అన్వేషించండి

Jack Ma In Nepal: నేపాల్‌లో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, ప్రధాని పుష్ప కమల్‌ను కలిసే ఛాన్స్

Jack Ma In Nepal: అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా నేపాల్ కు వచ్చారు. ప్రధానమంత్రి పుష్ప కమల్ ను కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Jack Ma In Nepal: చైనా బిలియనీర్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా నేపాల్ పర్యటనలో ఉన్నారు. మంగళవారం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు ఇమ్మిగ్రేషన్ శాఖ డైరెక్టర్ జనరల్ జలక్రమ్ అధికారి తెలిపారు. బంగ్లాదేశ్ లోని ఢాకా మీదుగా ప్రత్యేక విమానంలో ఖాట్మండులో దిగిన జాక్ మాకు.. నేపాల్ లో వ్యాపార సంబంధాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. జాక్ మా స్థాపించిన అలీబాబా.. ఇ-కామర్స్ కంపెనీ అయిన దరాజ్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కంపెనీ పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, నేపాళ్ తో సహా దక్షిణాసియా దేశాల్లో సేవలు అందిస్తోంది. జూన్ 2023 నాటికి జాక్ మా 34.5 బిలియన్ డాలర్ల నికర విలువతో చైనాలో 4వ సంపన్న వ్యక్తిగా, ప్రపంచంలో 39వ సంపన్న వ్యక్తిగా ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ చెబుతోంది. దక్షిణ, తూర్పు ఆసియాలో ప్రసిద్ధి చెందిన దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అలీబాబా.. ఐదేళ్ల క్రితం దరాజ్ ను కొనుగోలు చేసింది. 

జాక్ మా నేపాల్ పర్యటన గురించి చాలా కొద్ది మంది అధికారులకు మాత్రమే తెలుసని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అలాంటి ధనవంతుడు నేపాల్ ను సదర్శించడానికి వచ్చినప్పుడు ఆయనను స్వాగతించడానికి ఎలాంటి కారణం ఉండదని వ్యాఖ్యానించారు. జాక్ మా.. ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ అలాగే ఆర్థిక మంత్రి ప్రకాష్ శరణ్ మహత్ లను కలవాలని ప్రత్యేకంగా అభ్యర్థించినట్లు వారి ప్రైవేట్ సెక్రటేరియట్ లు ధృవీకరించాయి. నేపాల్ లో జాక్ మా ఇతర షెడ్యూల్ అంతా రహస్యంగా ఉంచినట్లు సీనియర్ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. గురువారం పాకిస్థాన్ కు బయలుదేరుతారని వెల్లడించారు. అంతకు ముందు జాక్ మా నేపాల్ లోని చిత్వాన్ ను సందర్శిస్తారని, కానీ ఇంకా నిర్ధారణ కాలేదని అన్నారు.

టోక్యో వర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేసిన జాక్ మా

బిలియనీర్ అయిన జాక్ మా గత నెల విజిటింగ్ ప్రొఫెసర్ అవతారం ఎత్తారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ టోక్యో అఫిలియేటెడ్ అయిన టోక్యో కాలేజీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఆయన అపాయింట్ అయ్యారు. సుస్థిర వ్యవసాయం, ఆహారోత్పత్తిలో జాక్ మా టోక్యో కాలేజీ తరఫున పరిశోధనలు సాగిస్తారని తెలిపారు. ఓ విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా తన అనుభవాలను ఆయన విద్యార్థులు, కాలేజీ ఫ్యాకల్టీతో పంచుకుంటారని సంబంధిత అధికారులు తెలిపారు. వ్యాపారం, కార్పొరేట్ మేనేజ్‌మెంట్, ఇన్నోవేషన్స్ పై జాక్ మా అనుభవనాలు తమ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపతాయని పేర్కొన్నారు. 

2020లో షాంఘైలో జరిగిన ఓ సమావేశంలో ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు చేశారు జాక్‌ మా. అది ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. అప్పటి నుంచి ఆయనపై పగ పట్టింది. 2021లో జాక్ మా వ్యాపారాలపై ఆంక్షలు విధించింది చైనా ప్రభుత్వం. జాక్‌ మా మాట్లాడటం అదే చివరి సారి. ఆ తరవాత ఎక్కడా కనిపించలేదు. మాట్లాడనూ లేదు. Ant Group IPOని కూడా చైనా ప్రభుత్వం నిలిపివేసింది. తర్వాత చాలా కాలం తర్వాత ఆయన బయటకు వచ్చారు. అప్పటి నుంచి చాలా లో ప్రొఫైల్ లో ఉంటున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget