అన్వేషించండి

Palnadu News: పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులు, 144 సెక్షన్ అమలు

Polling Violence In Palnadu: పల్నాడు జిల్లాలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితులను అదుపు చేసేందుకు కేంద్ర బలగాలను మోహరించారు. జిల్లావ్యాప్తంగా 44 సెక్షన్‌ అమల్లో ఉంది

Andhra Pradesh News: దాడులు, ప్రతిదాడులతో పల్నాడు(Palnadu) జిల్లా అట్టుడుకుతోంది. పోలింగ్ ముగిసినా...పల్నాడు జిల్లాలో కక్షలు చల్లారలేదు. పోలింగ్ సందర్భంగ తలెత్తిన విబేధాలు, ఘర్షణలు మరుసటి రోజూ కొనసాగాయి. కారంపూడి, పిడుగురాళ్ల, గురజాల, సత్తెనపల్లిలో ఘర్షణలో నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. గుంపులుగా బయట తిరిగినా...రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడినా అరెస్ట్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు..

చల్లారని మంటలు
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తలెత్తిన విభేదాలతో పల్నాడు(Palnadu) జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లు, దాడులు, ప్రతిదాడులతో పోలీసులు అప్రమత్తమయ్యారు, తంగెడలో బాంబుదాడులు, కారంపూడి(Karampudi)లో పిన్నెల్లి అనుచరులు తెలుగుదేశం (Telugudesam) కార్యాలయంపై దాడి చేయడంతో పాటు వాహనాలను ధ్వంసం చేశారు. పోలింగ్ సందర్భంగా గాయపడిన వారిని పరామర్శించే పేరిట ఆయన మందీమార్బలంతో కారంపూడి(Karampudi) వచ్చిన ఆయన తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసి కార్లకు నిప్పుపెట్టారు. సీఐ నారాయణస్వామి తలపగులగొట్టారు.

గురజాల(Gurajala) నియోజకవర్గం తంగెడ(Thangeda)లోనూ పెట్రోలు బాంబులు వేసి దుకాణాలు తగులబెట్టారు. కొత్తగణేశునిపాడులోనూ ఇరువర్గాలు కవ్వింపు చర్యలకు దిగాయి. భారీ వాహనాలు, అనుచరులతో హల్‌చల్‌ చేస్తుండటంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని పల్నాడు ప్రజలు భయపడిపోతున్నారు. మాచర్ల, పెదకూరపాడు, నర్సరావుపేట, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఘర్షణలు జరగడంపై ఉన్నతాధికారులు స్పందించారు.

పల్నాడులో జరిగిన ఘర్షణలను చంద్రబాబు(Chandra Babu) డీజీపీ(DGP) దృష్టికి తీసుకెళ్లారు. అదనపు బలగాలను పంపి పరిస్థితులను అదుపు చేయాల్సిందిగా కోరారు. సున్నితమైన గ్రామాలకు  కేంద్ర బలగాలను పంపినట్లు సమాచారం. పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేశారు.

భద్రత కట్టుదిట్టం
నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడరాదని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో శాంతిభద్రతలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవ్వడంతో స్వయంగా ఎన్నికల సంఘమే రంగంలోకి దిగింది. జిల్లాకు అదనపు బలగాలు తరలించాలని అధికారులను ఆదేశించింది. వైసీపీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల అనుచరులు టీడీపీ నేతల్ని టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఈసీ ఆదేశాలతో పారామిలటరీ బలగాలను పల్నాడుకు జిల్లాకు డీజీపీ పంపారు. మాచర్ల పట్టణంతోపాటు, గ్రామాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యిమంది అదనపు బలగాలను పల్నాడు జిల్లాకు తరలించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోనే ఉండనుంది. పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతాయని ముందే సమాచారం ఉన్నా పోలీసులు సరైన రీతిలో భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే గొడవలు జరిగినట్లు తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలను అదుపులోకి తీసుకోలేదని మండిపడుతున్నారు. బహిరంగంగా రోడ్లపైకి రాడ్లు, కర్రలు తీసుకుని హల్‌చల్ చేసినా...కనీసం పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలను అరెస్ట్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Ongole Politics: కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget