అన్వేషించండి

ABP News-CVoter Survey: పంజాబ్‌ను ఊడ్చే దిశగా చీపురు.. మెజార్టీకి దగ్గరగా ఆమ్ ఆద్మీ !

ఢిల్లీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో అధికారం చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదశ్‌ కన్నా మెరుగ్గా.. మెజార్టీకి దగ్గరగా ఆ పార్టీ ఉన్నట్లుగా ఏబీపీ-సీఓటర్ సర్వేలో తేలింది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఈ సారి  ఆమ్ ఆద్మీ పార్టీ హవా కనిపించబోతోందని ఏబీపీ న్యూస్ - సీ  ఓటర్ సర్వేలో తేలింది. పంజాబ్‌లో 20వ తేదీన సింగిల్ ఫేజ్‌లో పోలింగ్‌  జరగనుంది. ఈ సందర్భంగా చివరి విడతగా ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీకి మొగ్గు కనిపించింది.
ABP News-CVoter Survey:  పంజాబ్‌ను ఊడ్చే దిశగా చీపురు..  మెజార్టీకి దగ్గరగా ఆమ్ ఆద్మీ !

మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో తాజా అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 55 నుంచి 63 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 24 నుంచి 30  సీట్లకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో బలమైన పార్టీ శిరోమణి అకాలీదళ్ పార్టీ 20 నుంచి 26 స్థానాలు గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీని పెట్టుకున్న కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఈ సారి అక్కడ సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం లేదు. కూటమికి మూడు నుంచి పదకొండు స్థానాల మధ్యలో సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇండిపెండెంట్లు ఒకటి , రెండు చోట్ల గెలిచే అవకాశం ఉంది.
ABP News-CVoter Survey:  పంజాబ్‌ను ఊడ్చే దిశగా చీపురు..  మెజార్టీకి దగ్గరగా ఆమ్ ఆద్మీ !

పంజాబ్‌లో మొత్తం మాంజా, దవోబా, మాల్వా అనే మూడు రీజియన్లు ఉన్నాయి. వీటిలో మాల్వా అతి పెద్దతి  మాల్వా ప్రాంతంలో 69 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 12 జిల్లాలు ఉన్న ఈ ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తోంది. 69 స్థానాల్లో ఆ పార్టీకి 49సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. ఇక మాంజా ప్రాంతంలో 25 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తోంది. దవోబా ప్రాంతంలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
ABP News-CVoter Survey:  పంజాబ్‌ను ఊడ్చే దిశగా చీపురు..  మెజార్టీకి దగ్గరగా ఆమ్ ఆద్మీ !

ఓవరాల్‌గా ఓట్ షేర్‌ ప్రకారం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 39.8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీ 30 శాతం ఓట్ల దగ్గరే ఆగిపోనుంది. అకాలీదశ్‌కు 20 శాతం.. బీజేపీ కూటమికి 8 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఢిల్లీ తప్ప మరో రాష్ట్రంలో  ఆమ్ ఆద్మీ పార్టీ విజయం దగ్గరకు రాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించిన కొత్తలో పంజాబ్‌లో ఆ పార్టీకి క్రేజ్ వచ్చింది. కానీ తరవాత తగ్గిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ పుంజుకుంది. అధికారానికి దగ్గరగా వెళ్లింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni On Jagan: నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga babu Indirect Counters on Varma | టీడీపీ ఇన్ ఛార్జి వర్మపై నాగబాబు పరోక్ష కౌంటర్లు | ABP DesamJanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP DesamRayapati Aruna on Pithapuram Sabha | నాగబాబుకు MLC పదవి ఎందుకో చెప్పిన రాయపాటి అరుణ | ABP DesamFood Items Menu Janasena Pithapuram Sabha | పిఠాపురం సభలో 10వేల మందికి భోజనాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni On Jagan: నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Yuvi 7 Sixers Vs Australia: పాత యూవీని గుర్తుకు తెచ్చిన మాజీ స్టార్.. ఆసీస్ పై శివ‌తాండ‌వం.. ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు
పాత యూవీని గుర్తుకు తెచ్చిన మాజీ స్టార్.. ఆసీస్ పై శివ‌తాండ‌వం.. ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Embed widget