అన్వేషించండి

BJP Prajaporu : చాపకింద నీరులా ఏపీబీజేపీ ప్రచారం - ప్రజాపోరు సభలతో బలపడేందుకు గట్టి ప్రయత్నాలు !

ఏపీలో సైలెంట్‌గా విస్తరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రజాపోరు సభలో ప్రతి వీధిలోనూ ప్రజల్ని పలకరిస్తోంది.

BJP Prajaporu : భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం బలం లేని రాష్ట్రాల్లోనూ అధికారం చేపట్టడం వెనుక వారికి మాత్రమే సాధ్యమైన ప్రత్యేకమైన వ్యూహం ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో ఒక్కో సీటు ఉన్న చోట కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనికి కారణం ఆయా రాష్ట్రాల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరించారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలతో పాటు ప్రచారం పెద్దగా లేకుండా సైలెంట్‌గా ప్రజల్లోకి వెళ్లడం ఆ పార్టీ వ్యూహాల్లో ఒకటి. త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ప్రతి ఓటర్‌నూ కలిసేందుకు బీజేపీ నేతలు ప్రత్యేక కార్యాచరణ అమలుచేశారు. తమ విధానాలు చెప్పారు. అధికారం చేపట్టారు. ఇప్పుడు ఏపీలోనూ బీజేపీ అదే వ్యూహాన్ని పాటిస్తోంది. 

ప్రజాపోరు పేరుతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ లు !

భారతీయ జనతా పార్టీ ఏపీలోని ప్రతి ఊరిలో ముఖ్య కూడలిలో ఓ సభ ఏర్పాటు చేస్తోంది. ఆ సభలకు వీలైనంత ప్రముఖ నేతలను ఆహ్వానిస్తున్నారు. కొన్నికొన్ని చోట్ల కేంద్ర మంత్రులుకూడా వచ్చేలా చూసుకుంటున్నారు. వీటిని నాలుగు  రోజులుగా నిర్వహిస్తున్నారు. రోజులుకు మూడు నుంచి నాలుగు వందల చోట్ల నిర్వహిస్తున్నారు. భారీ ప్రచారం చేయకుండా ఆయా వీధుల్లో ఉండేవారిని వచ్చేలా చేసుకుని మోదీ విజయాలు.. దేశానికి మోదీ అవసరం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలువంటివి చెబుతున్నారు. కుటుంబ పార్టీల వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరిస్తున్నారు. 

ప్రజలకు దగ్గరగా బీజేపీ ఉందన్న అభిప్రాయం కల్పించడం !

బీజేపీకి క్యాడర్ కాస్త తక్కువే. వారిలోనూ చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు తక్కువ. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. వాటిని ప్రస్తుతం బీజేపీ పరిష్కరించుకుని క్యాడర్‌ను యాక్టివేట్ చేసుకుంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో  పాటు ప్రస్తుతం సీనియర్లు, జూనియర్ నేతలు విస్తృతంగా పర్యటిస్తూండటంతో క్యాడర్ కూడా కార్యక్రమాలు చేపట్టడానికి ఆసక్తి చూపిస్తోంది. ప్రజల్లో కూడా బీజేపీ నేతలు సులువుగా కలసిపోతున్నారు. గతంలో బీజేపీ నేతలు .. క్యాడర్ ప్రజల్ని కలిసేది తక్కువ. ప్రజాపోరు సభల ద్వారా ఇప్పుడు ఏ మూల చూసినా బీజేపీ కార్యకర్తలు కనిపిస్తున్నారు. 

 

 

హైకమాండ్ నుంచి కావాల్సినంత సహకారం !

చురుగ్గా ఉండే యువ నేతలకు ఇటీవలి కాలంలో ఎక్కువగా బాధ్యతలిస్తున్నారు. ప్రజల్లో చర్చ జరిగేలా.. సమస్యలపై చర్చించేవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. యువత పార్టీపై ఆసక్తి చూపిస్తున్నందున వారిని మరంతగా కలుపుకునేందుకు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి లాంటి నేతలు చురుకుగా పర్యటిస్తున్నారు. ప్రజాపోరులో వారి భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రజాపోరు సభలకు ఆయన ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా బీజేపీ గ్రాస్‌రూట్‌లో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇది సక్సెస్ అయితే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
SIR In Telangana: తెలంగాణలో నేటి నుంచి SIR ప్రక్రియ ప్రారంభం! ఇలా చేస్తేనే మీ ఓటు భద్రం!
తెలంగాణలో నేటి నుంచి SIR ప్రక్రియ ప్రారంభం! ఇలా చేస్తేనే మీ ఓటు భద్రం!
Kadapa Steel Plant History: కడప స్టీల్ ప్లాంట్‌కు ఇంకెన్ని సార్లు శంకుస్థాపనలు? బ్రాహ్మణి నుండి JSW వరకు.. చంద్రబాబు తాజా ప్లాన్ ఏంటి?
కడప స్టీల్ ప్లాంట్‌కు ఇంకెన్ని సార్లు శంకుస్థాపనలు? బ్రాహ్మణి నుండి JSW వరకు.. చంద్రబాబు తాజా ప్లాన్ ఏంటి?
Janasena Leaders Communication Gap: జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేల వాయిస్ ఎందుకు వినిపించడం లేదు ? పవన్ ఆగ్రహం వెనుక అసలు కారణం ఏమిటి?
జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేల వాయిస్ ఎందుకు వినిపించడం లేదు ? పవన్ ఆగ్రహం వెనుక అసలు కారణం ఏమిటి?

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Breaking News:తిరుపతిలో వృద్థ దంపతుల భూమిని టిడిపి నేతలు కొట్టేశారు! చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలు!
తిరుపతిలో వృద్థ దంపతుల భూమిని టిడిపి నేతలు కొట్టేశారు! చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలు!
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
Darshanam Mogilaiah Land Dispute: వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
Dharman OTT : రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
YS Jagan Tweet SHG Loans Decline: డ్వాక్రా మహిళలకు కూటమి ద్రోహం - రూ. 6,000 కోట్లు నొక్కేశారు.. గణాంకాలతో వైఎస్ జగన్ సంచలన ట్వీట్!
డ్వాక్రా మహిళలకు కూటమి ద్రోహం - రూ. 6,000 కోట్లు నొక్కేశారు.. గణాంకాలతో వైఎస్ జగన్ సంచలన ట్వీట్!
Ketan Agarwal Murder Case Pune: పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
Embed widget