల్చోవాలని చెప్పారని తెలుస్తోంది. అయితే తన నియోజకవర్గంలో ఇంటి సమస్య తీర్చినట్టైతే పోటీపై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారని చెప్పుకుంటున్నారు. అధికారులతో మాట్లాడి ఖర్చుపై చర్చించి నిర్ణయం చెబుతామని జగన్ సమాధానం ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్‌ స్టెప్ ఏంటన్నది ఆసక్తిగా మారింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Virat Kohli Anushka Sharma Trolls: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
Train Tickets: ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
Bigg Boss Telugu Emmanuel Promo : స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
Embed widget