అన్వేషించండి

TRS vs BJP Politics: కమలంను ఢీ కొట్టేందుకు గులాబీ వ్యూహం ఇదేనా? బీజేపీకి కళ్లెం వేసేందుకు టీఆర్‌ఎస్‌ దూకుడు

BJP vs TRS In Telangana: తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్‌ సరికొత్త పంథాకు తెరతీస్తోంది. ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో బీజేపీకు కళ్లెం వేయాలని భావిస్తోంది

TRS vs BJP Politics: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల త‌ర్వాత‌ తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్‌ సరికొత్త పంథాకు తెరతీస్తోంది. వడ్ల కొనుగోలు విషయంలో ఢిల్లీలో ధ‌ర్నా చేసిన సీఎం కేసీఆర్‌ ఆ తర్వాత కొద్దిగా వెనుకంజ వేయడం, ఓ వైపు బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ పాదయాత్ర (Praja Sangrama Yatra)తో ప్రజల్లోకి వెళుతుండటంతోపాటు బీజేపీ పెద్దలు తరుచూ పర్యటనలు చేస్తూ టీఆర్‌ఎస్‌ను ఇరుకునపెడుతున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు సిద్దం కావాలని టీఆర్‌ఎస్‌ బావిస్తున్నట్లు తెలుస్తోంది.

కేంద్రం నిధులపై ఎదురుదాడి.. 
లెక్క‌లు చూపించండి అని రెండు పార్టీలు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శించుకుంటున్నాయి. మీరు నిధులు ఇవ్వ‌లేద‌ని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే... అదిగో మేం ఇచ్చింది ఇంత‌ అని బీజేపి చెబుతోంది. మీ ప‌థ‌కాలు కావ‌ని రాష్ట్రంలో అమలవుతున్నవి మీవి కాదు మావే అంటూ ఒక‌రినొక‌రు సోష‌ల్ మీడియా వేదిక విమ‌ర్శించుకుంటున్నారు. అటు టీఆర్‌ఎస్‌ పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రధానంగా తెలంగాణకు కేంద్రం ఇచ్చే నిధులపైనే బీజేపీ నేతలు దృష్టిసారించారు. అయితే నేతలు మాట్లాడే సమయంలో లెక్కల చెప్పే క్రమంలో బీజేపీ నేతలు అమిత్ షా, బండి సంజయ్, మరో నేత మూడు రకాలుగా లెక్కలు వెల్లడించారు. ఈ లెక్కలు మూడు మూడు రకాలుగా చూపించడంతో ఇటీవల కాలంలో సోషల్‌మీడియా వేదికగా టీఆర్‌ఎస్‌ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఇదే కాకుండా తెలంగాణ నుంచి కేంద్రానికి వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో స్పష్టమైన గణాంకాలు సేకరించి కిందిస్థాయి నాయకుల వరకు దీనిపై అవగాహన కల్పించాలని బావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగా కేంద్రం నుంచి వచ్చే నిధులకు సంబందించి పూర్తి గణాంకాలు తయారు చేసే పనిలో టీఆర్‌ఎస్‌ నేతలు నిమగ్నమైనట్లు సమాచారం. 

టార్గెట్ వ‌యా ఎంఐఎం.. 
దీంతోపాటు టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌గా చేసేందుకు ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీని అస్త్రంగా మలుచుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో బాగంగానే టీఆర్‌ఎస్‌ను ఎంఐఎం పార్టీ నడిపిస్తుందనే ప్రచారం ప్రతి సభలో బీజేపీ నేతలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి తమకు సంబందం లేదని, బీజేపీకి ఎంఐఎం  ‘బి’ టీమ్‌గా ప్రచారం చేసే పనిలో టీఆర్‌ఎస్‌ నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలలో ఎంఐఎం పోటీ చేయడం వల్ల బీజేపీకి జరిగిన లాభాన్ని చూపేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా మీటింగ్ త‌ర్వాత‌ ప్రెస్‌మీట్‌ పెట్టిన కేటీఆర్‌ ‘అసదుద్దీన్‌ భుజంపై తుపాకీ పెట్టి ఎంత మందిని కాలుస్తారు..’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 

పథకాలతో ప్రచారం..
బీజేపీ నేతృత్వంలోని కేంద్రం అందిస్తున్న నిధుల వల్లే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సాగుతున్నాయనే ప్రచారం చేసేందుకు ఆ పార్టీ సిద్దమైంది. అయితే దీనికి సరైన జవాబు ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ పెట్టిన పథకాలను బీజేపీ కాపీ కొడుతుందనే విషయాన్ని ప్రచారం చేసేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు సిద్దమయ్యారు. ఒక అబద్దాన్ని పదిసార్లు చెప్పడం వల్ల దానిని నిజం చేసేందుకు బీజేపీ సిద్దమైందని టీఆర్‌ఎస్‌ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో పాగావేయాలని చూస్తున్న బీజేపీని అదే స్థాయిలో గ‌ట్టిగా ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్‌ సిద్దమైనట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్‌మీడియా వేదికగా రెండు పార్టీల మద్య గట్టి వార్‌ నడుస్తోంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా 27 ప్రశ్నలు సంధించారు. అదే సమయంలో తమ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని ఐఐటీలు, ఐఐఎంలు ఇచ్చిందో చెప్పాలని, ఎన్ని నిధులు ఇచ్చిందో క్లారిటీ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత సైతం ట్వీట్లు చేశారు. అయితే రెండు పార్టీలు లెక్క‌లు చెబుతున్నాయి స‌రే కానీ అస‌లు లెక్క‌లేంట‌నేది ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. అంతెందుకు అస‌లు  ఎన్ని నిధులు ఇచ్చారు, ఎన్ని నిధ‌లు వ‌చ్చాయి.... ఎంత మ‌నీ ట్యాక్స్ ల రూపంలో కేంద్రానికి క‌డుతున్నామో, ఎంత కేంద్రం తిరిగి ఇస్తున్నారో ఓ శ్వేత ప‌త్రం విడుద‌ల చేస్తే స‌రిపోతుంది క‌దా అని నెటిజన్స్ చ‌ర్చించుకుంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Manifestos of Tamil parties: ఉచితాల మ్యానిఫెస్టోలతో హోరెత్తిస్తున్న తమిళ పార్టీలు - ప్రజలు ఓటింగ్ ప్రాతిపదిక ఈ వరాలేనా?
ఉచితాల మ్యానిఫెస్టోలతో హోరెత్తిస్తున్న తమిళ పార్టీలు - ప్రజలు ఓటింగ్ ప్రాతిపదిక ఈ వరాలేనా?
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు

వీడియోలు

Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam
Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
TVS Bikes 2026: టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?
టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?
Nikhil Siddhartha : 6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
Ranveer Singh : చాముండి టెంపుల్ దర్శించి సారీ చెబుతా - కాంతార దేవతలపై కామెంట్స్ కాంట్రవర్సీ... ధురంధర్ హీరో ఏమన్నారంటే?
చాముండి టెంపుల్ దర్శించి సారీ చెబుతా - కాంతార దేవతలపై కామెంట్స్ కాంట్రవర్సీ... ధురంధర్ హీరో ఏమన్నారంటే?
Embed widget