అన్వేషించండి

పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న గులాబీ పార్టీ, జనవరి 3 నుంచి సమీక్ష సమావేశాలు

శాసనసభ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ...పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ తరపున ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

BRS Review Meetings : శాసనసభ ఎన్నికల్లో ( Assembly Elections) దెబ్బతిన్న బీఆర్ఎస్ (BRS)పార్టీ...పార్లమెంట్ ఎన్నికల్లో (General Elections 2023) సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ (Telangana) తరపున ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. 2024 ఎన్నికల్లో మెజార్టీ పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై సమీక్షలు చేసుకుంటూనే..పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. సిట్టింగ్ ఎంపీలతో పాటు మాజీ ఎంపీలు, అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పార్టీ అగ్రనేతలు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలపై అంతర్గతంగా సమీక్షలు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి నియోజకవర్గాల వారీగా నేతలతో సన్నాహాక సమావేశాలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. 

పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యం
పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణ భవన్‌ వేదికగా ముఖ్యనేతలతో వరుస భేటీలు కొనసాగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 3 నుంచి లోక్ సభ నియోజకవర్గాల వారిగా సమీక్షలు చేయనుంది. జనవరి 3న ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంతో సన్నాహక సమావేశాలు ప్రారంభం అవుతాయి. 4న కరీంనగర్‌, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్‌, 8న జహీరాబాద్‌, 9న ఖమ్మం, 10న వరంగల్‌, 11న మహబూబాబాద్‌, 12న భువనగిరి, 16న నల్గొండ, 17న నాగర్‌కర్నూల్‌, 18న మహబూబ్‌నగర్‌, 19న మెదక్‌, 20న మల్కాజ్‌గిరి, 21న సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుగుతాయి. తెలంగాణ భవన్‌లో రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్లమెంటు నియోజకవర్గాలవారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతికి మూడు రోజుల విరామమివ్వనున్నారు. పండుగ తర్వాత రెండో విడత సమావేశాలను నిర్వహించనుంది. 

నియోజకవర్గానికి 5వందల మందికి ఆహ్వానం
తెలంగాణ భవన్ లో జరిగే సమీక్షా సమావేశాలకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీలతో పాటు వంద మంది నేతలతో పాటు 5వందల మంది కార్యకర్తలకు ఆహ్వానాలు పంపనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు, ప్రత్యర్థులు విజయానికి అనుకూలించిన పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, ఆయా నియోజకవర్గాల్లో నేతల పనితీరు, పార్టపై ప్రజలకు ఉన్న అభిప్రాయం, నేతల బలాబలాలపై సుదీర్ఘంగా చర్చించున్నారు. సమావేశంలో వచ్చిన రిజల్ట్ ను బట్టి పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేయనుంది.  తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన స్థానాల్లో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారు. పార్లమెంట్ స్థానాలు సమీక్ష ముగిసిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలపైనా బీఆర్ఎస్ సమీక్ష చేయాలని నిర్ణయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన వారికి మళ్లీ టికెట్లు ఇవ్వవద్దని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటమి పాలయిన మంత్రులను మరో రకంగా ఉపయోగించుకోవడంపై బీఆర్ఎస్ ఆలోచిస్తోంది. 

Also Read: రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోస్ట్ 

Also Read:ఫ్రీ బస్ ఎఫెక్ట్ - మహిళలతో నిండుతున్న ఆర్టీసీ బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తోన్న పురుషులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget