అన్వేషించండి

MP Midhun Reddy: బోగస్ ఓట్లతోనే కుప్పంలో చంద్రబాబుకు మెజారిటీ: ఎంపీ మిథున్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

YSRCP MP Midhun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో రాజకీయ పరిస్ధితులు ప్రత్యేకంగా ఉన్నాయని,‌ చంద్రబాబుకు వచ్చిన మెజారిటీతో అర్థం బోగస్ ఓట్ల అని ఆయన ఆరోపించారు. 

చిత్తూరు : టిడిపి అధినేత‌ నారా చంద్రబాబు నాయుడు బోగస్ ఓట్లతో మెజారిటీ సాధిస్తున్నారని వైసీపి‌ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం సాయంత్రం కుప్పంలోని ఎం.ఎం మహల్ లో స్ధానిక వైసీపి‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశంమైన ఎంపీ‌ మిధున్‌ రెడ్డి నాయకులకు,‌ కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. అనంతరం ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో రాజకీయ పరిస్ధితులు ప్రత్యేకంగా ఉన్నాయని,‌ చంద్రబాబుకు వచ్చిన మెజారిటీతో అర్థం బోగస్ ఓట్ల అని ఆయన ఆరోపించారు. 
కుప్పంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు
కుప్పం నియోజకవర్గంలో చాలా బోగస్ ఓట్లు ఉన్నాయని, దీనిపై పిర్యాదు చేశాంమని, ఇప్పటికే అధికారులకు పిర్యాదు చేసి దొంగ ఓట్లను తొలగించాంమన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటుగా కుప్పంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 36 వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై తప్పకుండా కేంద్ర ఎలక్షన్ దృష్టికి తీసుకెళ్తాంమన్నారు. అంతే కాకుండా మునిసిపల్ ఎన్నికల్లో 55 శాతం ఓట్లు మాత్రమే పోల్ అయిందని, ఎక్కువ శాతం మంది తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి దొంగ ఓట్లు వేయడానికి వచ్చినట్లు ఆయన చెప్పారు. 
భరత్ ను గెలిపించేందుకు సిద్దం
ఓటర్లుగా లేని వారి ఓటర్లను తొలగించాలని, ఒక పంచాయతీలో ఉండే వాళ్లకు మరొక పంచాయతీలో దొంగ ఓటు ఉందన్నారు. అయితే 2024 లో జరయగబోయే కుప్పం ఎన్నికల్లో ప్రజలు భరత్ ను గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పిన ఆయన, ఏప్రిల్ లోపు కుప్పంలో హంద్రీనీవా పనులు పూర్తి అవుతుందన్నారు. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నారని, చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదగా మాట్లాడాలన్నారు. చంద్రబాబు ప్రజల మనస్సులను గెలవడం మానేసి, అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఫ్రస్టేషన్ బాగా పెరిగిపోయిందని, ఆ ఫ్రెస్టేషన్ తోనే పండుగ పూట కూడా మా మంత్రిని నోటికి వచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు. 

ఇంతక ముందు చంద్రబాబు వేరు అని, ఇప్పడు చంద్రబాబు వేరే అని ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి కుప్పంలో టీడీపీ నేతలే రౌడిజం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖచ్చితంగా రాబోవు ఎన్నికల్లో కుప్పంలో వైసీపి చంద్రబాబును ఓడిస్తుందని ఆయన ధీమా‌ వ్యక్తం చేశారు. నారా లోకేష్ పాదయాత్రపై స్పందిస్తూ రాష్ట్రంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చని, ఎవరు పాదయాత్ర చేసుకున్న మాకు ఇబ్బంది లేదని, అంతే గానీ చంద్రబాబు లాగా లోకేష్ మాట్లాడితే ఊరుకునేది లేదని వైసీపి ఎంపీ‌ మిథున్ రెడ్డి హెచ్చరించారు.

కారు ప్రమాదంపై వైసీపీ నేతల కామెంట్స్... 
మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం వైసీపీ శ్రేణులలో కలకలం రేపింది. అయితే ఇరువురు నేతలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవటంతో వైసీపీ నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల చిత్తూరు కేంద్రంగా టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి మధ్య రాజకీయంగా హాట్ కామెంట్స్, సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఇదే సమయంలో పెద్దిరెడ్డి ఆయన కుమారుడైన ఎంపీ మిథున్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావటంపై కుట్ర కోణం దాగి ఉందని వైసీపీ శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, విచారణ జరిపించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ చేయించాలని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Assam Assembly Elections 2026: అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?
అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?
Preethi Reddy Politics: మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రాజకీయ దూకుడు - బీఆర్ఎస్ కాదు బీజేపీ వైపే చూస్తున్నారా?
మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రాజకీయ దూకుడు - బీఆర్ఎస్ కాదు బీజేపీ వైపే చూస్తున్నారా?
YSRCP coterie problem: వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Embed widget