అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Middle East War: పశ్చిమాసియాలో బాంబుల మోత! భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు!
Middle East War: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఇరాన్లోని భారత్ రాయభార కార్యాలయం 48 గంటల పాటు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించింది.

- ఇరాన్లో భారతీయులకు 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని సూచన.
- అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశం.
- అనవసర ప్రయాణాలు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా నివారించాలని సూచన.
- అత్యవసర సహాయానికి భారత రాయబార కార్యాలయం హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది.
Middle East War: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న వైరం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్లోని టెహ్రాన్లో ఉన్న భారత రాయభార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రత దృష్ట్యా అత్యంత కీలకమైన అడ్వైజరీని విడుదల చేసింది.
మధ్య ప్రాచ్యంలో ముదురుతున్న సంఘర్షణల దృష్ట్యా ఇరాన్లో ఉన్న భారతీయులందరూ రాబోయే 48 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత ఎంబసీ ఆదేశించింది. పౌరులు తాము ఎక్కడ ఉన్నరో అక్కడే ఉండాలని చెప్పింది. అనవసరంగా బయటకు రావద్దని స్పష్టం చేసింది. ముఖ్యంగా బహుళ అంతస్తుల్లో ఉన్న వారు పై అంతస్తుల్లో ఉండొద్దని హితవు పలికింది. సురక్షితమైన కింది గదుల్లోకి మారాలని సూచించింది. ఎంబసీ ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో ఉంటున్న వారు తమ గదులను వదిలి బయటకు రావద్దని,, నిరంతతరం ఎంబసీ బృందాలతో టచ్లో ఉండాలని స్పష్టం చేసింది.
ఎందుకూ ఈ ఆదేశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఇచ్చిన గడువు ముగుస్తుంటడమే ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని లేని పక్షంలో ఇరాన్ ఒక నాగరితగా అంతరించిపోయే ప్రమాదం ఉందని ట్రంప్ సోషల్ మీడియా వేదికంగా హెచ్చరించారు. ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లు, వంతెనలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని అమెరికా హెచ్చరించడంతో ఆయా ప్రాంతాలకు భారతీయులు దూరంగా ఎంబసీ భావిస్తోంది.
ఆదేశాలు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చాయంటే?
ఈ హెచ్చరికలు ఏప్రిల్ 7 నుంచి తక్షణం అమలులోకి వచ్చాయి. రాబోయే 48 గంటలు అంటే ఏప్రిల్ 9 వరకు అత్యంత కీలకమని ఎంబసీ పేర్కొంది,. ఈ కాలంలో ఎటువంటి రహదారి ప్రయాణాలు చేయకూడదని, ఒక వేళ అత్యవసరమైతే తప్పనిసరిగా ఎంబసీ సమన్వయంతోనే కదలాలని నిబంధన విధించింది.
ఎలా అప్రమత్తంగా ఉండాలి?
భారతీయ పౌరులు సహాయార్థం ఎంబసీ నిరంతరం పని చేసే హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది.
అత్యవసర మొబైల్ నంబర్లు: +989128109115, +989128109102, +989128109109, +989932179359
ఈమెయిల్: cons.tehran@mea.gov.in
పౌరులు అధికారిక ప్రకటనలను నిరంతరం గమనిస్తూ ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దని ఎంబసీ కోరింది. విద్యుత్ గ్రిడ్లు, సైనిక స్థావరాలు, వ్యూహాత్మక భవనాలకు వీలైనంత దూరంగా ఉండటం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని సూచించింది.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Frequently Asked Questions
పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమిటి?
ఇరాన్లో ఉన్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం ఎటువంటి సలహాలు ఇచ్చింది?
రాబోయే 48 గంటలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు రావద్దని, సురక్షితమైన కింది గదుల్లో ఉండాలని సూచించింది. ఎంబసీ వసతి గృహాల్లో ఉన్నవారు బయటకు రావద్దని, ఎంబసీతో నిరంతరం టచ్లో ఉండాలని ఆదేశించింది.
ఈ హెచ్చరికలు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చాయి?
ఈ హెచ్చరికలు ఏప్రిల్ 7 నుంచి తక్షణం అమలులోకి వచ్చాయి. రాబోయే 48 గంటలు, అంటే ఏప్రిల్ 9 వరకు అత్యంత కీలకమని ఎంబసీ పేర్కొంది.
భారతీయులు ఎలా అప్రమత్తంగా ఉండాలి?
అధికారిక ప్రకటనలను గమనిస్తూ, పుకార్లను నమ్మవద్దని సూచించారు. విద్యుత్ గ్రిడ్లు, సైనిక స్థావరాలు, వ్యూహాత్మక భవనాలకు దూరంగా ఉండాలి.
ట్రెండింగ్ వార్తలు





















