అన్వేషించండి

Obulapuram mining case: ఓబులాపురం మైనింగ్ కేసు ఓ సంచలనం - అసలా కేసు ఏంటి ? ఎంత మైనింగ్ చేశారు? పూర్తి వివరాలు

Obulapuram: ఏపీ రాజకీయాల్లో ఓబులాపురం మైనింగ్ కేసుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డితో పాటు ఐదుగురికి ఏడేళ్ల శిక్ష పడింది. అసలు ఈ కేసేంటి ?

What is Obulapuram mining case : ఓబులాపురం మైనింగ్   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన అక్రమ మైనింగ్ కుంభకోణం. అనంతపురం జిల్లాలోని ఓబులాపురం ప్రాంతంలో జరిగిన ఇనుము గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసు. ఈ కేసు రాజకీయ, ఆర్థిక, పర్యావరణ సమస్యలను లేవనెత్తింది. దేశం దృష్టిని ఆకర్షించింది.  
 
ఓబులాపురం ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దు లో ఉంటుంది.  గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కంపెనీ అని పేరు పెట్టి అక్కడ మైనింగ్ చేశారు.  రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలతో  పాటు .. అనుమతి లేని  ప్రాంతాలలో అక్రమ ఇనుము గనుల తవ్వకం, లైసెన్స్ ఉల్లంఘనలు, పర్యావరణ నష్టం వంటి వాటికి పాల్పడ్డారు. ఈ కేసు 2000ల చివరలో బయటపడింది, మరియు సీబీఐ  2010లో దర్యాప్తు ప్రారంభించింది. అప్పట్లో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది.  

సీబీఐ దర్యాప్తులో OMC లైసెన్స్‌లో నిర్దేశించిన ప్రాంతాలకు మించి, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలలో ఇనుము గనులను తవ్విందని నిర్దారించింది. ఇది పర్యావరణ నష్టానికి దారితీసింది. గాలి జనార్దన్ రెడ్డి రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి, అక్రమంగా మైనింగ్ లైసెన్స్‌లను పొందినట్లు సీబీఐ తేల్చింది.  రాష్ట్ర ప్రభుత్వ అధికారులు , మంత్రులు OMCకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి లంచాలు తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. అయితే ఇప్పుడు ఈ కేసులో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి కృపానందం నిర్దోషులుగా బయట పడ్డారు. మరో అధికారి రాజగోపాల్ నిందితుడిగా ఏడేళ్ల జైలు శిక్షకు గుర్యయారు. 

అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా తేల్చారు.  ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని గనుల స్థానం గురించి తప్పుడు సమాచారం అందించి, అక్రమ తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా సరిహద్దులు కూడా చెరిగిపోయాయి.  2010లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును చేపట్టింది. 219 మంది సాక్షులను విచారించి, 3337 పత్రాలను పరిశీలించింది.  2011లో గాలి జనార్దన్ రెడ్డి ,  ఐఏఎస్ ఎర్ర శ్రీలక్ష్మిని సీబీఐ అరెస్టు చేసింది. ఇతర నిందితులు కూడా వివిధ దశలలో అరెస్టయ్యారు.  హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు విచారణ 13 సంవత్సరాలకు పైగా కొనసాగింది. ఇటీవల సుప్రీంకోర్టు విచారణను పర్యవేక్షించింది.   2025 మే నాటికి తీర్పు పూర్తి చేయాలని గడువు విధించింది. ఈ ప్రకారం సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. 

  ఈ కేసు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాజకీయాలో కీలక పాత్ర పోషించింది. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీకి చెందిన మాజీ మంత్రి. అయితే కాంగ్రెస్ కు చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవారు.  2007లో ఓబులాపురం అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల  పై అప్పటి వైఎస్ రాజశే ఖర్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. ఈ కేసును 2025లో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.                      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha vs Revanth Reddy: గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డే! పోలీసులు ఏం చేయలేరు! వివాదాన్ని మరింత రాజేసిన మంత్రి కుమార్తె సుస్మిత 
గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డే! పోలీసులు ఏం చేయలేరు! వివాదాన్ని మరింత రాజేసిన మంత్రి కుమార్తె సుస్మిత 
Konda Surekha OSD : 'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
Konda Murali Reaction :
"రేవంత్‌తో విభేేదాలు లేవు, సుస్మిత ఏ పార్టీలోనూ లేరు" అర్ధరాత్రి హైడ్రామాపై స్పందించిన కొండా మురళి
Konda Surekha Vs Revanth Reddy: బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు! మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు!
బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు! మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు!
Advertisement

వీడియోలు

WWC 2025 | టీమ్ ఇండియా సెమీస్ చేరాలంటే గెలవాల్సింది ఎన్ని మ్యాచులు?
BCCI Rohit Sharma Virat Kohli | రోహిత్ శర్మ, విరాట్ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
Rohit Sharma and Virat Kohli | ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీ 3 సెంచరీలు బాదేస్తాడన్న హర్బజన్ సింగ్
KL Rahul Injury |  విండీస్ రెండో టెస్ట్‌లో గాయపడిన కేఎల్ రాహుల్‌
Bodyline Bowling History | క్రికెట్ కారణంగా ఆసీస్, ఇంగ్లండ్‌లు శత్రువులుగా ఎలా మారాయి? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha vs Revanth Reddy: గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డే! పోలీసులు ఏం చేయలేరు! వివాదాన్ని మరింత రాజేసిన మంత్రి కుమార్తె సుస్మిత 
గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డే! పోలీసులు ఏం చేయలేరు! వివాదాన్ని మరింత రాజేసిన మంత్రి కుమార్తె సుస్మిత 
Konda Surekha OSD : 'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
Konda Murali Reaction :
"రేవంత్‌తో విభేేదాలు లేవు, సుస్మిత ఏ పార్టీలోనూ లేరు" అర్ధరాత్రి హైడ్రామాపై స్పందించిన కొండా మురళి
Konda Surekha Vs Revanth Reddy: బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు! మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు!
బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు! మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు!
Raymond Group: అనంతపురంలో  ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
అనంతపురంలో ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
AP Liquor Issue: ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి - నకిలీ  లిక్కర్‌కు ఇక అడ్డుకట్ట !
ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి - నకిలీ లిక్కర్‌కు ఇక అడ్డుకట్ట !
Rural Vehicle Sales India: రైతులతో కిటకిటలాడిన షోరూమ్‌లు - పెరిగిన ఆదాయాలు, తగ్గిన GST రేట్లతో సేల్స్‌ ఊపు
షోరూమ్‌లను ముంచెత్తిన రూరల్‌ ఇండియా - బయ్యర్లలో ఎక్కువ మంది గ్రామీణులే
Commonwealth Games:  అంతర్జాతీయ క్రీడా సంబరానికి వేదిక కానున్న భారత్ - అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్ గేమ్స్
అంతర్జాతీయ క్రీడా సంబరానికి వేదిక కానున్న భారత్ - అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్ గేమ్స్
Embed widget