అన్వేషించండి

Anchor Shyamala: 'పిల్లికి బిచ్చం పెట్టని మీరా వరద సాయం గురించి మాట్లాడేది?' - సీఎం చంద్రబాబుపై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు

Andhra News: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై.. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మరోసారి విమర్శలు చేశారు. అధికారం, మీడియా అండతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Anchor Shyamala Comments On CM Chandrbabu: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై యాంకర్ శ్యామల (Anchor Shyamala) మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన ఆమె వైసీపీ అధినేత జగన్‌పై (YS Jagan) విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ప్రజలకు సాయం చేసే విషయంలో పిల్లికి కూడా ఎప్పుడూ బిచ్చం పెట్టని చంద్రబాబు (CM Chandrababu), లోకేశ్‌లను (Nara Lokesh) చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకూ ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 'వరద బాధితులకు జగన్ ఏం చేశారని ప్రశ్నిస్తున్న మేథావులు దయచేసి కళ్లు తెరవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ గూండాలు దాదాపు 200 మందికి పైగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తే వారికి జగన్ అండగా నిలిచి సాయం చేశారు. విశాఖలోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో 17 మంది చనిపోతే ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సాయం చేశారు. గాయపడ్డ 41 మందికి రూ.లక్ష చొప్పున సాయం చేశారు. విజయవాడలో వరదలు ముంచెత్తితే బాధితులకు రూ.కోటి సాయం అందించారు. ఇప్పటికీ బాధితులకు నిత్యావసరాలు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. పులివెందులలోని స్కూల్లో ఎంతోమంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించారు.' అని వివరించారు.

ఇక ఎన్నికల సమయంలో పాదయాత్ర, ఓదార్పు యాత్రలో జగన్ ఎంతోమంది యువతకు ఉపాధి మార్గాలు చూపించారని శ్యామల గుర్తు చేశారు. ఎంతోమందికి ధన సహాయం చేశారని.. ఎంతోమందికి భరోసా కల్పించారని చెప్పారు. వైఎస్ జగన్ చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు ఈ రోజు సంతోషంగా ఉన్నాయని.. ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇలాంటి సాయాలు ఇదివరకేమైనా చేశారా.? అంటూ ప్రశ్నించారు. అధికారం, మీడియా బలం ఉందని దుష్ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలైపోతాయా.? అంటూ పేర్కొన్నారు. 

ఫైర్ బ్రాండ్లకు పదవులు

వైసీపీ అధినేత జగన్ ఇటీవల వైసీపీ అధికార ప్రతినిధులుగా ఫైర్ బ్రాండ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. మాజీ మంత్రి రోజా, యాంకర్ శ్యామల, భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకరరావులను రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. గత ఎన్నికల సమయంలోనూ యాంకర్ శ్యామల.. చంద్రబాబు, పవన్‌లను టార్గెట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో గుంటనక్క డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు. వైఎస్ జగన్ తరఫున విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో మహిళా కోటాలో రోజా, శ్యామలకు జగన్ కీలక పదవులు ఇచ్చారు.

Also Read: YS Sharmila: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Embed widget