అన్వేషించండి

Chandrababu Warning to MLAs : ఎమ్మెల్యేల చేతులు కట్టేస్తున్న చంద్రబాబు - ఇసుక, లిక్కర్ జోలికెళ్తే అంతే - ఇక వారికి దారేది ?

TDP : ఇసుక, మద్యం వంటి వాటిల్లో జోక్యం చేసుకోకుండా ఎమ్మెల్యేలను చంద్రబాబు నిలువరిస్తున్నారు. చాన్స్ దొరికినప్పడల్లా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలకు ఆదాయ మార్గాలు లేకుండా పోతున్నాయి.

Chandrababu Warning to TDP MLAs :   ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఎమ్మెల్యేల వల్లే వస్తుంది. సంపాదన కోసం వారు నియోజకవర్గంలో ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకోవడం.. ప్రతి పని తమ కనుసన్నల్లో జరగాలని కోరుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. గత అనుభవాలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ సారి రూటు మార్చారు. ఎమ్మెల్యేలను మొదటి నుంచి కట్టడి చేసి సరైన మార్గంలో వెళ్లేలా చేయాలనుకుంటున్నారు. అందుకే సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా కేబినెట్ భేటీలోనూ అదే చెప్పారు. ప్రత్యేకంగా టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి అవే హెచ్చరికలు వినిపించబోతున్నారు. 

ఉచిత ఇసుక, లిక్కర్ టెండర్లలో జోక్యం చేసుకున్నారని టీడీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు

గత ప్రభుత్వం ఇసుక దోపిడికి పాల్పడిందని టీడీపీ ఆరోపిస్తూ వచ్చింది. అందుకే తాము రాగానే ఉచిత ఇసుక పాలసీ ఇస్తామని హామీ ఇచ్చింది. అన్నట్లుగానే ఉచిత ఇసుక పాలసీ తెచ్చింది. కానీ చాలా చోట్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం ఎమ్మెల్యేల జోక్యమేనని ఆరోపణలు వచ్చాయి. తాజాగా లిక్కర్ పాలసీ విషయంలో కొంత మంది ఎమ్మెల్యేలు జోక్యం చేసుకున్నారని నివేదికలు చంద్రబాబుకు వచ్చాయి. సిండికేట్ అయ్యారని.. లాటరీల్లో దుకాణాలు వచ్చిన వారిని బెదిరించారని ఇలా పలు రకాలుగా చెప్పుకున్నారు. దీంతో చంద్రబాబు నేరుగా  ఇంటలిజెన్స్ నుంచి నివేదికలు తెప్పించుకుని ఇలాంటి పనులు చేస్తున్న వారికి హెచ్చరిక సంకేతాలు పంపించారు. 

త్వరలో చంద్రబాబుకు NSG సెక్యూరిటీ తొలగింపు - కేంద్రం కీలక నిర్ణయం

ఎమ్మెల్యేల తీరుతో ప్రజావ్యతిరేకత పెరగకుండా చర్యలు 

ఎమ్మెల్యేలు ఇలా అక్రమ సంపాదనకు అలవాటు పడకుండా చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొదట్లోనే వారిని అడ్డుకుంటే సమస్య ఉండదని అనుకుంటున్నారు. నిజానికి ఇసుక, లిక్కర్ అనేది ఎమ్మెల్యేలకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగా ఉండేది. గత ప్రభుత్వంలో ఇది కేవలం పై స్థాయిలో ఉన్న వారికి మాత్రం ఆదాయవనరుగా మారిందని అందుకే వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని చెబుతారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పాత విధానాలే తీసుకు వచ్చినా నిజాయితీగా లిక్కర్ దుకాణాలను వేలంపాటలో దక్కించుకునే పర్వాలేదు కానీ దందాలు చేయాలనుకుంటే మాత్రం సాధ్యం కాదని సంకేతాలు పంపుతున్నారు. ఇలా ఎమ్మెల్యేలు లిక్కర్, ఇసుకల్లో పదే పదే జోక్యం చేసుకుంటే ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు వారిని కట్టడి చేస్తున్నారు. 

జగన్ ఇంటి చుట్టూ ఇనుప కట్టడానికి ఖర్చు రూ. 12 కోట్ల పైనే -అంతా ప్రజా ధనమే ! జీవో రిలీజ్ చేసిన టీడీపీ

టీడీఎల్పీ భేటీలో గట్టిగా వార్నింగ్ ఇవ్వనున్న చంద్రబాబు 

అయితే ఎమ్మెల్యేలు తమకు ఆదాయ మార్గాలేమిటని మథనపడే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయాలు చేయాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. పార్టీ క్యాడర్ ను చూసుకోవాలి. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. మరి వీటికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందన్న ఆవేదన ఎమ్మెల్యేల్లో కనిపించే అవకాశం ఉంది. నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటే ప్రభుత్వం తరపున పార్టీ నుంచి సహకారం అందుతుంది కానీ.. అక్రమ వ్యాపారాలకు సహకరించే ప్రశ్నే లేదని చంద్రబాబు స్పష్టం చేయనున్నారు.ఇందు కోసం టీడీపీ ఎల్పీ సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు ఎమ్మెల్యేలకు తన పాలసీని స్పష్టం చేయనున్నారు. గీత దాటిదే ఎవర్నీ వదిలేది లేదని హెచ్చరించే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Mains Exam: తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలి, అశోక్ నగర్‌లో అభ్యర్థుల నిరసన - స్పందించిన కేటీఆర్
తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలి, అశోక్ నగర్‌లో అభ్యర్థుల నిరసన - స్పందించిన కేటీఆర్
GHMC Commissioner: ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి- వాళ్లను రిలీవ్ చేసిన సర్కార్
ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి- వాళ్లను రిలీవ్ చేసిన సర్కార్
Maruti Suzuki Fronx: సేల్స్‌లో రికార్డు సృష్టిస్తున్న మారుతి సుజుకి కారు - మార్కెట్లో భారీ డిమాండ్!
సేల్స్‌లో రికార్డు సృష్టిస్తున్న మారుతి సుజుకి కారు - మార్కెట్లో భారీ డిమాండ్!
New Lady of Justice Statue: న్యాయదేవత కళ్లకు తొలగిన గంతలు, కొత్త విగ్రహంలో ఈ మార్పులు గమనించారా!
న్యాయదేవత కళ్లకు తొలగిన గంతలు, కొత్త విగ్రహంలో ఈ మార్పులు గమనించారా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vizianagaram Pydithalli sirimanu utsavam | విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం ఎప్పుడైనా చూశారా.? | ABPNita Ambani on Ratan Tata | రతన్ టాటాపై నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు | ABP Desamఅద్దె కంప్యూటర్‌తో 100 Cr. టర్నోవర్, రాజమండ్రిలోనే సాఫ్ట్‌వేర్ కంపెనీహెజ్బుల్లా రహస్య సొరంగం వీడియో షేర్ చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Mains Exam: తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలి, అశోక్ నగర్‌లో అభ్యర్థుల నిరసన - స్పందించిన కేటీఆర్
తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలి, అశోక్ నగర్‌లో అభ్యర్థుల నిరసన - స్పందించిన కేటీఆర్
GHMC Commissioner: ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి- వాళ్లను రిలీవ్ చేసిన సర్కార్
ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి- వాళ్లను రిలీవ్ చేసిన సర్కార్
Maruti Suzuki Fronx: సేల్స్‌లో రికార్డు సృష్టిస్తున్న మారుతి సుజుకి కారు - మార్కెట్లో భారీ డిమాండ్!
సేల్స్‌లో రికార్డు సృష్టిస్తున్న మారుతి సుజుకి కారు - మార్కెట్లో భారీ డిమాండ్!
New Lady of Justice Statue: న్యాయదేవత కళ్లకు తొలగిన గంతలు, కొత్త విగ్రహంలో ఈ మార్పులు గమనించారా!
న్యాయదేవత కళ్లకు తొలగిన గంతలు, కొత్త విగ్రహంలో ఈ మార్పులు గమనించారా!
AP Cabinet Decisions: చెత్త పన్ను రద్దుకు తీర్మానం, 6 కొత్త పాలసీలకు ఆమోదం- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే
చెత్త పన్ను రద్దుకు తీర్మానం, 6 కొత్త పాలసీలకు ఆమోదం- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే
Android 15: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ - 15 అప్‌డేట్ వచ్చేసింది - ఏ ఫోన్లకో తెలుసా?
ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ - 15 అప్‌డేట్ వచ్చేసింది - ఏ ఫోన్లకో తెలుసా?
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్, తిరుమలకు వెళ్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందులే
శ్రీవారి భక్తులకు అలర్ట్, తిరుమలకు వెళ్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందులే
Medak Road Accident: మెదక్ జిల్లాలో రోడ్డుప్రమాదంలో ఏడుగురి దుర్మరణం - హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి
మెదక్ జిల్లాలో రోడ్డుప్రమాదంలో ఏడుగురి దుర్మరణం - హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి
Embed widget