అన్వేషించండి

BJP Prajaporu : చాపకింద నీరులా ఏపీబీజేపీ ప్రచారం - ప్రజాపోరు సభలతో బలపడేందుకు గట్టి ప్రయత్నాలు !

ఏపీలో సైలెంట్‌గా విస్తరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రజాపోరు సభలో ప్రతి వీధిలోనూ ప్రజల్ని పలకరిస్తోంది.

BJP Prajaporu : భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం బలం లేని రాష్ట్రాల్లోనూ అధికారం చేపట్టడం వెనుక వారికి మాత్రమే సాధ్యమైన ప్రత్యేకమైన వ్యూహం ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో ఒక్కో సీటు ఉన్న చోట కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనికి కారణం ఆయా రాష్ట్రాల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరించారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలతో పాటు ప్రచారం పెద్దగా లేకుండా సైలెంట్‌గా ప్రజల్లోకి వెళ్లడం ఆ పార్టీ వ్యూహాల్లో ఒకటి. త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ప్రతి ఓటర్‌నూ కలిసేందుకు బీజేపీ నేతలు ప్రత్యేక కార్యాచరణ అమలుచేశారు. తమ విధానాలు చెప్పారు. అధికారం చేపట్టారు. ఇప్పుడు ఏపీలోనూ బీజేపీ అదే వ్యూహాన్ని పాటిస్తోంది. 

ప్రజాపోరు పేరుతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ లు !

భారతీయ జనతా పార్టీ ఏపీలోని ప్రతి ఊరిలో ముఖ్య కూడలిలో ఓ సభ ఏర్పాటు చేస్తోంది. ఆ సభలకు వీలైనంత ప్రముఖ నేతలను ఆహ్వానిస్తున్నారు. కొన్నికొన్ని చోట్ల కేంద్ర మంత్రులుకూడా వచ్చేలా చూసుకుంటున్నారు. వీటిని నాలుగు  రోజులుగా నిర్వహిస్తున్నారు. రోజులుకు మూడు నుంచి నాలుగు వందల చోట్ల నిర్వహిస్తున్నారు. భారీ ప్రచారం చేయకుండా ఆయా వీధుల్లో ఉండేవారిని వచ్చేలా చేసుకుని మోదీ విజయాలు.. దేశానికి మోదీ అవసరం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలువంటివి చెబుతున్నారు. కుటుంబ పార్టీల వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరిస్తున్నారు. 

ప్రజలకు దగ్గరగా బీజేపీ ఉందన్న అభిప్రాయం కల్పించడం !

బీజేపీకి క్యాడర్ కాస్త తక్కువే. వారిలోనూ చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు తక్కువ. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. వాటిని ప్రస్తుతం బీజేపీ పరిష్కరించుకుని క్యాడర్‌ను యాక్టివేట్ చేసుకుంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో  పాటు ప్రస్తుతం సీనియర్లు, జూనియర్ నేతలు విస్తృతంగా పర్యటిస్తూండటంతో క్యాడర్ కూడా కార్యక్రమాలు చేపట్టడానికి ఆసక్తి చూపిస్తోంది. ప్రజల్లో కూడా బీజేపీ నేతలు సులువుగా కలసిపోతున్నారు. గతంలో బీజేపీ నేతలు .. క్యాడర్ ప్రజల్ని కలిసేది తక్కువ. ప్రజాపోరు సభల ద్వారా ఇప్పుడు ఏ మూల చూసినా బీజేపీ కార్యకర్తలు కనిపిస్తున్నారు. 

 

 

హైకమాండ్ నుంచి కావాల్సినంత సహకారం !

చురుగ్గా ఉండే యువ నేతలకు ఇటీవలి కాలంలో ఎక్కువగా బాధ్యతలిస్తున్నారు. ప్రజల్లో చర్చ జరిగేలా.. సమస్యలపై చర్చించేవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. యువత పార్టీపై ఆసక్తి చూపిస్తున్నందున వారిని మరంతగా కలుపుకునేందుకు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి లాంటి నేతలు చురుకుగా పర్యటిస్తున్నారు. ప్రజాపోరులో వారి భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రజాపోరు సభలకు ఆయన ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా బీజేపీ గ్రాస్‌రూట్‌లో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇది సక్సెస్ అయితే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
Janasena expansion in South: దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
Jasprit Bumrah: పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు గాయం? IPL 2026 ముంబై ఇండియన్స్‌లో టెన్షన్!
పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు గాయం? IPL 2026 ముంబై ఇండియన్స్‌లో టెన్షన్!
Priyadarshan Lissy: విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
Amaravati Fire Accident: అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Embed widget