అన్వేషించండి

Jack Ma In Nepal: నేపాల్‌లో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, ప్రధాని పుష్ప కమల్‌ను కలిసే ఛాన్స్

Jack Ma In Nepal: అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా నేపాల్ కు వచ్చారు. ప్రధానమంత్రి పుష్ప కమల్ ను కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Jack Ma In Nepal: చైనా బిలియనీర్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా నేపాల్ పర్యటనలో ఉన్నారు. మంగళవారం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు ఇమ్మిగ్రేషన్ శాఖ డైరెక్టర్ జనరల్ జలక్రమ్ అధికారి తెలిపారు. బంగ్లాదేశ్ లోని ఢాకా మీదుగా ప్రత్యేక విమానంలో ఖాట్మండులో దిగిన జాక్ మాకు.. నేపాల్ లో వ్యాపార సంబంధాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. జాక్ మా స్థాపించిన అలీబాబా.. ఇ-కామర్స్ కంపెనీ అయిన దరాజ్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కంపెనీ పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, నేపాళ్ తో సహా దక్షిణాసియా దేశాల్లో సేవలు అందిస్తోంది. జూన్ 2023 నాటికి జాక్ మా 34.5 బిలియన్ డాలర్ల నికర విలువతో చైనాలో 4వ సంపన్న వ్యక్తిగా, ప్రపంచంలో 39వ సంపన్న వ్యక్తిగా ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ చెబుతోంది. దక్షిణ, తూర్పు ఆసియాలో ప్రసిద్ధి చెందిన దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అలీబాబా.. ఐదేళ్ల క్రితం దరాజ్ ను కొనుగోలు చేసింది. 

జాక్ మా నేపాల్ పర్యటన గురించి చాలా కొద్ది మంది అధికారులకు మాత్రమే తెలుసని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అలాంటి ధనవంతుడు నేపాల్ ను సదర్శించడానికి వచ్చినప్పుడు ఆయనను స్వాగతించడానికి ఎలాంటి కారణం ఉండదని వ్యాఖ్యానించారు. జాక్ మా.. ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ అలాగే ఆర్థిక మంత్రి ప్రకాష్ శరణ్ మహత్ లను కలవాలని ప్రత్యేకంగా అభ్యర్థించినట్లు వారి ప్రైవేట్ సెక్రటేరియట్ లు ధృవీకరించాయి. నేపాల్ లో జాక్ మా ఇతర షెడ్యూల్ అంతా రహస్యంగా ఉంచినట్లు సీనియర్ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. గురువారం పాకిస్థాన్ కు బయలుదేరుతారని వెల్లడించారు. అంతకు ముందు జాక్ మా నేపాల్ లోని చిత్వాన్ ను సందర్శిస్తారని, కానీ ఇంకా నిర్ధారణ కాలేదని అన్నారు.

టోక్యో వర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేసిన జాక్ మా

బిలియనీర్ అయిన జాక్ మా గత నెల విజిటింగ్ ప్రొఫెసర్ అవతారం ఎత్తారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ టోక్యో అఫిలియేటెడ్ అయిన టోక్యో కాలేజీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఆయన అపాయింట్ అయ్యారు. సుస్థిర వ్యవసాయం, ఆహారోత్పత్తిలో జాక్ మా టోక్యో కాలేజీ తరఫున పరిశోధనలు సాగిస్తారని తెలిపారు. ఓ విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా తన అనుభవాలను ఆయన విద్యార్థులు, కాలేజీ ఫ్యాకల్టీతో పంచుకుంటారని సంబంధిత అధికారులు తెలిపారు. వ్యాపారం, కార్పొరేట్ మేనేజ్‌మెంట్, ఇన్నోవేషన్స్ పై జాక్ మా అనుభవనాలు తమ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపతాయని పేర్కొన్నారు. 

2020లో షాంఘైలో జరిగిన ఓ సమావేశంలో ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు చేశారు జాక్‌ మా. అది ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. అప్పటి నుంచి ఆయనపై పగ పట్టింది. 2021లో జాక్ మా వ్యాపారాలపై ఆంక్షలు విధించింది చైనా ప్రభుత్వం. జాక్‌ మా మాట్లాడటం అదే చివరి సారి. ఆ తరవాత ఎక్కడా కనిపించలేదు. మాట్లాడనూ లేదు. Ant Group IPOని కూడా చైనా ప్రభుత్వం నిలిపివేసింది. తర్వాత చాలా కాలం తర్వాత ఆయన బయటకు వచ్చారు. అప్పటి నుంచి చాలా లో ప్రొఫైల్ లో ఉంటున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Embed widget