అన్వేషించండి

Wayanad landslides: వయనాడ్ లో గల్లంతైన 130మంది కోసం అడవిని జల్లెడ పడుతున్న రెస్క్యూ టీం

Wayanad Missing Victims: వయనాడ్ విపత్తు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. 200లకు పైగా మృతదేహాలను గుర్తించగా.. 130 మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు పేర్కొన్నారు.

Wayanad landslides: కేరళ రాష్ట్రం వయనాడ్‌ జిల్లాలో జులై 30న కొండ చరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్ దేశాన్ని కలచి వేసింది. ఈ విపత్తులో దాదాపు నాలుగు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఘటన సంభవించి రెండు వారాలు కావొస్తున్నా ఆ విలయం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఈ విపత్తులో వందలాది మంది గల్లంతయ్యారు. ఇంకా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆప్తులను కోల్పోయిన బాధితులు ఎంతోమంది ఉన్నారు. ఈ విషాదాన్ని గుర్తుచేసుకుంటేనే ఇంకొంతమంది కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ ఘటన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించి సహాయ చర్యలు చేపట్టాయి. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కీలక ప్రకటన చేశారు. 

ఇంచు ఇంచు గాలింపు
వాయనాడ్‌లో వినాశకరమైన ఘటన తర్వాత ఇప్పుడు చలియార్ నది, దాని ఒడ్డు, చుట్టుపక్కల అటవీ ప్రాంతాలలో భారీ సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించనున్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, పోలీసు, అగ్నిమాపక దళం, అటవీ శాఖ అధికారులతో సహా 190 మంది సభ్యుల బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్లు ఎడిజిపి ఎంఆర్ అజిత్ కుమార్ తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 200లకు పైగా మృతదేహాలను గుర్తించగా.. 130 మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు పేర్కొన్నారు. రెండు వారాలుగా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ దొరకని వారి జాడ కోసం చలియార్‌ నది, పరిసర అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. ఎగువ ప్రాంతం మొత్తం పూర్తి అయిందని, ప్రస్తుతం దిగువన తమ సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందన్నారు. ప్రస్తుం నీటిమట్టం తగ్గడంతో మృతదేహాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. సోమవారం చేపట్టిన గాలింపులో పలు శరీర భాగాలు లభ్యమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

400మంది మృతి.. 51 గుర్తించని మృతదేహాలు
జూలై 30న సంభవించిన కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 400 మంది మరణించినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. 200మంది మృతదేహాలను గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మృతదేహాలలో 51 మందిని గుర్తించలేదు. ఇంకా 130 మందికి పైగా గల్లంతయ్యారు. గత సోమవారం సెర్చ్ ఆపరేషన్‌లో కొన్ని మృతదేహాల భాగాలను అధికారులు కనుగొన్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతంలో సోమవారం ఉదయం ప్రారంభమైన సెర్చ్ ఆపరేషన్ ఐదు ప్రాంతాలుగా విభజించబడింది. అయితే ముండక్కై, చురల్‌మల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కొంతసేపు నిలిచిపోయింది. అన్ని ప్రాంతాలను మళ్లీ ఇంచు ఇంచు స్కాన్ చేసే వరకు సెర్చింగ్ కొనసాగుతుంది. వాయనాడ్ జిల్లాలోని ముండక్కై, చురల్‌మల ప్రాంతాలను కొండచరియలు దాదాపు పూర్తిగా నాశనం చేశాయి. సవాళ్లతో కూడిన భూభాగంలో బృందాలు అవిశ్రాంతంగా పని చేస్తున్నాయి. 

ప్రతి అంశంపై క్షుణ్నంగా పరిశీలన
బాధిత కుటుంబాలకు వారి ఆప్తుల కడసారి చూపునైనా దక్కించేందుకు రెస్క్యూ బృందాల కృషి చేస్తున్నాయి. ఈ భారీ సెర్చ్ ఆపరేషన్‌లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని  అధికారులు నిశ్చయించుకున్నారు. ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా లేదా ప్రభావిత ప్రాంతాల్లో గల్లంతైన వారి మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు క్లిష్ట పరిస్థితులతో కూడా పోరాడుతూనే ఉన్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget