ట్రంప్ ప్రకారం, ఇరాన్తో ఉన్న అవగాహన ఒప్పందం గడువు ముగిసింది. ఇటీవలి పరిణామాల తర్వాత ఈ ఒప్పందం తన ప్రాధాన్యతను కోల్పోయిందని ఆయన నమ్ముతున్నారు.
US Iran News: ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!
US Iran News: టర్కీలోని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలపై చర్చను మళ్లీ రేకెత్తించింది.

- నాటో శిఖరాగ్రంలో ట్రంప్ ఇరాన్తో అవగాహన ఒప్పందం ముగిసిందని ప్రకటించారు.
- హోర్ముజ్ దాడికి ప్రతిగా అమెరికా ఇరాన్పై శక్తివంతమైన దాడులు చేసింది.
- ట్రంప్ ఇరాన్ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించగా ఉద్రిక్తతలు పెరిగాయి.
US Iran News: టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. మీడియాతో మాట్లాడుతూ, ఇరాన్తో ఉన్న అవగాహన ఒప్పందం (MoU) గడువు ఇప్పుడు ముగిసిపోయిందని తాను నమ్ముతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవలి పరిణామాల తర్వాత ఇరు దేశాల మధ్య ఒప్పందం తన ప్రాధాన్యత కోల్పోయిందని ఆయన తెలిపారు.
అవగాహన ఒప్పందం ముగిసిపోయింది
మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, "ఇప్పుడు అవగాహన ఒప్పందం ముగిసిపోయిందని నేను భావిస్తున్నాను" అని ట్రంప్ అన్నారు. అమెరికా, ఇరాన్ల మధ్య పరిస్థితి ఎంతగా ముదిరిందంటే, ఇరు దేశాల మధ్య ఒప్పందం భవిష్యత్తు ముగిసిపోయిందని భావించాలని ఆయన సూచించారు. "నిన్న రాత్రి ఇరాన్లోని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులపై శక్తివంతమైన దాడి చేశాము" అని ట్రంప్ అన్నారు. ఈ చర్య అమెరికా భద్రతకు అత్యవసరమని ఆయన అభివర్ణించారు ఈ ఆపరేషన్ను చాలా స్ట్రాంగ్గా నిర్వహించామని చెప్పారు.
ఇరాన్ నాయకత్వంపై కామెంట్స్
అమెరికా అధ్యక్షుడు ఇరాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు, "వారికి జబ్బుంది, వారిలో ఏదో లోపం ఉంది" అని అన్నారు. అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, ఇరు దేశాల మధ్య ఇటీవలి సైనిక పరిణామాలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారిన టైంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఈ 60 రోజుల మధ్యంతర ఒప్పందం కుదిరింది. ఘర్షణకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పరోక్ష చర్చలకు అవకాశం కల్పించేందుకు లక్ష్యంతో ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, ఖతార్లో జరిగిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఇంతలో అమెరికా మంగళవారం ఇరాన్ లక్ష్యాలంగా దాడులు మొదలు పెట్టింది. దీనికి తోడు ట్రంప్ కూడా తీవ్రంగా స్పందించారు. "వారు అబద్ధాలకోరులు, మోసగాళ్ళు, రోగులు," అని విరుచుకుపడ్డారు. ఇరాన్ అధికారులతో తదుపరి చర్చలు జరపడానికి తనకు ఆసక్తి లేదని పేర్కొన్నట్లు నివేదికలు తెలిపాయి.
వాషింగ్టన్- టెహ్రాన్ మధ్య సంబంధాలు వేగంగా క్షీణిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నాయి. హోర్ముజ్ జలసంధిలో జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఈ దాడులు జరిగాయని అమెరికా పేర్కొంది.
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా సైనిక దాడులు జరిపినట్లు సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) తెలిపింది. ఈ దాడుల అనంతరం మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది.
సెంట్కామ్ ప్రకారం, "వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడికి తక్షణ ప్రతిస్పందన"గా ఈ ఆపరేషన్ జరిగింది.
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన జలమార్గంలో ఇప్పటికే బలహీనంగా ఉన్న భద్రతా పరిస్థితి మరింత క్షీణించిందనడానికి ఈ సైనిక చర్య ఉదాహరణగా నిలుస్తుంది.
నిరసనకారులపై అణచివేత జరుగుతోందని ట్రంప్ ఆరోపణ
తన ప్రసంగంలో ఇరాన్లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ అధికారులు తీవ్రమైన అణచివేతకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
వాషింగ్టన్పై టెహ్రాన్ తీవ్ర ఆరోపణలు
అమెరికా పదే పదే చేస్తున్న దాడులను ఇరాన్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఇవి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఈ ప్రాంతంలో వాషింగ్టన్ మరింత అస్థిరతను సృష్టిస్తోందని ఆరోపించారు.
ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమెరికా పదేపదే ఉల్లంఘించిందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పదేపదే జరుగుతున్న ఈ దురాక్రమణ చర్యలకు టెహ్రాన్ ప్రతిస్పందిస్తుందని హెచ్చరించింది.
Before You Go
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Frequently Asked Questions
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఉన్న అవగాహన ఒప్పందం (MoU) గురించి ఏమని వ్యాఖ్యానించారు?
అమెరికా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేయడానికి గల కారణం ఏమిటి?
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఈ సైనిక దాడులు జరిపింది. ఇది
అమెరికా దాడులపై ఇరాన్ ఎలా స్పందించింది?
అమెరికా దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్ ఈ ప్రాంతంలో అస్థిరతను సృష్టిస్తోందని ఆరోపించింది.
అమెరికా, ఇరాన్ మధ్య ముగిసిన మధ్యంతర ఒప్పందం ఏమిటి?
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఘర్షణకు శాశ్వత పరిష్కారం కోసం పరోక్ష చర్చలకు ఇది అవకాశం కల్పించాలనే లక్ష్యంతో జరిగింది.
ట్రెండింగ్ వార్తలు






















