అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
In Pics: నెల్లూరు సెంట్రల్ జైలుకు వైఎస్ జగన్, స్పెషల్ హెలికాప్టర్లో ఎంట్రీ - ఫోటోలు
Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి వైయస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
![Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి వైయస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/f67620cc9685af5459dd3331e8dbe9cc1720090818095234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వైఎస్ జగన్
1/17
![నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైయస్ జగన్ పరామర్శించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/9b873da881c4d1bec950c69090b8c661606f6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైయస్ జగన్ పరామర్శించారు.
2/17
![పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈవీఎంను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో వైరల్ కూడా అయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/25fecadffd7ce808e1a8a006d6db44c6a2979.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈవీఎంను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో వైరల్ కూడా అయింది.
3/17
![దాంతో పోలీసులు పిన్నెల్లిపై కేసు నమోదు చేశారు. తాజాగా నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లిని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/71f5656152e7aa9361759bfa39813a6769898.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
దాంతో పోలీసులు పిన్నెల్లిపై కేసు నమోదు చేశారు. తాజాగా నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లిని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
4/17
![ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలు పండుతున్నాయని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో విధ్వంస రాజకీయాలకు పాల్పడుతూ విష సంస్కృతికి చంద్రబాబు బీజం వేస్తున్నారని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/a42ff57e59d81f2683cce5fc713f82296c0fe.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలు పండుతున్నాయని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో విధ్వంస రాజకీయాలకు పాల్పడుతూ విష సంస్కృతికి చంద్రబాబు బీజం వేస్తున్నారని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.
5/17
![ఆస్తులు ధ్వంసం చేస్తూ తిరిగి బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఇది ఏ మాత్రం న్యాయం కాదన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/debf1cebb97c7d9a624ef7e6f73c2976afff0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆస్తులు ధ్వంసం చేస్తూ తిరిగి బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఇది ఏ మాత్రం న్యాయం కాదన్నారు.
6/17
![ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, మంచి పాలన అందించడంలో చంద్రబాబు దృష్టిపెడితే మంచిదన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/d3838ae719085818464a45b0f0ec7ac0dce2d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, మంచి పాలన అందించడంలో చంద్రబాబు దృష్టిపెడితే మంచిదన్నారు.
7/17
![‘‘ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంస చర్యలు జరుగుతున్నాయి. కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదు అన్న కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దొంగ కేసులు పెడుతున్నారు. వీళ్లే కొడతారు, మళ్లీ వీళ్లే అటువైపున ఉన్న వారి మీద కేసులు పెడతారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/f4595ba037ca23e8db908c2e12f2e675d80a1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
‘‘ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంస చర్యలు జరుగుతున్నాయి. కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదు అన్న కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దొంగ కేసులు పెడుతున్నారు. వీళ్లే కొడతారు, మళ్లీ వీళ్లే అటువైపున ఉన్న వారి మీద కేసులు పెడతారు.
8/17
![ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు. ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైయస్సార్ సీపీ పరిపాలనలో ఉండగా కులం చూడలేదు, మతం చూడలేదు. ప్రాంతం చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకం, ప్రతి మంచీ కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేశాం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/273974f3c14d3599ea1a11f26b5dfc9491792.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు. ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైయస్సార్ సీపీ పరిపాలనలో ఉండగా కులం చూడలేదు, మతం చూడలేదు. ప్రాంతం చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకం, ప్రతి మంచీ కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేశాం.
9/17
![ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఓటు వేయలేదనే కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. రాజశేఖరరెడ్డి గారి విగ్రహాలను విరగ్గొడుతున్నారు, పగలగొడుతున్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల మాదిరిగా పండుతాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/e318201995a13c1f41485b48b7b219f296532.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఓటు వేయలేదనే కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. రాజశేఖరరెడ్డి గారి విగ్రహాలను విరగ్గొడుతున్నారు, పగలగొడుతున్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల మాదిరిగా పండుతాయి.
10/17
![ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని, ప్రజల దగ్గరకు వెళ్లి ఫలాన మంచి చేశాం కాబట్టి ఓటు వేయండి అనే పరిస్థితులు ఉండాలి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/a71f8281a334754d33a6d434fee5ba81b0143.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని, ప్రజల దగ్గరకు వెళ్లి ఫలాన మంచి చేశాం కాబట్టి ఓటు వేయండి అనే పరిస్థితులు ఉండాలి.
11/17
![image 12కానీ ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, అన్యాయమైన కేసులు పెట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, భయాందోళనలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తే, అలాంటి రాజకీయం ఏ రోజూ నిలబడదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/83104755e63f85472d062ab00b1d58158bdf9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
image 12కానీ ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, అన్యాయమైన కేసులు పెట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, భయాందోళనలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తే, అలాంటి రాజకీయం ఏ రోజూ నిలబడదు.
12/17
![తాత్కాలిక మేలు ఏదైనా జరగుతుందేమో కానీ తర్వాత ఓటు వేసేటప్పుడు ప్రజలు ఇవన్నీ కచ్చితంగా గుర్తుపెట్టుకుని, లెక్కాజమా చేసి చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు, రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఈ సందర్భంగా చంద్రబాబులో మార్పు రావాలని తెలియజేస్తున్నా.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/5ac7c1184eecc3716ec15b22c3b9b63451901.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తాత్కాలిక మేలు ఏదైనా జరగుతుందేమో కానీ తర్వాత ఓటు వేసేటప్పుడు ప్రజలు ఇవన్నీ కచ్చితంగా గుర్తుపెట్టుకుని, లెక్కాజమా చేసి చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు, రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఈ సందర్భంగా చంద్రబాబులో మార్పు రావాలని తెలియజేస్తున్నా.
13/17
![చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఆకర్షితులై, ఆ 10 శాతం ఓట్లు అటు షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/57e6a42653db99f6c940d0e905d70cb1c518c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఆకర్షితులై, ఆ 10 శాతం ఓట్లు అటు షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు.
14/17
![మేనిఫెస్టోలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్నాడు. ఖరీఫ్లో జోరుగా వ్యవసాయం పనులు జరుగుతున్నాయి. రైతన్నలు పంటలు వేగంగా వేస్తున్నారు. ఇంత వరకు రైతు భరోసా రూ.20 వేలు ఇస్తానన్న దానికి అతీగతీ లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/169d7b4b268b08dc60306ce4663eb2b1e0142.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మేనిఫెస్టోలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్నాడు. ఖరీఫ్లో జోరుగా వ్యవసాయం పనులు జరుగుతున్నాయి. రైతన్నలు పంటలు వేగంగా వేస్తున్నారు. ఇంత వరకు రైతు భరోసా రూ.20 వేలు ఇస్తానన్న దానికి అతీగతీ లేదు.
15/17
![అమ్మ ఒడి కింద జగన్ రూ.15 వేలు ఐదేళ్లపాటు ఇచ్చాడు. కాని, చంద్రబాబు నాయుడు ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తాడని, ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు ఇస్తాడని చెప్పారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా బడి ఈడు పిల్లలున్నారు. తల్లికి వందనం కింద ఆ డబ్బులేమయ్యాయి అని అడుగుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/a855b35ee31ceda96125d77798fa7f692d333.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అమ్మ ఒడి కింద జగన్ రూ.15 వేలు ఐదేళ్లపాటు ఇచ్చాడు. కాని, చంద్రబాబు నాయుడు ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తాడని, ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు ఇస్తాడని చెప్పారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా బడి ఈడు పిల్లలున్నారు. తల్లికి వందనం కింద ఆ డబ్బులేమయ్యాయి అని అడుగుతున్నారు.
16/17
![గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు డబ్బులిచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు రూ.20 వేలు ఇచ్చే కార్యక్రమం చూడండి. 18 ఏళ్లు పైబడిన ప్రతి అక్కచెల్లెమ్మకు రూ.1500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 4.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని మొన్ననే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2.10 కోట్ల మంది మహిళా ఓటర్లే. అందరూ 18 సంవత్సరాలు నిండిన వారే. వీరందరూ కూడా ఈరోజు అడుగుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/2843a0875735955655ca56171eb6e1a7e65b2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు డబ్బులిచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు రూ.20 వేలు ఇచ్చే కార్యక్రమం చూడండి. 18 ఏళ్లు పైబడిన ప్రతి అక్కచెల్లెమ్మకు రూ.1500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 4.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని మొన్ననే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2.10 కోట్ల మంది మహిళా ఓటర్లే. అందరూ 18 సంవత్సరాలు నిండిన వారే. వీరందరూ కూడా ఈరోజు అడుగుతున్నారు.
17/17
![పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏకంగా 307 అంటే హత్యాయత్నం కేసు పెట్టారు. కారంపూడి ఘటన జరిగిందెప్పుడు? ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు అంటే మే 14న. కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్లను పరామర్శించడానికి డీఎస్పీ అనుమతి తీసుకుని ఎమ్మెల్యే బయల్దేరాడు. ఎమ్మెల్యే కారెంపూడికి చేరుకోక మునుపే ఊరికి అటువైపున ఎస్సీ కుటుంబం ఇల్లు ఉంటే ఊర్లోకి ప్రవేశించకముందే ఎమ్మెల్యేను అడ్డగించారు. గొడవ టౌన్ లో జరుగుతుంటే పిన్నెల్లిని ఊరుబయటే అడ్డగించారు’’ అని వైయస్ జగన్ అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/fd4c812e43b464267e4f1b2b1d4cf1dcfd6ed.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏకంగా 307 అంటే హత్యాయత్నం కేసు పెట్టారు. కారంపూడి ఘటన జరిగిందెప్పుడు? ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు అంటే మే 14న. కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్లను పరామర్శించడానికి డీఎస్పీ అనుమతి తీసుకుని ఎమ్మెల్యే బయల్దేరాడు. ఎమ్మెల్యే కారెంపూడికి చేరుకోక మునుపే ఊరికి అటువైపున ఎస్సీ కుటుంబం ఇల్లు ఉంటే ఊర్లోకి ప్రవేశించకముందే ఎమ్మెల్యేను అడ్డగించారు. గొడవ టౌన్ లో జరుగుతుంటే పిన్నెల్లిని ఊరుబయటే అడ్డగించారు’’ అని వైయస్ జగన్ అన్నారు.
Published at : 04 Jul 2024 04:30 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement