అన్వేషించండి

Anchor Shyamala: 'పిల్లికి బిచ్చం పెట్టని మీరా వరద సాయం గురించి మాట్లాడేది?' - సీఎం చంద్రబాబుపై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు

Andhra News: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై.. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మరోసారి విమర్శలు చేశారు. అధికారం, మీడియా అండతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Anchor Shyamala Comments On CM Chandrbabu: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై యాంకర్ శ్యామల (Anchor Shyamala) మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన ఆమె వైసీపీ అధినేత జగన్‌పై (YS Jagan) విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ప్రజలకు సాయం చేసే విషయంలో పిల్లికి కూడా ఎప్పుడూ బిచ్చం పెట్టని చంద్రబాబు (CM Chandrababu), లోకేశ్‌లను (Nara Lokesh) చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకూ ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 'వరద బాధితులకు జగన్ ఏం చేశారని ప్రశ్నిస్తున్న మేథావులు దయచేసి కళ్లు తెరవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ గూండాలు దాదాపు 200 మందికి పైగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తే వారికి జగన్ అండగా నిలిచి సాయం చేశారు. విశాఖలోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో 17 మంది చనిపోతే ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సాయం చేశారు. గాయపడ్డ 41 మందికి రూ.లక్ష చొప్పున సాయం చేశారు. విజయవాడలో వరదలు ముంచెత్తితే బాధితులకు రూ.కోటి సాయం అందించారు. ఇప్పటికీ బాధితులకు నిత్యావసరాలు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. పులివెందులలోని స్కూల్లో ఎంతోమంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించారు.' అని వివరించారు.

ఇక ఎన్నికల సమయంలో పాదయాత్ర, ఓదార్పు యాత్రలో జగన్ ఎంతోమంది యువతకు ఉపాధి మార్గాలు చూపించారని శ్యామల గుర్తు చేశారు. ఎంతోమందికి ధన సహాయం చేశారని.. ఎంతోమందికి భరోసా కల్పించారని చెప్పారు. వైఎస్ జగన్ చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు ఈ రోజు సంతోషంగా ఉన్నాయని.. ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇలాంటి సాయాలు ఇదివరకేమైనా చేశారా.? అంటూ ప్రశ్నించారు. అధికారం, మీడియా బలం ఉందని దుష్ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలైపోతాయా.? అంటూ పేర్కొన్నారు. 

ఫైర్ బ్రాండ్లకు పదవులు

వైసీపీ అధినేత జగన్ ఇటీవల వైసీపీ అధికార ప్రతినిధులుగా ఫైర్ బ్రాండ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. మాజీ మంత్రి రోజా, యాంకర్ శ్యామల, భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకరరావులను రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. గత ఎన్నికల సమయంలోనూ యాంకర్ శ్యామల.. చంద్రబాబు, పవన్‌లను టార్గెట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో గుంటనక్క డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు. వైఎస్ జగన్ తరఫున విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో మహిళా కోటాలో రోజా, శ్యామలకు జగన్ కీలక పదవులు ఇచ్చారు.

Also Read: YS Sharmila: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NTR Bharat Ratna resolution Mahanadu 2026: మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?
మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?
Karnataka Politics Updates:కర్ణాటకలో సిద్ధరామయ్య సైలెంట్‌గా తప్పుకుంటున్నారా? డీకేకు చిక్కులు తప్పవా?
కర్ణాటకలో సిద్ధరామయ్య సైలెంట్‌గా తప్పుకుంటున్నారా? డీకేకు చిక్కులు తప్పవా?
Karnataka CM Resignation: కర్ణాటకలో ఇడ్లీ,దోశల మధ్య సీఎం మార్పు ప్రకటన! సిద్ధరామయ్య రాజీనామాకు కారణాలేంటీ?
కర్ణాటకలో ఇడ్లీ,దోశల మధ్య సీఎం మార్పు ప్రకటన! సిద్ధరామయ్య రాజీనామాకు కారణాలేంటీ?
Revanth Reddy CM Change Rumors: తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్! కాంగ్రెస్ అధిష్ఠానం కార్యాచరణ సిద్ధం చేస్తోందా?
తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్! కాంగ్రెస్ అధిష్ఠానం కార్యాచరణ సిద్ధం చేస్తోందా?

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharat Ratna resolution Mahanadu 2026: మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?
మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?
Karnataka Politics Updates:కర్ణాటకలో సిద్ధరామయ్య సైలెంట్‌గా తప్పుకుంటున్నారా? డీకేకు చిక్కులు తప్పవా?
కర్ణాటకలో సిద్ధరామయ్య సైలెంట్‌గా తప్పుకుంటున్నారా? డీకేకు చిక్కులు తప్పవా?
Peddi Massa Massa Song : ఆవేశానికి అరుపు దేనికి... చరుపు మట్టుకే చాలుగా - పెద్ది మస్సా మస్సా సాంగ్ లిరిక్స్
ఆవేశానికి అరుపు దేనికి... చరుపు మట్టుకే చాలుగా - పెద్ది మస్సా మస్సా సాంగ్ లిరిక్స్
Peddi Release : రామ్ చరణ్ పెద్దికి పెద్ద భరోసా - జన నాయగన్ లాంటి పరిస్థితి రాకుండా...
రామ్ చరణ్ పెద్దికి పెద్ద భరోసా - జన నాయగన్ లాంటి పరిస్థితి రాకుండా...
Karnataka CM Resignation: కర్ణాటకలో ఇడ్లీ,దోశల మధ్య సీఎం మార్పు ప్రకటన! సిద్ధరామయ్య రాజీనామాకు కారణాలేంటీ?
కర్ణాటకలో ఇడ్లీ,దోశల మధ్య సీఎం మార్పు ప్రకటన! సిద్ధరామయ్య రాజీనామాకు కారణాలేంటీ?
Rahul Gandhi youth rebellion: మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
Vishwanath And Sons Release Date : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
US Attacks Iran:హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
Embed widget