అన్వేషించండి

China Helps Pakistan: కార్గో విమానంలో పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా ఆరోపణలు, ఘాటుగా స్పందించిన చైనా ప్రభుత్వం, ఆర్మీ

చైనా వైమానిక దళం పాకిస్థాన్‌కు సరకులు తరలించిందన్న వార్తలను తోసిపుచ్చింది.

China denies sending cargo plane with military supplies to Pakistan: చైనా తన అతిపెద్ద సైనిక కార్గో విమానం పాకిస్తాన్‌కు ఆయుధ సరఫరా చేస్తుందని వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. పాకిస్తాన్‌కు చైనా సాయం చేస్తుందని, ఆయుధాలు సరఫరా చేస్తుందనే వార్తలను వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చైనా ప్రభుత్వం హెచ్చరించింది.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (PLAF) తన జియాన్ Y-20 సైనిక రవాణా విమానం పాకిస్తాన్‌కు ఆయుధాలు తీసుకెళ్లిందన్న వదంతులను ఖండించింది. "Y-20 పాకిస్తాన్‌కు సహాయకంగా కొన్ని రకాల ఆయుధాలు, ఆయుధ సామాగ్రిని సరఫరా చేసినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ విషయం అటు చైనా ప్రభుత్వం, ఇటు ఆర్మీ దృష్టికి వెళ్లింది. ఆ వార్తల్లో నిజం లేదని, తాము ఎలాంటి కార్గో విమానంలో పాక్‌ ఆర్మీకి ఆయుధాలు, సామాగ్రి సరఫరా చేయలేదని చైనా వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే విషయాన్ని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో సోమవారం వెల్లడించింది. 

PLAF తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటోలు, కామెంట్లు స్క్రీన్‌షాట్‌లను కూడా పోస్ట్ చేసింది. ప్రతి ఒక్కటి ఎరుపు రంగులో "వార్త" అనే పదంతో ముద్రించారు. "ఇంటర్నెట్ చట్టం కంటే మించింది కాదు. సైనిక సంబంధిత వార్తలను ఉత్పత్తి చేసేవారు వాటికి చట్టపరంగా బాధ్యత వహిస్తారు" అని ఆ నివేదికలో చైనా పేర్కొంది.

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఇటీవల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా దాడులు చేసి నేలమట్టం చేసింది. కానీ పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దులో అమాయక ప్రజల మీద కాల్పులు జరిపింది. అంతటితో ఆగకుండా భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతూ డ్రోన్లు దాడులు, మిస్సైల్ దాడులకు ప్రయత్నించి నవ్వులపాలు అయింది. పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు, మిస్సైల్స్ ను భారత బలగాలు విజయవంతంగా నిర్వీర్యం చేశాయి. ఎస్ 400 సుందర్శన చక్రంలా శత్రువుల డ్రోన్లు, ఫైటర్ జెట్స్, మిస్సైల్స్ ను గాల్లోనే పేల్చివేసింది. 

  స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) ఇటీవలి నివేదిక ప్రకారం, చైనా పాకిస్తాన్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా మారింది. 2020 నుంచి 2024 వరకు చైనా పలుమార్లు ఆయుధాలు సరఫరా చేసింది. పాక్ ఆయుధ కొనుగోళ్లలో 81 శాతం చైనా వాటా ఉంది. కొనుగోళ్లలో జెట్ ఫైటర్లు, రేడార్లు, నేవీ షిప్, సబ్‌మెరైన్లు, క్షిపణులు ఉన్నాయి. పాక్, చైనా దేశాలు కలిసి J-17 విమానాలను తయారు చేస్తాయి, ఇది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ (PAF)కు ప్రధాన ఫైటర్ జెట్ గా చెబుతారు. 

చైనా నుంచి వచ్చిన ఆయుధాలు, క్షిపణులతో భారత్ మీద దాడులకు యత్నించింది పాకిస్తాన్. వాటిని భారత బలగాలు సరిహద్దుల్లో, గాల్లోనే విజయవంతంగా పేల్చివేసి పాక్ కు బుద్ధి చెప్పాయి. ఇదే క్రమంలో పాక్ లోని రావల్ఫిండి, కరాచీ సహా పలు నగరాలలో ఎయిర్ బేస్ లపై భారత బలగాలు దాడులు చేసి పాక్‌కు విధ్వంసం రుచి చూపించాయి. అయితే చైనా మాత్రం భారత ఎయిర్ బేస్ లపై పాక్ దాడి చేసి నష్టపరిచిందని, అదే సమయంలో పాక్ లో దాడులకు వచ్చిన క్షిపణులు, ఫైటర్ జెట్లు, డ్రోన్లను పాక్ ఆర్మీ విజయవంతంగా కూల్చివేశాయని సైతం చైనా మీడియాలో కథనాలు వచ్చాయి. ఏదైనా విషయం పోస్ట్ చేసే ముందు నిర్ధారించుకోవాలని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం గ్లోబల్ టైమ్స్‌ను హెచ్చరించింది.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత్, పాక్ మధ్య యుద్ధ విరామం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని చైనా స్వాగతించింది. చర్చల ద్వారా పరిష్కారం జరగాలని చైనా ఆశిస్తుందని తెలిపారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Embed widget