అన్వేషించండి

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా, ప్రచారాన్ని మొదలు పెట్టిన జో బైడెన్

మరోసారి పోటీ చేయడంపై అనేక సందేహాలు నెలకొన్నవేళ జో బైడెన్ కీలక ప్రకటన చేశారు.

అనేక సందేహాల మధ్య అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని జో బైడెన్ మంగళవారం (ఏప్రిల్ 25 ) ప్రకటించారు. వైట్‌హౌస్‌ బయట వెలుపల హింసాత్మక ప్రదర్శనకు సంబంధించిన వీడియోను పోస్టు చేసి తన మనసులో మాట చెప్పారు.  

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి తరానికి ఒక అవకాశం వస్తుంది. , ప్రాథమిక స్వేచ్చ కోసం నిలబడాల్సిన అవసరం వస్తుంది. ఆ సమయం వచ్చిందని భావిస్తున్నాను అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అంటూ ప్రకటన విడుదల చేశారు.  మాతో చేరండి అంటూ అమెరికా ప్రజలను అభ్యర్థిస్తూ బైడెన్ తన ఎన్నికల ప్రచార బృందాన్ని ప్రకటించారు.

బైడెన్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి వైట్ హౌస్ సీనియర్ అధికారి, దీర్ఘకాలిక డెమొక్రటిక్ పార్టీ కార్యకర్త జూలీ చావెజ్ రోడ్రిగ్జ్‌ను మళ్లీ ఎంచుకున్నారని యుఎస్ మీడియా తెలిపింది. అంతకుముందు, సోమవారం (ఏప్రిల్ 24) జో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ తాను మళ్లీ ఎన్నికల్లో పోటీపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే ప్రకటన ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. అది జరిగిన 24 గంటల్లోనే ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. 

'నేను, జో బైడెన్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం- కమలా హారిస్‌ 

తాను మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని జో బైడెన్ ప్రకటించిన తర్వాత, 58 ఏళ్ల కమలా హారిస్ కూడా ఉపాధ్యక్ష రేసులో తిరిగి పాల్గొంటానని చెప్పారు. మూడేళ్ల క్రితం కమలా హారిస్ ఆఫ్రికన్-అమెరికన్, ఆసియన్-అమెరికన్ సంతతికి చెందిన తొలి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె ట్వీట్ చేశారు. 'అమెరికన్లుగా మేం స్వేచ్ఛ, అర్హతలను నమ్ముతాం. దాని కోసం పోరాడాలనే మా ఆకాంక్ష ఎంత శక్తివంతమైనదో మన ప్రజాస్వామ్యం కూడా అంతే శక్తివంతంగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. అందుకే జో బైడెన్, నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం. అని ట్వీట్ చేశారు. 

ట్రంప్ కూడా రంగంలోకి దిగారు.
గతంలో పతాక శీర్షికల్లో నిలిచిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 2024 అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని 2022 నవంబర్‌లోనే ప్రకటించారు. అమెరికా తదుపరి అధ్యక్షుడి ఎన్నిక నవంబర్ 5, 2024న జరగనుంది. 

జో బిడెన్ ఎన్నికల్లో నిలబడేది కూడా సందేహాస్పదంగా ఉంది. ప్రస్తుతానికి ఆయనకు ఉన్న ప్రజాదరణ బాగా తగ్గింది. బిడెన్ పేరుపై పార్టీలో ఏకాభిప్రాయం లేదని అమెరికన్ మీడియా కథనాలు వస్తున్నాయి. అయితే ఈసారి కూడా పోటీ చేస్తానని ప్రకటన చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Embed widget