అన్వేషించండి

Polamaba Jathara 2023: ఈనెల 23న గిరిజనుల ఆరాధ్య దైవం పోలమాంబ జాతర, 24న సిరిమానోత్సవం!

Polamaba Jathara 2023: ఈనెల 23వ తేదీన గిరిజనుల ఆరాధ్య దైవం పోలమాంబ జాతర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే 24న సిరిమానోత్సం నిర్వహించనున్నారు. 

Polamaba Jathara 2023: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, గిరిజనుల ఆరాధ్య దైవం శంబర పోలమాంబ జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో విజయనగరం పైడితల్లి అమ్మవారి పండగ తర్వాత పెద్ద సిరిమానోత్సవం శంబర పోలమాంబదే. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ నెల 23న తొలేళ్లు, 24న సిరిమానోత్సవం, 25న అంపకోత్సవం జరగనుంది. కరోనా నేపథ్యంలో గత మూడేళ్లు ఆంక్షల నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గింది. ఈసారి ఎలాంటి ఇబ్బందులూ లేకపోవడంతో లక్షల్లో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి రెండు లక్షల మంది వచ్చినా.. వారికి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో వి.రాధాకృష్ణ తెలిపారు. 

భక్తులకు ఇబ్బందులు లేకుండా మూడు క్యూ లైన్లు..

ఉచిత దర్శనంతో పాటు రూ.10, రూ.50 దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. పులిహోర ప్రసాదం ధర రూ.10, లడ్డూ రూ.15 గా నిర్ణయించారు. విశ్రాంతి భవనాలు, కేశ ఖండన శాల, చెప్పుల స్టాండ్‌, శాశ్వత క్యూలైన్లు లేకపోవడం కొంత ఇబ్బందే.  వీటి గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. 

సిరిమాను తిరిగేందుకు...

ఉత్సవంలో కీలక ఘట్టమైన సిరిమానోత్సవం ఈ నెల 24న జరగనుంది. లక్షల్లో భక్తులొస్తారని అంచనా.. ప్రస్తుతం సిరిమాను తిరిగేందుకు వీలుగా ఆ మార్గాన్ని బాగు చేస్తున్నారు. గుంతలను పూడ్చుతున్నారు. గొల్లవీధి నుంచి పెద్దవలస వెళ్లే మార్గంలో 90 మీటర్ల సీసీ రోడ్డు పనులు సాగుతున్నాయి. సిరిమాను గుర్తింపు, తయారీ, ఊరేగింపునకు గతంలో వీధుల వారీగా బృందాలు ఉండేవి. ఆలయ అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యులు పర్యవేక్షించేవారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల సమస్యలు ఎదురయ్యేవి. ఈసారి అలా జరగకుండా ధర్మకర్తల పర్యవేక్షణలో ఒకరికే బాధ్యతలు అప్పగించేలా ప్రణాళికలు వేస్తున్నారు. 

వనంగుడి, చదురుగుడి ఆలయాల వద్ద ఎండ నుంచి ఉపశమనం పొందేలా చలువ పందిళ్లు, టెంట్లు ఏర్పాటు చేశారు. చిన్నారులకు పాలు, సాధారణ భక్తులకు మంచినీరు అందుబాటులో ఉంచుతున్నారు. గర్భిణులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో వీరు మొదటి వారంలో రాకుండా ఉంటే మంచిదని ఆలయ అధికారులు కోరుతున్నారు. భక్తులకు సేవలు అందించేందుకు వివిధ ఆలయాల నుంచి డిప్యుటేషన్‌పై 95 మంది సిబ్బందిని నియమించారు. పలు స్వచ్ఛంద సంస్థలూ పాల్గొననున్నాయి.

అమ్మవారి ఘటాల ఊరేగింపు..

శంబర జాతర నేపథ్యంలో పోలమాంబ అమ్మవారి ఘటాల ఊరేగింపు వేడుకగా జరిగింది. చదురు గుడిలో ఉంచిన ఘటాలకు గురువారం వేకువజాము నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం గ్రామ పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. దారి పొడవునా భక్తులు మొక్కులు చెల్లించారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు పరిశీలించారు. శంబర గ్రామానికి చేరుకుని వనంగుడి, చదురు గుడి ఆలయ ప్రాంగణాలను తనిఖీ చేశారు. కూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, సిరిమాను ఉంచే ప్రదేశాలను చూశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget