ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేడి అప్పుడే మొదలైంది. సమావేశమైన తొలిరోజే తెలుగు దేశం పార్టీ ఆందోళన బాట పట్టింది.
గవర్నర్ ప్రసంగం జరుగుతున్నంత సేపు గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూనే ఉంది.
రాజ్యాంగ బద్దమైన సంస్థల తీర్పులను, దర్యాప్తులను ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా గవర్నర్ పట్టించుకోవడం లేదని టీడీపీ సభ్యులు విమర్శలు చేశారు.
పోడియం చుట్టుముట్టి గవర్నర్ బిశ్వభూషన్ స్పందించాలంటూ గట్టిగా అరుస్తూ ప్రసంగానికి అడ్డు తగిలారు. ప్రసంగం కాగితాలను చించి గాల్లోకి విసిరారు.
తెలుగు దేశం పార్టీ సభ్యులు చేస్తున్న ఆందోళనపై అధికార పార్టీ వైసీపీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది.
వర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ నేతలు ఆందోళన చేస్తారేమో అని అనుమానించిన మార్షల్స్ వారిని అటు నుంచి వెళ్లనీయలేదు.
మండలికి కూడా వెళ్లకుండా అడ్డుకుంటారా అంటూ వాళ్లపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకు ముందు అసెంబ్లీ వచ్చే దారిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. మందడం చెక్పోస్టు వద్ద సభ్యులను పోలీసులు నిలువరించారు.
ఏపీ శాసనసభ, శాసన మండలిని ఉద్దేశించి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తొలిసారి నేరుగా ప్రసంగించారు. కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్ సమావేశాలు వర్చువల్ విధానంలో గవర్నర్ ప్రసంగించారు.
In Pics : దిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం
Azadi Ka Amrit Mahotsav: ఏయూలో 300 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు
Kishan Reddy : ఏపీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టూర్, పింగళి కుటుంబ సభ్యులకు సన్మానం
In Pics: భద్రాచలంలో చంద్రబాబు పర్యటన, గత స్మృతులను గుర్తుకు తెచ్చుకున్న టీడీపీ అధినేత
CM Jagan Tour: కేంద్రం చేతిలో పని కాబట్టే ఆగుతున్నాం- లేకుంటే ఎప్పుడో చెల్లించేవాళ్లం-పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలతో సీఎం జగన్
BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం
Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య
Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతి - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !
Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి