అన్వేషించండి

Anchor Shyamala: 'పిల్లికి బిచ్చం పెట్టని మీరా వరద సాయం గురించి మాట్లాడేది?' - సీఎం చంద్రబాబుపై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు

Andhra News: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై.. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మరోసారి విమర్శలు చేశారు. అధికారం, మీడియా అండతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Anchor Shyamala Comments On CM Chandrbabu: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై యాంకర్ శ్యామల (Anchor Shyamala) మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన ఆమె వైసీపీ అధినేత జగన్‌పై (YS Jagan) విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ప్రజలకు సాయం చేసే విషయంలో పిల్లికి కూడా ఎప్పుడూ బిచ్చం పెట్టని చంద్రబాబు (CM Chandrababu), లోకేశ్‌లను (Nara Lokesh) చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకూ ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 'వరద బాధితులకు జగన్ ఏం చేశారని ప్రశ్నిస్తున్న మేథావులు దయచేసి కళ్లు తెరవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ గూండాలు దాదాపు 200 మందికి పైగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తే వారికి జగన్ అండగా నిలిచి సాయం చేశారు. విశాఖలోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో 17 మంది చనిపోతే ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సాయం చేశారు. గాయపడ్డ 41 మందికి రూ.లక్ష చొప్పున సాయం చేశారు. విజయవాడలో వరదలు ముంచెత్తితే బాధితులకు రూ.కోటి సాయం అందించారు. ఇప్పటికీ బాధితులకు నిత్యావసరాలు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. పులివెందులలోని స్కూల్లో ఎంతోమంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించారు.' అని వివరించారు.

ఇక ఎన్నికల సమయంలో పాదయాత్ర, ఓదార్పు యాత్రలో జగన్ ఎంతోమంది యువతకు ఉపాధి మార్గాలు చూపించారని శ్యామల గుర్తు చేశారు. ఎంతోమందికి ధన సహాయం చేశారని.. ఎంతోమందికి భరోసా కల్పించారని చెప్పారు. వైఎస్ జగన్ చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు ఈ రోజు సంతోషంగా ఉన్నాయని.. ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇలాంటి సాయాలు ఇదివరకేమైనా చేశారా.? అంటూ ప్రశ్నించారు. అధికారం, మీడియా బలం ఉందని దుష్ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలైపోతాయా.? అంటూ పేర్కొన్నారు. 

ఫైర్ బ్రాండ్లకు పదవులు

వైసీపీ అధినేత జగన్ ఇటీవల వైసీపీ అధికార ప్రతినిధులుగా ఫైర్ బ్రాండ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. మాజీ మంత్రి రోజా, యాంకర్ శ్యామల, భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకరరావులను రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. గత ఎన్నికల సమయంలోనూ యాంకర్ శ్యామల.. చంద్రబాబు, పవన్‌లను టార్గెట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో గుంటనక్క డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు. వైఎస్ జగన్ తరఫున విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో మహిళా కోటాలో రోజా, శ్యామలకు జగన్ కీలక పదవులు ఇచ్చారు.

Also Read: YS Sharmila: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi 7 Appeals: అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Modi Mind Game on Revanth Reddy: మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?
మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Embed widget