News
News
వీడియోలు ఆటలు
X

UP News: భార్య, బిడ్డను దోమలు కరుస్తున్నాయని ఓ వ్యక్తి ట్వీట్- రియాక్ట్ అయిన పోలీసులు

UP News: తన భార్య, కూతురును దోమల బారి నుంచి కాపాడమంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ కు పోలీసులు స్పందించారు.

FOLLOW US: 
Share:

UP News: ఆపదలో ఉన్నాం.. కాపాడండంటూ ఎవరైనా ట్వీట్ చేసినా, ఫోన్ చేసిన వెంటనే రంగంలో దిగిపోతుంటారు పోలీసులు. ముఖ్యంగా ఆకతాయిలు ఏడిపిస్తున్నారు, హత్య చేయాలని చూస్తున్నారు, దోచుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఆఘమేఘాల మీద వాలిపోతుంటారు. ఇలాంటి వార్తలు మనం చాలానే విన్నాం. కానీ ఇప్పుడు చూడబోయే వార్త  మాత్రం అందర్నీ ఆశ్చర్యంలో ముంచేస్తుంది. "దోమలు కుట్టి నా భార్య, కూతురు చాలా ఇబ్బంది పడుతున్నారు, మస్కిటో కిల్లర్ కావాలని" ఓ వ్యక్తి చేసిన ట్వీట్ కు పోలీసులు స్పందించారు. వెంటనే మస్కిటో కాయిల్స్ తో అతనున్న చోటుకు వెళ్లారు. అతడి సమస్యను తీర్చారు. 

అసలేం జరిగిందంటే..?

ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ జిల్లాకు చెందిన అసద్ ఖాన్ అనే వ్యక్తి భార్య ఆదివారం రాత్రి చందౌసిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రిలో విపరీతంగా ఉన్న దోమలు అసద్  భార్యను, నవాత శిశువును తీవ్రంగా కుట్టడంతో చిన్నారి ఏడవడం ప్రారంభించింది. వారి బాధను చూడలేని అసద్ ఖాన్ మస్కిట్ కిల్లర్ కోసం బయటకు వెళ్లాడు. అర్థరాత్రి కావడంతో దుకాణాలన్నీ మూసి ఉన్నాయి. ఇక చేసేదేం లేక వెనక్కి వచ్చాడు. భార్య, కూతురు ఇబ్బందిని చూసి చలించిపోయాడు. సమస్య తీర్చేందుకు ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచంచి.. చివరకు అద్భుతమైన ప్లాన్ వేశాడు. యూపీ పోలీసులకు ట్వీట్ చేశాడు. డయల్ 112 ట్విట్టర్ ఖాతాలు ట్యాగ్ చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు... ఆసుపత్రికి వచ్చి మరీ అసద్ ఖాన్ కు మస్కిటో కిల్లర్ ను అందించారు. ఈ క్రమంలోనే "మాఫియా నుంచి మస్కిటో వరకు దేన్నైనా ఎదుర్కుంటాం" అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు. సమస్య అని తెలియగానే స్పందించినందుకు థాంక్యూ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. 

Published at : 23 Mar 2023 11:53 AM (IST) Tags: UP News Latest Viral News UP Police mosquito repellent coil Police deliver mosquito Coil

సంబంధిత కథనాలు

Odisha Train Accident LIVE: ఒడిశా ఘోర ప్రమాదంలో 288 మంది మృతి- మృతుల్లో పెద్ద సంఖ్యలో తెలుగువారు

Odisha Train Accident LIVE: ఒడిశా ఘోర ప్రమాదంలో 288 మంది మృతి- మృతుల్లో పెద్ద సంఖ్యలో తెలుగువారు

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

Petrol-Diesel Price 03 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - కొత్త రేట్లివి

Petrol-Diesel Price 03 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - కొత్త రేట్లివి

Latest Gold-Silver Price Today 03 June 2023: పసిడి భారీ పతనం - బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price Today 03 June 2023: పసిడి భారీ పతనం - బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

టాప్ స్టోరీస్

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?

AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ  పనీ చెప్పడం లేదా ?