అన్వేషించండి

TDP Janasena Alliance News: 18 ఏళ్లు దాటిన మహిళలందరికి 18వేలు ఆర్థికసాయం, నేడు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్

Andhra Pradesh Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడమే ధ్యేయంగా తెలుగుదేశం కసరత్తు చేస్తోంది. జనసేన సాయంతో ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళిక రచిస్తోంది.

TDP Janasena Manifesto For Andhra Pradesh Assembly Elections : 2024లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అధికారంలోకి రావడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party )కసరత్తు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి రకరకాల పథకాలను ప్రకటిస్తోంది. సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. 2024లో విజయకేతనం ఎగరవేయడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలూ ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. ఈ తరుణంలో లోకేష్ పాదయాత్ర(Lokesh Padayatra )తో రంగంలోకి దిగారు. లోకేష్ పాదయాత్రకు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చింది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu ) స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(Skill Development Case)లో అరెస్టు అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరణామాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. రెండు పార్టీల మధ్య సీట్ల సమన్వయానికి కో ఆర్డికేషన్ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి. జనసేన-టీడీపీల ఉమ్మడి మేనిఫెస్టోని ఈ రోజు ప్రకటించనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో కీలక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. 

టీడీపీ-జనసేన మేనిఫెస్టో కీలక అంశాలు
అమ్మ ఒడికి బదులుగా తల్లికి వందనం పథకాన్ని తేబోతున్నట్లు తెలిసింది. అమ్మ ఒడి పథకంలో ఒక బిడ్డకు మాత్రమే ప్రయోజనం వర్తిస్తే, తల్లికి వందనం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే, అందరికి లబ్దిచేకూర్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ చేయూతలో భాగంగా 45 ఏళ్ల వయసు దాటిన మహిళలకు రూ.18,000ను ప్రభుత్వం ఇస్తోంది. టీడీపీ-జనసేన కూటమి 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకూ నెలకు రూ.1500 ఇస్తానని హామీ ఇవ్వనుంది. రైతులకు ప్రస్తుతం ప్రభుత్వం ఏడాదికి అందిస్తున్న రూ.13,500 అందిస్తోంది. ఇందులో కేంద్రం ఆరు వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 ఇస్తున్నాయి.  టిడిపి-జనసేన రూ.15,000 ఇస్తామని చెప్పింది. దానికి తోడు మహిళలకు ఉచిత బస్సు, ఏడాదికి మూడు సిలిండర్లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఇంటింటికీ కుళాయిలు, బీసీ రక్షణ చట్టం వంటివి మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తోంది. టిడిపి మేనిఫెస్టోపై కర్ణాటక ప్రభావం పడిందని కొందరు నేతలు భావిస్తున్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి హామీలను ఇచ్చి ప్రజలను ఆకట్టుకుంది. దాన్ని ఆసరాగా చేసుకుని టిడిపి కూడా కర్ణాటక మాదిరిగా మేనిఫెస్టోను రూపొందించి ఉండొచ్చని రాయకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టిడిపి - జనసేన 2024 ఎన్నికలకు కలిసి పోటి చేస్తున్నాయి. 

ఈ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమన్న పవన్
 వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు దించటమే జనసేన లక్ష్యమని, ఎన్నికల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని.. కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం.. జగన్ సేన కౌరవులని పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ ఓటమి ఖాయం, మేం అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. డబ్బుకు అమ్ముడుపోయానని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, తనకు డబ్బుమీద, నేలమీద ఎప్పుడూ కోరిక లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఓటు చీలకూడదని పొత్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనకు తన పార్టీ కంటే ఈ రాష్ట్రం ముఖ్యమని పవన్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి కోసం తాను వెంపర్లాడనని పవన్‌ వెల్లడించారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget