అన్వేషించండి

DIDI MEETS MODI : మోదీతో దీదీ భేటీ..! కానీ ...

ఢిల్లీలో ప్రధానితో మమతా బెనర్జీ భేటీ అయ్యారు. నిధులు, వ్యాక్సిన్లపై చర్చించారు. అయితే ఢిల్లీలో ఆమె ఎక్కువగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తారు..!


బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు.  బెంగాల్ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చి ప్రధానితో సమావేశం కావడం ఇదే ప్రథమం.  రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు.. వ్యాక్సిన్ల అంశంపై చర్చలు జరిగినట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే వీరి సమావేశం చాలా స్వల్ప సమయమే జరిగింది. దాదాపుగా పదిహేను నిమిషాలు మాత్రమే ఇరువురు మాట్లాడుకున్నారని అంటున్నారు. బెంగాల్ ఎన్నికలు.. ఆ తర్వాత పరిణామల నేపధ్యంలో... బీజేపీ, తృణమూల్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి ఉంది బీజేపీ క్యాడర్‌పై బెంగాల్‌లో దాడులు చేస్తున్నారని  ఆ పార్టీ  హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. మోడీ కూడా పలు సందర్భాల్లో ఈ అంశంపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించడానికి కుట్ర చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. 

మమతా బెనర్జీ సీఎం అయిన తర్వాత వచ్చిన వరదల సందర్భంగా ప్రధాని పరిశీలకు వెళ్లినప్పుడు ఆయనతో మీటింగ్‌ను మమతా బెనర్జీ ఎగ్గొట్టారు.  ఇది వివాదాస్పదమయింది. ఆ తర్వాత బెంగాల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న అలాపన్ బందోపాధ్యాయ వ్యవహారంలోనూ కేంద్రం వర్సెస్ బెంగాల్ సర్కార్ అన్నట్లుగా పోరాటం నడిచింది.  ఈ వ్యవహారాల నేపధ్యంలో మోడీ, మమతా భేటీ అందరికీ ఆసక్తికరంగా మారింది. అయితే... ప్రధానమంత్రి కాబట్టి మర్యాదపూర్వకంగా కలిశారని.. మమతా బెనర్జీ ఢిల్లీ టూర్ ఎజెండా వేరని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానితో భేటీకి ముందే..  కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌తో మమతా సమావేశం అయ్యారు. సోనియాతోనూ సమావేశం అయ్యే అవకాశం ఉంది. మరో మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి.. విపక్ష నేతలందరితోనూ సమావేశం కానున్నారు. 

వచ్చే ఎన్నికల నాటికి మోడీని ఢీకొట్టేందుకు అందర్నీ ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్.. తెర వెంనుక వ్యూహాలతో మమతా బెనర్జీకి సాయం చేస్తున్నారు. ఇప్పటికే శరద్ పవార్ సహా పలువురితో పీకే సమావేశమై.. చర్చలు జరిపారు.  మమతా బెనర్జీ బీజేపీని తేలిగ్గా తీసుకోవాలనుకోవడం లేదు. ఎలాగైనా సరే ఈ సారి బీజేపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఆమే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇటీవల సంచలనం రేపుతున్న పెగాసస్ వ్యవహారంలో  కేంద్రం విచారణకు వెనుకడుగు వేస్తున్నప్పటికీ.. తాను మాత్రం...  ఇద్దరు మాజీ న్యాయమూర్తులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వమే పెగాసుస్ ద్వారా .. రాజకీయ ప్రత్యర్థులపై నిఘాకు పాల్పడిందనే ఆరోపణల మధ్య.. ఈ విచారణ కమిటీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget