అన్వేషించండి

MP Midhun Reddy: బోగస్ ఓట్లతోనే కుప్పంలో చంద్రబాబుకు మెజారిటీ: ఎంపీ మిథున్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

YSRCP MP Midhun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో రాజకీయ పరిస్ధితులు ప్రత్యేకంగా ఉన్నాయని,‌ చంద్రబాబుకు వచ్చిన మెజారిటీతో అర్థం బోగస్ ఓట్ల అని ఆయన ఆరోపించారు. 

చిత్తూరు : టిడిపి అధినేత‌ నారా చంద్రబాబు నాయుడు బోగస్ ఓట్లతో మెజారిటీ సాధిస్తున్నారని వైసీపి‌ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం సాయంత్రం కుప్పంలోని ఎం.ఎం మహల్ లో స్ధానిక వైసీపి‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశంమైన ఎంపీ‌ మిధున్‌ రెడ్డి నాయకులకు,‌ కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. అనంతరం ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో రాజకీయ పరిస్ధితులు ప్రత్యేకంగా ఉన్నాయని,‌ చంద్రబాబుకు వచ్చిన మెజారిటీతో అర్థం బోగస్ ఓట్ల అని ఆయన ఆరోపించారు. 
కుప్పంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు
కుప్పం నియోజకవర్గంలో చాలా బోగస్ ఓట్లు ఉన్నాయని, దీనిపై పిర్యాదు చేశాంమని, ఇప్పటికే అధికారులకు పిర్యాదు చేసి దొంగ ఓట్లను తొలగించాంమన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటుగా కుప్పంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 36 వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై తప్పకుండా కేంద్ర ఎలక్షన్ దృష్టికి తీసుకెళ్తాంమన్నారు. అంతే కాకుండా మునిసిపల్ ఎన్నికల్లో 55 శాతం ఓట్లు మాత్రమే పోల్ అయిందని, ఎక్కువ శాతం మంది తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి దొంగ ఓట్లు వేయడానికి వచ్చినట్లు ఆయన చెప్పారు. 
భరత్ ను గెలిపించేందుకు సిద్దం
ఓటర్లుగా లేని వారి ఓటర్లను తొలగించాలని, ఒక పంచాయతీలో ఉండే వాళ్లకు మరొక పంచాయతీలో దొంగ ఓటు ఉందన్నారు. అయితే 2024 లో జరయగబోయే కుప్పం ఎన్నికల్లో ప్రజలు భరత్ ను గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పిన ఆయన, ఏప్రిల్ లోపు కుప్పంలో హంద్రీనీవా పనులు పూర్తి అవుతుందన్నారు. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నారని, చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదగా మాట్లాడాలన్నారు. చంద్రబాబు ప్రజల మనస్సులను గెలవడం మానేసి, అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఫ్రస్టేషన్ బాగా పెరిగిపోయిందని, ఆ ఫ్రెస్టేషన్ తోనే పండుగ పూట కూడా మా మంత్రిని నోటికి వచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు. 

ఇంతక ముందు చంద్రబాబు వేరు అని, ఇప్పడు చంద్రబాబు వేరే అని ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి కుప్పంలో టీడీపీ నేతలే రౌడిజం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖచ్చితంగా రాబోవు ఎన్నికల్లో కుప్పంలో వైసీపి చంద్రబాబును ఓడిస్తుందని ఆయన ధీమా‌ వ్యక్తం చేశారు. నారా లోకేష్ పాదయాత్రపై స్పందిస్తూ రాష్ట్రంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చని, ఎవరు పాదయాత్ర చేసుకున్న మాకు ఇబ్బంది లేదని, అంతే గానీ చంద్రబాబు లాగా లోకేష్ మాట్లాడితే ఊరుకునేది లేదని వైసీపి ఎంపీ‌ మిథున్ రెడ్డి హెచ్చరించారు.

కారు ప్రమాదంపై వైసీపీ నేతల కామెంట్స్... 
మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం వైసీపీ శ్రేణులలో కలకలం రేపింది. అయితే ఇరువురు నేతలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవటంతో వైసీపీ నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల చిత్తూరు కేంద్రంగా టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి మధ్య రాజకీయంగా హాట్ కామెంట్స్, సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఇదే సమయంలో పెద్దిరెడ్డి ఆయన కుమారుడైన ఎంపీ మిథున్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావటంపై కుట్ర కోణం దాగి ఉందని వైసీపీ శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, విచారణ జరిపించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ చేయించాలని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు డిమాండ్ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Telangana Graduate MLC Elections 2027: పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget