అన్వేషించండి

Andhra BJP : శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవి - బీజేపీలో సీనియర్లకు హైకమాండ్ అభయం ఇచ్చిందా ?

Andhra politcs : ఏపీ నుంచి కేంద్రమంత్రిగా శ్రీనివాసవర్మ ప్రమాణం చేశారు. టిక్కెట్ల కేటాయింపులో అసంతృప్తికి గురైన సీనియర్లకు మంచి భవిష్యత్ ఉంటుందన్న సంకేతాలను దీని ద్వారా పంపారని భావిస్తున్నారు.

Andhra Pradesh BJP :  కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ ఎంపీలు కాకుండా బీజేపీ తరపున ఎన్నికైన భూతపతిరాజు శ్రీనివాస వర్మకు చోటు దక్కడం సంచలనంగా మారింది.  ఏపీ నుంచి బీజేపీ తరపున ముగ్గురు ఎంపీలు గెలిచారు. ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుంది. ప్రాధాన్యతల క్రమంలో చూసుకుంటే మొదటి పేరు పురందేశ్వరి… తర్వాత సీఎం రమేష్.. ఆ తర్వాత శ్రీనివాసవర్మ ఉంటారు. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం  శ్రీనివాసవర్మకే కేంద్ర మంత్రి పదవి ప్రకటించింది. ఆయన సహాయ మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. ఆయనకు  కేంద్ర పెద్దలు ప్రాధాన్యమివ్వడం వెనుక కీలక సందేశం ఉందని అంచనా వేస్తున్నారు. 

బీజేపీకి కింది స్థాయి నుంచి పని చేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని సంకేతాలు 

బీజేపీలో కింది  స్థాయి నుంచి పని చేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని వారిని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటామన్న సందేశాన్ని శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి కేటాయించడం ద్వారా హైకమాండ్ పంపిందని అంటున్నారు.  ఏపీలో పొత్తుల్లో టిక్కెట్ల కేటాయింపు తర్వాతా అన్నీ ఒక్క గ్రూపుకే ప్రాధాన్యం లభించిందన్న ఆరోపణలు వచ్చాయి. మొదటి నుంచి పార్టీలోనే ఉన్న సీనియర్లను పక్కన పెట్టారని .. వారికి ఒక్క చోట కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదన్న విమర్శలు వచ్చాయి. సీనియర్ నేతలు కొంత మంది ఈ అంశంపై హైకమాండ్‌కు కూడా లేఖ రాశారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ కోసం పని చేసే వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందన్న ఆందోళన కూడా కనిపించింది. 

టిక్కెట్ల కేటాయింపు సమయంలో న్యాయం చేయలేకపోయిన  హైకమాండ్        

అయితే పొత్తులు, ఇతర కారణాల వల్ల బీజేపీ హైకమాండ్ టిక్కెట్ల కేటాయింపులో న్యాయం చేయలేకపోయింది. అప్పటికీ నర్సాపురం సీటు కోసం రఘురామకృష్ణరాజు కోసం ఇతర పార్టీలు తీవ్రంగా ఒత్తిడి చేసిన వెనక్కి తగ్గలేదు. మొదటి నుంచి పార్టీలోనే ఉన్న భూపతిరాజు శ్రీనివాసవర్మకే కేటాయించారు. మార్పు చేయాలని వచ్చిన ఒత్తిళ్లను అంగీకరించలేదు. ఆయననూ మారిస్తే ఇక పేరుకే బీజేపీ పోటీ అని.. కిందిస్థాయి నుంచి బీజేపీలో పని చేస్తూ వచ్చిన వారు ఎవరికీ చాన్స్ రాలేదన్న అభిప్రాయం పెరుగుతుందని వెనక్కు తగ్గారు. 

 

భవిష్యత్ లో సీనియర్లకే ప్రాధాన్యం -  వర్మ పదవి ఇచ్చే సందేశం ఇదే !    

ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి కూడా ఆయనకే  ఇవ్వడంతో పార్టీలో వలస నేతలకు మాత్రమే ప్రాధాన్యనం అనే ముద్రను చెరిపేయడానికి.. కిందిస్థాయి నుంచి పని చేసే కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి శ్రీనివాసవర్మకు చాన్సిచ్చారని చెబుతున్నారు. ఆయనకు పదవి ఖరారు కాగానే సోము వీర్రాజుతో సంతోషం పంచుకునున్నారు. ఎన్నికల్లో పోటీ కోసం గట్టిగా ప్రయత్నించిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా కొత్త కేంద్రమంత్రిని అభినందించారు. బీజేపీలో  వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రిగా అయిపోవచ్చని వర్మ నిరూపించారు.ఆ భరోసా వర్మకు పదవి ఇవ్వడం ద్వారా పార్టీనే నమ్ముకున్న సీనియర్లకు, క్యాడర్ కు పంపింది. సీనియర్లకు మంచి భవిష్యత్ ఉంటుందన్న సంకేతాలను వర్మకు పదవి ద్వారాపంపారని అనుకోవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Bengal Assembly elections 2026: రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
Tamil Nadu Assembly Elections 2026: విజయ్‌పై సీబీఐ ఉచ్చు - బీజేపీ వ్యూహాలకు దళపతి చిక్కుతారా?
విజయ్‌పై సీబీఐ ఉచ్చు - బీజేపీ వ్యూహాలకు దళపతి చిక్కుతారా?
Telangana assembly meetings: అసెంబ్లీలో వార్ వన్ సైడ్ - కేసీఆర్ లేని లోటు - రేవంత్ దూకుడుతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి!
అసెంబ్లీలో వార్ వన్ సైడ్ - కేసీఆర్ లేని లోటు - రేవంత్ దూకుడుతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Embed widget