అన్వేషించండి

అయోధ్య ఉత్సవానికి అందుకే రావడం లేదు, కారణం చెప్పిన శంకరాచార్యులు

Ayodhya Ram Mandir Inauguration: అయోధ్య ఉత్సవానికి ఎందుకు హాజరు కావడం లేదో శంకరాచార్యులు వివరణ ఇచ్చారు.

Ayodhya Ram Mandir Opening:

కారణమిదేనట..

అయోధ్య ఉత్సవానికి (Ayodhya Event) నలుగురు శంకరాచార్యులు హాజరు కావడం లేదని ప్రకటించడం అలజడి రేపింది. ఈ నిర్ణయంపై కొంత మంది విమర్శలు చేశారు. అంత పెద్ద వేడుక జరుగుతుంటే ఎందుకు రావడం లేదని మండి పడ్డారు. అయితే..దీనిపై వాళ్లు క్లారిటీ ఇచ్చారు. పూరీ శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి మహారాజ్‌ తాను ఎందుకు హాజరు కావడం లేదో వివరించారు. వేడుకలు జరిపే తీరు తనకు నచ్చడం లేదని, ఆ ఆచారాలతో విభేదించే హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. దేశ ప్రధాని లోపల రాముడి ప్రాణప్రతిష్ఠ చేస్తుంటే తాము బయట కూర్చుని చూడాలనడం సరికాదని, ఇదే నచ్చలేదని తేల్చి చెప్పారు. అందుకే ఆహ్వానం (Ram Mandir) అందినప్పటికీ శంకరాచార్యులు ఎవరూ ఈ వేడుకకు రావడం లేదని తెలిపారు. 

"శంకరాచార్యులెవరైనా సరే వాళ్లకంటూ ప్రత్యేక గౌరవం, హోదా ఉంటాయి. ఈ విషయంలో మాకు ఎలాంటి గర్వం లేదు. గర్భాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ రాముడి ప్రాణప్రతిష్ఠ చేస్తుంటే కేవలం బయట ప్రేక్షకుల్లా కూర్చుని చూడాలా..? ఆయనను పొగుడుతూ ఉండాలా.."

- స్వామి నిశ్చలానంద సరస్వతి మహారాజ్

రాజకీయ రగడ..

నలుగురు శంకరాచార్యులు ఈ వేడుకల్లో హాజరు కాకపోవడం రాజకీయంగానూ వేడి పెంచింది. అటు ప్రతిపక్షాలు ఇదే అదనుగా  బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆలయ నిర్మాణం సగంలో ఉండగానే కావాలనే ఇలా హడావుడి చేస్తున్నారని మండి పడుతున్నాయి. ఇదంతా కేవలం ఎన్నికల స్టంట్ అంటూ విమర్శిస్తున్నాయి. శంకరాచార్యుల స్థాయి వ్యక్తులు ఈ వేడుకకు హాజరు కావడం లేదంటే దాని వెనక కారణాలంటే తెలుసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేస్తున్నాయి. 

"అయోధ్య వేడుకల్ని రాజకీయం చేసినప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతున్న శంకరాచార్యులు ఎందుకు వస్తారు..? అందుకే వాళ్లు రావడం లేదని తేల్చి చెప్పారు. వాళ్లీ ఉత్సవాన్ని బాయ్‌కాట్ చేశారు. వాళ్లు అలా చేశారంటే కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది"

- అశోక్ గహ్లోట్, కాంగ్రెస్ నేత

ఈ నెల 22న అయోధ్య ఉత్సవానికి (Ayodhya Ram Mandir Opening) ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. వారం ముందు నుంచే 16వ తేదీనే సన్నాహక కార్యక్రమాలు మొదలు కానున్నాయి. దాదాపు వారం రోజుల పాటు అయోధ్య నగరం రామ నామ స్మరణ చేయనుంది. ఈ క్రమంలోనే ఏర్పాట్లకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust అందరికీ తెలియజేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి రానున్నారు. వేలాది మంది సాధువులు ఈ కార్యక్రమంలోనే పాల్గొననున్నారు. రామ మందిరాన్ని నిర్మించిన కూలీల కుటుంబ సభ్యులకూ ఆహ్వానం అందింది. అతిథులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 11 వేల మంది కీలక వ్యక్తులు వస్తారని అంచనా. వీళ్లలో చాలా మంది VIPలే ఉన్నారు. వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడంతో పాటు ఉత్సవానికి వచ్చినందుకు కృతజ్ఞతగా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వనున్నారు. జనవరి 12 నుంచి అయోధ్యకి వచ్చే వాళ్లకి సనాతన్ సేవా న్యాస్‌ (Sanatan Seva Nyas) సంస్థ టోకెన్‌లు ఇవ్వనుంది. రాముడి కానుకగా వీటిని అందజేయనున్నారు. దర్శనం పూర్తైన తరవాత ప్రసాదంతో పాటు ఈ గిఫ్ట్‌లు ఇస్తారు.

Also Read: భారత్‌లో చమురు ధరలు పెరుగుతాయేమో, ఎర్ర సముద్రం సంక్షోభంపై WEF చీఫ్ కీలక వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
TGTET: 'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
Embed widget