అన్వేషించండి

Palnadu News: పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులు, 144 సెక్షన్ అమలు

Polling Violence In Palnadu: పల్నాడు జిల్లాలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితులను అదుపు చేసేందుకు కేంద్ర బలగాలను మోహరించారు. జిల్లావ్యాప్తంగా 44 సెక్షన్‌ అమల్లో ఉంది

Andhra Pradesh News: దాడులు, ప్రతిదాడులతో పల్నాడు(Palnadu) జిల్లా అట్టుడుకుతోంది. పోలింగ్ ముగిసినా...పల్నాడు జిల్లాలో కక్షలు చల్లారలేదు. పోలింగ్ సందర్భంగ తలెత్తిన విబేధాలు, ఘర్షణలు మరుసటి రోజూ కొనసాగాయి. కారంపూడి, పిడుగురాళ్ల, గురజాల, సత్తెనపల్లిలో ఘర్షణలో నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. గుంపులుగా బయట తిరిగినా...రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడినా అరెస్ట్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు..

చల్లారని మంటలు
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తలెత్తిన విభేదాలతో పల్నాడు(Palnadu) జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లు, దాడులు, ప్రతిదాడులతో పోలీసులు అప్రమత్తమయ్యారు, తంగెడలో బాంబుదాడులు, కారంపూడి(Karampudi)లో పిన్నెల్లి అనుచరులు తెలుగుదేశం (Telugudesam) కార్యాలయంపై దాడి చేయడంతో పాటు వాహనాలను ధ్వంసం చేశారు. పోలింగ్ సందర్భంగా గాయపడిన వారిని పరామర్శించే పేరిట ఆయన మందీమార్బలంతో కారంపూడి(Karampudi) వచ్చిన ఆయన తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసి కార్లకు నిప్పుపెట్టారు. సీఐ నారాయణస్వామి తలపగులగొట్టారు.

గురజాల(Gurajala) నియోజకవర్గం తంగెడ(Thangeda)లోనూ పెట్రోలు బాంబులు వేసి దుకాణాలు తగులబెట్టారు. కొత్తగణేశునిపాడులోనూ ఇరువర్గాలు కవ్వింపు చర్యలకు దిగాయి. భారీ వాహనాలు, అనుచరులతో హల్‌చల్‌ చేస్తుండటంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని పల్నాడు ప్రజలు భయపడిపోతున్నారు. మాచర్ల, పెదకూరపాడు, నర్సరావుపేట, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఘర్షణలు జరగడంపై ఉన్నతాధికారులు స్పందించారు.

పల్నాడులో జరిగిన ఘర్షణలను చంద్రబాబు(Chandra Babu) డీజీపీ(DGP) దృష్టికి తీసుకెళ్లారు. అదనపు బలగాలను పంపి పరిస్థితులను అదుపు చేయాల్సిందిగా కోరారు. సున్నితమైన గ్రామాలకు  కేంద్ర బలగాలను పంపినట్లు సమాచారం. పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేశారు.

భద్రత కట్టుదిట్టం
నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడరాదని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో శాంతిభద్రతలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవ్వడంతో స్వయంగా ఎన్నికల సంఘమే రంగంలోకి దిగింది. జిల్లాకు అదనపు బలగాలు తరలించాలని అధికారులను ఆదేశించింది. వైసీపీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల అనుచరులు టీడీపీ నేతల్ని టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఈసీ ఆదేశాలతో పారామిలటరీ బలగాలను పల్నాడుకు జిల్లాకు డీజీపీ పంపారు. మాచర్ల పట్టణంతోపాటు, గ్రామాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యిమంది అదనపు బలగాలను పల్నాడు జిల్లాకు తరలించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోనే ఉండనుంది. పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతాయని ముందే సమాచారం ఉన్నా పోలీసులు సరైన రీతిలో భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే గొడవలు జరిగినట్లు తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలను అదుపులోకి తీసుకోలేదని మండిపడుతున్నారు. బహిరంగంగా రోడ్లపైకి రాడ్లు, కర్రలు తీసుకుని హల్‌చల్ చేసినా...కనీసం పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలను అరెస్ట్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
Chhattishgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Union Budget 2025 Income Tax | 12Lakhs No Tax | ఉద్యోగులకు పెద్ద తాయిలం ప్రకటించిన కేంద్రం | ABPNirmala Sitharaman Budget Day Saree | నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీరకు ఇంత హిస్టరీ ఉంది | ABP DesamMEIL Director Sudha Reddy on Budget 2025 | మధ్యతరగతి మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలంటే.? | ABP DesamMEIL Director Sudha Reddy on Budget 2025 | నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో మహిళలను పట్టించుకుంటున్నారా..!? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
Chhattishgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
Araku Airport: అరకు, పాడేరుకు బడ్జెట్‌లో కీలక ప్రకటన - ఉడాన్ పథకాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం
అరకు, పాడేరుకు బడ్జెట్‌లో కీలక ప్రకటన - ఉడాన్ పథకాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం
Good News For AP: బడ్జెట్ రోజు ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ వ్యయం సవరణకు ఆమోదం
బడ్జెట్ రోజు ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ వ్యయం సవరణకు ఆమోదం
Budget 2025 : ఏటికొప్పాక బొమ్మలకు మహర్దశ - కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి
ఏటికొప్పాక బొమ్మలకు మహర్దశ - కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి
Budget 2025: బడ్జెట్‌తో ధరలు పెరిగే వస్తువులేంటీ? రేట్లు తగ్గే గూడ్స్ ఏంటీ?
బడ్జెట్‌తో ధరలు పెరిగే వస్తువులేంటీ? రేట్లు తగ్గే గూడ్స్ ఏంటీ?
Embed widget