Istanbul earthquake : ఇస్తాంబుల్లో భారీ భూకంపం -భయంతో భవనాలపై నుంచి దూకిన ప్రజలు
Earthquake : తుర్కియే రాజధాని ఇస్తాంబుల్ లో భారీ భూకంపం వచ్చింది. ఈ కారణంగా చాలా మంది భయంతో భవనాల పై నుంచి దూకేశారు.

Powerful earthquake shakes Istanbul : భూకంపం మరోసారి భయపెట్టింది. తుర్కియే రాజధాని ఇస్తాంబుల్ను బలమైన భూకంపం వణికించింది. కొద్ది సెకన్ల పాటు భవనాలు కదిలిపోయాయి. చాలా మంది భయంతో భవనాల పై నుంచి దూకేయడంతో గాయపడ్డారు. భూకంప తీవ్రత ఎంత అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. భవనాలు ఊగిపోయాయి కానీ పెద్దగా ప్రమాదం ఏర్పడలేదు. కొన్ని పాత భవనాలు కూలిపోయినట్లుగా సామచారం ఉంది. ఇస్తాంబుల్కు పశ్చిమాన 80 కి.మీ దూరంలో ఉన్న సిలివ్రి సమీపంలోన భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. భవానాలు ఊగిపోవడంతో ప్రజలు భయందోళనలకు గురయ్యారు. పై నుంచి దూకడంతో దూకి 150 మందికి పైగా గాయపడ్డారని అంతర్జాతీయ న్యూస్ ఏెజెన్సీలు చెబుతున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో అత్యంత బలమైన భూకంపాలలో ఇది ఒకటని నిపుణులు చెబుతున్నారు.
A series of earthquakes have hit Turkey, and fairly big ones.
— Cheryl E 🇮🇱🇮🇱🇮🇱🎗️ (@CherylWroteIt) April 23, 2025
One of the quakes hit during a live broadcast.
Buildings in Istanbul were "shaken" following a magnitude 6 earthquake. pic.twitter.com/UfkNjMwpEd
రిక్టర్ స్కేలుపై తీవ్ర 6.2 ఉండవచ్చని చెబుతున్నారు. చాలా మంది ప్రజలు పార్కులలో గుమిగూడారు.ఇస్తాంబుల్ మధ్యలో తమ ఇళ్ల వదిలి బయటకు వచ్చారు. ప్రకంపనలు వచ్చినప్పుడు అందరూ వీధుల్లోకి వచ్చారు. దుకాణాలు మూసివేశారు కానీ.. ఇస్తాంబుల్ లో మౌలిక సదుపాయాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని గుర్తించారు.
Powerful earthquake shakes Istanbul, dozens hurt jumping from buildings https://t.co/x62rpFRwHf pic.twitter.com/X56TLYuAKB
— Reuters (@Reuters) April 23, 2025
రెండేళ్ల క్రితం టర్కీ చరిత్రలో అత్యంత ఘోరమైన , అత్యంత వినాశకరమైన భూకంపాన్ని చూసింది. ఫిబ్రవరి 2023లో సంభవించిన 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో దక్షిణ టర్కీ , ఉత్తర సిరియాలో 55,000 మందికి పైగా మరణించారు , 107,000 మందికి పైగా గాయపడ్డారు.లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు, ఆ భూకంపం ఫలితంగా చాలా మంది ఇప్పటికీ తాత్కాలిక గృహాలలో నివసిస్తున్నారు.
CCTV footage of 6.2 earthquake in a restaurant in Istanbul, Turkey pic.twitter.com/xqtHCdqHJ8
— Disasters Daily (@DisastersAndI) April 23, 2025
తాజా భూకంపం 1999లో ఇస్తాంబుల్ సమీపంలో సంభవించిన భూకంపం జ్ఞాపకాలను కూడా గుర్తు చేసింది. అందులో 17,000 మంది మరణించారు. బుధవారం మధ్యాహ్నం 12:49 గంటలకు సంభవించిన భూకంప కేంద్రం ఇస్తాంబుల్కు పశ్చిమాన 80 కి.మీ (50 మైళ్ళు) దూరంలో ఉన్న సిలివ్రి ప్రాంతంలో ఉంది. ఇది 6.92 కి.మీ (4.3 మైళ్ళు) లోతులో ఉందని టర్కీ AFAD విపత్తు సంస్థ తెలిపింది. ల్లో హైవేలు, విమానాశ్రయాలు, రైళ్లు లేదా సబ్వేలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని ప్రభుత్వం ప్రకటించింది.
There were 7 earthquakes in Istanbul today. The biggest one is 6.2!
— The Figen (@TheFigen_) April 23, 2025
All people are ok, thank God!
This is the earthquake moment in the Bosphorus.
I want to ask geology engineers all over the world.
Can there be a bigger earthquake after 6.2 ? pic.twitter.com/YssqY9KZTU





















