అన్వేషించండి

Tamilnadu Politics: ప్రజాకర్షక నేత లేకపోయినా పవర్ తగ్గని అన్నాడీఎంకే - జయలలిత మ్యాజిక్ ఇంకా పని చేస్తోందా?

AIADMK: తమిళనాడు రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత శకం ముగిసినా, అన్నాడీఎంకే తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. ప్రజాకర్షకనేత లేకపోయినా ఎలా నిలబడుతోంది?

Tamilnadu Politics Stron AIADMK: తమిళనాడు  రాజకీయాల్లో ఇప్పుడు డీఎంకేకు పోటీ ఇస్తోంది అన్నాడీఎంకేనే. విజయ్ పార్టీ మూడో స్థానంలో ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. అయితే డీఎంకేకు స్టాలిన్, టీవీకేకు విజయ్ ప్రజాకర్షక నేతలున్నారు. అన్నాడీఎంకేకు లేకపోయినా ఆ పార్టీ గట్టి పోరాటం చేస్తోంది. ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీకి తమిళనాడులో అత్యంత పటిష్టమైన గ్రామస్థాయి యంత్రాంగం ఉంది. ఏ నాయకుడు ఉన్నా లేకపోయినా, బూత్ స్థాయి వరకు విస్తరించిన పార్టీ క్యాడర్  రెండు ఆకుల గుర్తుకు విధేయంగా ఉండటం ఈ పార్టీకి ఉన్న అతిపెద్ద బలం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పశ్చిమ తమిళనాడు పార్టీకి ఉన్న తిరుగులేని ఓటు బ్యాంక్ జయలలిత మరణం తర్వాత కూడా చెక్కుచెదరలేదు.

పళనిస్వామి హవా - ఏకఛత్రాధిపత్యం 

జయలలిత మరణం తర్వాత పార్టీలో తలెత్తిన వారసత్వ పోరును ఎడప్పాడి కె. పళనిస్వామి అత్యంత నేర్పుగా పరిష్కరించారు. ఓ. పన్నీర్‌సెల్వం  , టీటీవీ దినకరన్ వంటి ప్రత్యర్థులను పక్కనపెట్టి, పార్టీపై పూర్తి నియంత్రణ సాధించారు. ప్రస్తుతం పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయనే తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఎన్డీయే కూటమి తరపున 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పటికే ఖరారయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వంటి వారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. 

సంక్షేమ పథకాల వారసత్వం - అమ్మ బ్రాండ్ 

 అమ్మ క్యాంటీన్, అమ్మ సిమెంట్ వంటి సంక్షేమ పథకాలు సామాన్యుల మనస్సుల్లో అన్నాడీఎంకే పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని కలిగించాయి. తాము అధికారంలోకి వస్తే  అమ్మ ఇల్లం  పథకం కింద ఉచిత ఇళ్లు, మహిళలకు ప్రతి నెలా  2,000 ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను ఈపాటికే పళనిస్వామి ప్రకటించారు. డీఎంకే ఇచ్చే దానికంటే రెట్టింపు ఇస్తామని చెప్పడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 2026 ఎన్నికల్లో డీఎంకేను ఓడించడమే లక్ష్యంగా అన్నాడీఎంకే భారీ వ్యూహరచన చేస్తోంది. బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే, పీఎంకే , ఏఎంఎంకే  వంటి పార్టీలతో పటిష్టమైన కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమి 210 స్థానాల్లో విజయం సాధిస్తుందని పళనిస్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నటుడు విజయ్ స్థాపించిన  టీవీకే పార్టీని కేవలం సినిమాలకే పరిమితమైన సూపర్‌స్టార్‌గా కొట్టిపారేస్తూ, అసలైన పోరు అన్నాడీఎం, డీఎంకే మధ్యనే ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు.

పళనీస్వామికి అంత తేలిక కాదు !                                             

జయలలిత ఉన్నప్పుడు ఉన్నంత  ఛరిష్మా ప్రస్తుత నాయకత్వంలో లేకపోయినా, పాలనాపరమైన అనుభవం , క్షేత్రస్థాయి పట్టు పళనిస్వామికి ప్లస్ పాయింట్లుగా మారాయి. డీఎంకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన విజయవంతమవుతున్నారు. అయినప్పటికీ, అంతర్గతంగా అక్కడక్కడా వినిపించే అసంతృప్త స్వరాలను అణచివేసి, కూటమిలో సీట్ల సర్దుబాటును విజయవంతంగా ముగిస్తేనే 2026లో అధికారం దక్కుతుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.        

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Governor Speech Highlights: హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
BRS vs Congress: రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget