అన్వేషించండి

AP Leaders Join BRS: బీఆర్‌ఎస్‌లో చేరనున్న ఏపీ మాజీ మంత్రి, - బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు ఎవరంటే !

కొన్ని రోజుల కిందట ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు సైతం దర్శనమివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఏపీ నుంచి మరో కీలక అప్ డేట్ వచ్చింది.

బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో ఆశలు చిగురిస్తున్నాయి. పార్టీని ఏపీలో వేగంగా వ్యాప్తి చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చుకున్నారు కేసీఆర్. రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలో చక్రం తిప్పే సమయం వచ్చిందని సైతం వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల కిందట ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు సైతం దర్శనమివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఏపీ నుంచి మరో కీలక అప్ డేట్ వచ్చింది. ఏపీ నుంచి ఓ మాజీ మంత్రితో పాటు, మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ పార్థసారథి జనవరి 2వ తేదీన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో వీరితో పాటు మరికొందరు గులాబీ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర విద్యార్థి, యువజన జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ ఓ ప్రకటనలో తెలిపారు.

దేశ భవిష్యత్ కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏపీకి చెందిన పలువురు ముఖ్యమైన వ్యక్తులు, నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ - సీనియర్ నేత తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథిలతో పాటు అన్ని జిల్లాలకు చెందిన వేలాది మంది జనవరి 2న బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో చేరనున్నట్లు ఏపీ యూత్, స్టూడెంట్స్ జేఏసీ పేర్కొంది.

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడుగా ఆయనకే పగ్గాలు !
బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను నియమించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 2న మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో తెలంగాణ భవన్ లో ఏపీ నుంచి నేతలు, మాజీ అధికారులు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరునుండగా.. కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానం పలకనున్నారు. 2019లో గుంటూరు పశ్చిమ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ ఓటమిచెందారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న చంద్రశేఖర్, తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనను గమనించి బీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

విభజిత ఏపీలో గడిచిన తొమ్మిది సంవత్సరాలలో మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అధ్వాన్న పాలనతో రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టపోయాయని అన్నారు. రాష్ట్ర యువతతో పాటు రైతులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాలకు తీరని నష్టం జరిగిందని స్టూడెంట్స్ జేఏసీ ఆరోపించింది. వ్యవసాయ, సంక్షేమరంగాలతో పాటు అన్నిరంగాలు విధ్వంసానికి గురయ్యాయని.. అన్ని వనరులు ఉన్నప్పటికీ ఏపీని ఆదుకునే నాయకుడు లేక ప్రజలతో పాటు అన్ని వర్గాల వారు అల్లాడుతున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమ నేతగా, సకల జనుల సంక్షేమం దిశగా పాలన పరిపాలనధక్షుడిగా ముందుకు సాగుతోన్న సీఎం కేసీఆర్ లాంటి నేత నాయకత్వం ఏపీకి అవసరం అన్నారు. కేసీఆర్ పాలనతోనే ఏపీ సమస్యలు తీరుతాయని కీలక విషయాలను ప్రస్తావించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
Embed widget