News
News
వీడియోలు ఆటలు
X

Wrestlers Protest: ఢిల్లీలో భారత రెజ్లర్ల ఆందోళనలు, బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Wrestlers Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత రెజ్లర్లు నిరసనకు దిగారు.

FOLLOW US: 
Share:

Wrestlers Protest:

జంతర్ మంతర్ వద్ద నిరసనలు 

భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. Wrestling Federation of India (WFI) చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ గతంలోనూ నినదించారు. అయినా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. పోలీసుల తీరుని నిరసిస్తూ మరోసారి నిరసన వ్యక్తం చేశారు. మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఇంకా FIR నమోదు కాలేదు.  ఈ నిర్లక్ష్యంపై రెజ్లర్ వినేష్ ఫోగట్ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులపై మండి పడ్డారు. వినేష్ ఫోగట్‌తో పాటు బజ్‌రంగ్ పునియా, సాక్షి మాలిక్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. జనవరిలోనూ దీనిపై నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం ఈ కేసుని విచారించేందుకు ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని నియమించింది. ఇప్పటి వరకూ ఆ రిపోర్ట్ విడుదల చేయలేదు. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

"మహిళా రెజ్లర్లు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా రూపొందించిన ఆ రిపోర్ట్‌ని ప్రజల ముందుంచాలి. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. కంప్లెయింట్ చేసిన వాళ్లలో ఓ మైనర్ కూడా ఉన్నారు"

- సాక్షి మాలిక్, రెజ్లర్ 

బజ్‌రంగ్ పునియా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. "బ్రిజ్ భూషణ్‌ని అరెస్ట్ చేసేంత వరకూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు" అని వెల్లడించారు. 

"మాకు న్యాయం జరిగేంత వరకూ మేం ఇక్కడే తింటాం. ఇక్కడే నిద్రపోతాం. మూడు నెలలుగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ని కలవాలని ప్రయత్నిస్తున్నాం. కమిటీ సభ్యులు అసలు మా ఆరోపణలను పట్టించుకోవడం లేదు. అటు క్రీడాశాఖ కూడా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. మేం కాల్ చేసినా అటెండ్ చేయడం లేదు. దేశం కోసం మేం మెడల్స్ సాధించాం. ఎన్నో త్యాగాలు చేస్తే కానీ ఈ స్థాయికి చేరుకోలేదు"

- వినేష్ ఫోగట్, రెజ్లర్ 

జనవరి 23వ తేదీన కేంద్ర క్రీడా శాఖ ఐదుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. నెల రోజుల్లోగా రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆ తరవాత ఆ గడువును పెంచుతూ వచ్చింది. కమిటీ కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చినప్పటికీ...అందులోని వివరాలేంటో పబ్లిక్‌గా చెప్పలేదు. ఢిల్లీ పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కేసు నమోదు చేయకపోవడాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ తప్పు పట్టింది. అయితే అటు పోలీసులు మాత్రం ఇప్పటి వరకూ 7గురిపై కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. 

Also Read: Rahul Gandhi: మా అమ్మ చేతి వంట అద్భుతం, లాలూ కూడా బాగా వండుతారు - రాహుల్ గాంధీ

Published at : 23 Apr 2023 05:45 PM (IST) Tags: Bajrang Punia Delhi Police vinesh phogat WFI Wrestlers Protest Wrestlers Brij Bhushan

సంబంధిత కథనాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!