అన్వేషించండి

Chandrababu Naidu: అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ బ్లాక్‌ మెయిల్‌ పాలిటిక్స్, ఎక్కడికక్కడ విధ్వంసం- చంద్రబాబు

Chandrababu Naidu: సీఎం జగన్‌ పని అయిపోయిందని, మరో ఆరు నెలల్లో ఇంటికి పోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Chandrababu Naidu: సీఎం జగన్‌ పని అయిపోయిందని, మరో ఆరు నెలల్లో ఇంటికి పోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో తప్పుడు సర్వేలతో వైసీపీ ప్రజలను మభ్యపెడుతోందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తన 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. రాజకీయ కక్ష సాధిస్తూ ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

2024 ఎన్నికల్లో వైసీపీ వంద శాతం చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  జగన్‌ను చూసి ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందన్నారు. జగన్‌ను భరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని, వైసీపీ పతనం అనే స్ర్కిప్ట్‌‌ను దేవుడు  తిరగరాశాడని అన్నారు. ప్రజల్లో మమేకమై వైసీపీ ఆగడాలు అరికడదామని నేతలకు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఓటర్లు టీడీపీ వైపే ఉన్నారని అన్నారు. ఇండియాటుడే సీ ఓటర్‌ సర్వే ప్రకారం 2024 ఎన్నికల్లో టీడీపీకి 15 ఎంపీ స్థానాలు రావడం ఖాయమన్నారు. టీడీపీ హాయంలో సంక్షేమానికి పెద్ద పీట వేశామన్నారు. నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రం అన్ని విధాలుగా వెనుకబడిపోయిందని, ఈ నాలుగున్నర ఏళ్లలో ప్రజలు ఏం నష్టపోయారో చెప్పాలన్నారు.

వైసీపీ శ్రేణులే దాడులకు చేసి, తిరిగి టీడీపీ శ్రేణులపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. అంగళ్లు, పుంగనూరుల్లో తనను అడ్డుకుని దాడి చేసేందుకు యత్నించారని, దాడులను అడ్డుకున్న టీడీపీ శ్రేణులపై కేసులు పెట్టారని అన్నారు. సెప్టెంబర్ 1 కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. రాబోయే 45 రోజుల పాటు మూడు దశల్లో కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. బూత్ ల వారీగా రోజుకు 10 ఇళ్ల చొప్పున నేతలు వెళ్లాల్సి ఉంటుందన్నారు. యూనిట్, క్లష్టర్ల వారీగా కార్యక్రమం పూర్తవుతందన్నారు.

ప్రజా వేదిక కార్యక్రమం ద్వారా యూనిట్ వారీగా ముఖ్యమైన పంచాయతీల్లో పాదయాత్ర చేసి డోర్ టు డోర్ క్యాంపెయన్, బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. భవిష్యత్తుకు గ్యారెంటీ బాబు భరోసా కింద ఏం చేయబోతున్నామో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత టీడీపీ శ్రేణులపై ఉందన్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాల తరహాలో కొత్త కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. తాను కూడా 30 నియోజకర్గాల్లో పర్యటిస్తానని చెప్పారు. ఆరేడు నెలల్లో ఎన్నికలు వస్తాయని, రాష్ట్రంలో ఓటర్లలో 75 శాతం మంది అంటే మూడు కోట్ల మంది ఓటర్లను కలవాలన్నారు. ఎన్నికల నాటికి 100 శాతం కలవగలిగితే గెలుపు సులువు అవుతుందన్నారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలంతా టీడీపీతో కలిసి నడవాలన్నారు. ‘నిన్నిక భరించలేం.. బై బై జగన్‌’ ఇదే అందరి నినాదం కావాలన్నారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఎల్లుండి నుంచి ఆందోళనలు చేపట్టనున్నట్లు చెప్పారు. జగన్‌, పెద్దిరెడ్డి, జే-గ్యాంగ్‌  రూ.40వేల కోట్ల విలువైన ఇసుక దోచేశారని ఆరోపించారు. 98శాతం హామీలు అమలు చేశామంటూ వైసీపీ అబద్దాలు చెబుతోందన్నారు. టీటీడీ బోర్డు సభ్యులుగా నేరగాళ్లకు స్థానం కల్పిస్తారా అంటూ నిలదీశారు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటో ప్రజలకు వివరించాలన్నారు. ‘బాబు భరోసా.. భవిష్యత్తుకు గ్యారెంటీ.. అనేదే తమ నినాదం’ అని చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Bhu Bharati Scams: ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
YSRCP Viral Video : 'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
Hyderabad TDR Policy 2026: మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
Iran vs America : ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు! ఇకపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయం!
ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు! ఇకపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయం!

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Bhu Bharati Scams: ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
YSRCP Viral Video : 'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
Hyderabad TDR Policy 2026: మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
Iran vs America : ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు! ఇకపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయం!
ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు! ఇకపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయం!
The Raja Saab Box Office Collection Day 8: బాక్స్ ఆఫీస్ బరిలో ప్రభాస్ 'రాజా సాబ్' బోల్తా... ఇండియాలో 8 రోజుల నెట్ కలెక్షన్ ఎంతంటే?
బాక్స్ ఆఫీస్ బరిలో ప్రభాస్ 'రాజా సాబ్' బోల్తా... ఇండియాలో 8 రోజుల నెట్ కలెక్షన్ ఎంతంటే?
Dog Viral Video:హనుమంతుని విగ్రహం చుట్టూ కుక్క 72 గంటలుగా ప్రదక్షిణలు! వైరల్ అవుతున్న వీడియో చూశారా?
హనుమంతుని విగ్రహం చుట్టూ కుక్క 72 గంటలుగా ప్రదక్షిణలు! వైరల్ అవుతున్న వీడియో చూశారా?
RBI jobs: పదో తరగతి క్వాలిఫికేషన్‌తో RBIలో ఉద్యోగం, ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు ఆఖరు తేదీ?
పదో తరగతి క్వాలిఫికేషన్‌తో RBIలో ఉద్యోగం, ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు ఆఖరు తేదీ?
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
Embed widget