అన్వేషించండి

YSRCP Meeting: భీమిలి సభకు డేట్ ఫిక్స్, ఆ రోజు సభ సక్సెస్ చేయడంపై వైసీపీ కసరత్తు

YSRCP News: ఈ నెల 27న భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సీఎం సిద్ధమవుతున్నారు. మూడు లక్షల మందితో ఈ సదస్సు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

YSRCP Political Meeting in Bhemili: ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ప్రధాన పక్షాలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. అధికార వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బీసీ సాధికార బస్సు యాత్ర పేరుతో ఇప్పటికే వైసీపీ ప్రజాప్రతినిధులను ప్రజల్లోకి సీఎం జగన్మోహన్‌రెడ్డి పంపించారు. సీఎం కూడా సంక్షేమ పథకాల నిధుల విడుదల కార్యక్రమాన్ని బహిరంగ సభలు నిర్వహిస్తూనే విడుదల చేస్తున్నారు. పూర్తిగా ఎన్నికల సదస్సులను సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇప్పటి వరకు నిర్వహించలేదు. ఈ నెల 27న భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. సుమారు మూడు లక్షల మందితో ఈ సదస్సు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ మేరకు వైసీపీ నాయకులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

జన సమీకరణపై అగ్ర నాయకులు దృష్టి

సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు నిర్వహిస్తున్న తొలి సదస్సు కావడంతో వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. సుమారు మూడు లక్షల మందితో ఈ సదస్సు నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. ఇందుకోసం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలను సమీకరించాలని వైసీపీ నిర్ణయించింది. ఒక్కో సచివాలయం నుంచి కనీసం వంద మందిని తీసుకువచ్చేలా అగ్రనాయకులు లోకల్‌ నాయకులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. సదస్సు నేపథ్యంలో వైసీపీ కీలక నాయకులు వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్‌ నియోజకవర్గాలు వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం కూడా మంత్రి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి శ్రీకాకుళం జిల్లా నేతలతో పార్టీ కార్యాలయంలో సమీక్షించారు. సభను విజయవంతం చేసేలా జనాలను సమీకరించాలని సూచించారు. తొలి ఎన్నికల సభ కావడంతో పార్టీ నాయకులు కూడా దీన్ని గ్రాండ్‌ సక్సెస్‌ చేయడంపై దృష్టి సారించారు. 

కీలక ప్రకటనకు అవకాశం

సీఎం జగన్మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న తొలి ఎన్నికల సభ కావడంతో వచ్చే ఎన్నిలకు సంబంధించిన కీలక హామీలను ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏం చేస్తామన్న దానిపై సీఎం ఇక్కడ ప్రకటించే చాన్స్‌ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీ మేనిఫెస్టో తయారీలో పార్టీ కీలక నాయకులు నిమగ్నమై ఉన్నారు. మేనిఫెస్టో అమ్ముల పొదిలోని కీలక అస్ర్తాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి బీమిలి సభ వేదికగా ప్రకటించే చాన్స్‌ ఉందని చెబుతున్నారు. అది రైతు రుణమాఫీయా..? లేక మరో అంశమా..? అన్నది తెలియాల్సి ఉంది. 

కేడర్‌తో మాటామంతీ.. 

ఈ సభ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో సీఎం జగన్మోహన్‌రెడ్డి మాటామంతీ నిర్వహించే అవకాశముందని చెబుతున్నారు. కొంత మంది కార్యకర్తలతో సీఎం ఇష్టాగోష్టిగా చర్చించడంతోపాటు స్థానికంగా ఉన్న ఇబ్బందులను తెలుసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎంతో మాట్లాడేందుకు కొంత మంది నాయకులను ఎంపిక చేస్తున్నట్టు చెబుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget