అన్వేషించండి

Anchor Shyamala: 'పిల్లికి బిచ్చం పెట్టని మీరా వరద సాయం గురించి మాట్లాడేది?' - సీఎం చంద్రబాబుపై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు

Andhra News: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై.. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మరోసారి విమర్శలు చేశారు. అధికారం, మీడియా అండతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Anchor Shyamala Comments On CM Chandrbabu: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై యాంకర్ శ్యామల (Anchor Shyamala) మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన ఆమె వైసీపీ అధినేత జగన్‌పై (YS Jagan) విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ప్రజలకు సాయం చేసే విషయంలో పిల్లికి కూడా ఎప్పుడూ బిచ్చం పెట్టని చంద్రబాబు (CM Chandrababu), లోకేశ్‌లను (Nara Lokesh) చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకూ ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 'వరద బాధితులకు జగన్ ఏం చేశారని ప్రశ్నిస్తున్న మేథావులు దయచేసి కళ్లు తెరవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ గూండాలు దాదాపు 200 మందికి పైగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తే వారికి జగన్ అండగా నిలిచి సాయం చేశారు. విశాఖలోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో 17 మంది చనిపోతే ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సాయం చేశారు. గాయపడ్డ 41 మందికి రూ.లక్ష చొప్పున సాయం చేశారు. విజయవాడలో వరదలు ముంచెత్తితే బాధితులకు రూ.కోటి సాయం అందించారు. ఇప్పటికీ బాధితులకు నిత్యావసరాలు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. పులివెందులలోని స్కూల్లో ఎంతోమంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించారు.' అని వివరించారు.

ఇక ఎన్నికల సమయంలో పాదయాత్ర, ఓదార్పు యాత్రలో జగన్ ఎంతోమంది యువతకు ఉపాధి మార్గాలు చూపించారని శ్యామల గుర్తు చేశారు. ఎంతోమందికి ధన సహాయం చేశారని.. ఎంతోమందికి భరోసా కల్పించారని చెప్పారు. వైఎస్ జగన్ చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు ఈ రోజు సంతోషంగా ఉన్నాయని.. ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇలాంటి సాయాలు ఇదివరకేమైనా చేశారా.? అంటూ ప్రశ్నించారు. అధికారం, మీడియా బలం ఉందని దుష్ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలైపోతాయా.? అంటూ పేర్కొన్నారు. 

ఫైర్ బ్రాండ్లకు పదవులు

వైసీపీ అధినేత జగన్ ఇటీవల వైసీపీ అధికార ప్రతినిధులుగా ఫైర్ బ్రాండ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. మాజీ మంత్రి రోజా, యాంకర్ శ్యామల, భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకరరావులను రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. గత ఎన్నికల సమయంలోనూ యాంకర్ శ్యామల.. చంద్రబాబు, పవన్‌లను టార్గెట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో గుంటనక్క డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు. వైఎస్ జగన్ తరఫున విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో మహిళా కోటాలో రోజా, శ్యామలకు జగన్ కీలక పదవులు ఇచ్చారు.

Also Read: YS Sharmila: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget