అన్వేషించండి

DIDI MEETS MODI : మోదీతో దీదీ భేటీ..! కానీ ...

ఢిల్లీలో ప్రధానితో మమతా బెనర్జీ భేటీ అయ్యారు. నిధులు, వ్యాక్సిన్లపై చర్చించారు. అయితే ఢిల్లీలో ఆమె ఎక్కువగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తారు..!


బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు.  బెంగాల్ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చి ప్రధానితో సమావేశం కావడం ఇదే ప్రథమం.  రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు.. వ్యాక్సిన్ల అంశంపై చర్చలు జరిగినట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే వీరి సమావేశం చాలా స్వల్ప సమయమే జరిగింది. దాదాపుగా పదిహేను నిమిషాలు మాత్రమే ఇరువురు మాట్లాడుకున్నారని అంటున్నారు. బెంగాల్ ఎన్నికలు.. ఆ తర్వాత పరిణామల నేపధ్యంలో... బీజేపీ, తృణమూల్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి ఉంది బీజేపీ క్యాడర్‌పై బెంగాల్‌లో దాడులు చేస్తున్నారని  ఆ పార్టీ  హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. మోడీ కూడా పలు సందర్భాల్లో ఈ అంశంపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించడానికి కుట్ర చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. 

మమతా బెనర్జీ సీఎం అయిన తర్వాత వచ్చిన వరదల సందర్భంగా ప్రధాని పరిశీలకు వెళ్లినప్పుడు ఆయనతో మీటింగ్‌ను మమతా బెనర్జీ ఎగ్గొట్టారు.  ఇది వివాదాస్పదమయింది. ఆ తర్వాత బెంగాల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న అలాపన్ బందోపాధ్యాయ వ్యవహారంలోనూ కేంద్రం వర్సెస్ బెంగాల్ సర్కార్ అన్నట్లుగా పోరాటం నడిచింది.  ఈ వ్యవహారాల నేపధ్యంలో మోడీ, మమతా భేటీ అందరికీ ఆసక్తికరంగా మారింది. అయితే... ప్రధానమంత్రి కాబట్టి మర్యాదపూర్వకంగా కలిశారని.. మమతా బెనర్జీ ఢిల్లీ టూర్ ఎజెండా వేరని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానితో భేటీకి ముందే..  కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌తో మమతా సమావేశం అయ్యారు. సోనియాతోనూ సమావేశం అయ్యే అవకాశం ఉంది. మరో మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి.. విపక్ష నేతలందరితోనూ సమావేశం కానున్నారు. 

వచ్చే ఎన్నికల నాటికి మోడీని ఢీకొట్టేందుకు అందర్నీ ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్.. తెర వెంనుక వ్యూహాలతో మమతా బెనర్జీకి సాయం చేస్తున్నారు. ఇప్పటికే శరద్ పవార్ సహా పలువురితో పీకే సమావేశమై.. చర్చలు జరిపారు.  మమతా బెనర్జీ బీజేపీని తేలిగ్గా తీసుకోవాలనుకోవడం లేదు. ఎలాగైనా సరే ఈ సారి బీజేపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఆమే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇటీవల సంచలనం రేపుతున్న పెగాసస్ వ్యవహారంలో  కేంద్రం విచారణకు వెనుకడుగు వేస్తున్నప్పటికీ.. తాను మాత్రం...  ఇద్దరు మాజీ న్యాయమూర్తులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వమే పెగాసుస్ ద్వారా .. రాజకీయ ప్రత్యర్థులపై నిఘాకు పాల్పడిందనే ఆరోపణల మధ్య.. ఈ విచారణ కమిటీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ

వీడియోలు

Trump on Greenland | గ్రీన్‌ లాండ్ కోసం ట్రంప్ ఎందుకు పట్టుబుతున్నాడు | ABP Desam
Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Bangladesh Cricket: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
FIR at home: బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
SIT notice to KTR: ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
Embed widget