అన్వేషించండి

Year Ender 2022: 2022లో బాగా గుర్తుండిపోయిన సంఘటనలివే, మొదటి రోజే విషాదం

Goodbye 2022: ఈ ఏడాదిలో గుర్తుండిపోయే సంఘటనలు ఎన్నో జరిగాయి.

Goodbye 2022:

వెల్‌కమ్‌  2023

మరి కొద్ది రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. సరికొత్త ఆశలతో 2023కి వెల్‌కమ్ చెప్పేందుకు అంతా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో మార్పులొచ్చాయి. మరెన్నో గుర్తుపెట్టుకునే సంఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని మంచివి ఉన్నాయి. మరికొన్ని బాధ పెట్టినవీ ఉన్నాయి. ఆ కీలక సంఘటనలేంటో ఓ సారి గుర్తు చేసుకుందాం. 

Biggest Events of 2022

1. 2022ని చాలా హుషారుగా మొదలు పెట్టిన తొలి రోజే...అంటే జనవరి 1వ తేదీనే అందరినీ బాధ పెట్టే సంఘటన జరిగింది. కొత్త ఏడాదిలో శుభారంభం కోసం మాతా వైష్ణోదేవి ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు భక్తులు. ఆ సమయంలోనే కొందరు మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడం వల్ల సిబ్బంది వాళ్లను కంట్రోల్ చేయలేకపోయింది. ఫలితంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబ సభ్యులకు ఈ చేదు వార్త కలిచి వేసింది. 

2. ఆ తరవాత ఫిబ్రవరిలోనూ ఈ విషాదం కొనసాగింది. భారతరత్న, గానకోకిల లతా మంగేష్కర్ (92) ఫిబ్రవరి 6వ తేదీన తుదిశ్వాస విడిచారు. సంగీత సామ్రాజ్యంలో మహారాణిగా వెలుగొందిన ఆమె మరణం ఎంతో మంది అభిమానులను కంటతడి పెట్టించింది. ముంబయిలోని 
ఆసుపత్రిలో చాలా రోజుల పాటు అనారోగ్యంతో పోరాడి చివరకు కన్నుమూశారు లతాజీ. సంగీతాభిమానులకు ఈ ఏడాదిని ఓ చేదు జ్ఞాపకంగా మిగిల్చి వెళ్లారు. 

3.ఇక రాజకీయాల పరంగా చూస్తే...ఈ ఏడాది అన్ని పార్టీలకు అత్యంక కీలకమైంది. ఏడాది మొదట్లోనే మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో ఎన్నికల యుద్దం చాలా ఉత్కంఠగా సాగింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, 
మణిపూర్‌లో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చి తన బలాన్ని నిరూపించుకుంది. ఒక్క పంజాబ్‌లో మాత్రం ఆప్‌ విజయ కేతనం ఎగరేసింది. బీజేపీ విజయ ప్రస్థానంలో 2022 గుర్తుంచుకోదగిందే. ఇక ఇటీవల గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ ఎన్నికలు జరగ్గా...గుజరాత్‌లో బంపర్
మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వశమైంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్‌కు...ఈ విజయం కాస్త ఊతమిచ్చింది. 

4. రాజకీయాల్లోనే మరో కీలక పరిణామమూ చోటు చేసుకుంది. 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 24 ఏళ్ల తరవాత ఈ అరుదైన ఘనత సాధించారు మల్లికార్జున్ ఖర్గే. ఎన్నో నాటకీయ పరిణామాల తరవాత శశిథరూర్, ఖర్గే మధ్య అధ్యక్ష పోటీ జరగ్గా...ఆ పదవి ఖర్గేను వరించింది. దళిత వర్గానికి చెందిన మల్లికార్జున్ ఖర్గేను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడం ద్వారా కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించింది కాంగ్రెస్. కాకపోతే...అది పార్టీకి ఏ రకంగా ఉపయోగపడుతుందనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే గుజరాత్‌లో ఘోర పరాభవం చవి చూసింది కాంగ్రెస్. అయితే...ఇప్పుడిప్పుడే ప్రియాంక గాంధీ, ఖర్గే నేతృత్వంలో బలోపేతమ య్యేందుకు ప్రయత్నిస్తోంది. 

5. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది...శ్రద్ధ హత్య కేసు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తితో సహజీవనం చేసి...చివరకు ఆ వ్యక్తి చేతుల్లోనే అత్యంత దారుణంగా హత్యకు గురైంది శ్రద్ధ. ప్రస్తుతం విచారణ వేగంగా కొనసాగుతోంది. 

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
NEET PG 2025 Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
Embed widget