అన్వేషించండి

Maharashtra News: ఔను వాళ్లిద్దరూ కలుస్తున్నారు, శిందే-ఠాక్రేపై సంచలన ట్వీట్ చేసిన నటి

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే రెండ్రోజుల్లో కలిసిపోతారని మరాఠీ నటి చేసిన ట్వీట్‌పై శివసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

సమస్యలు పరిష్కరించుకుంటారు: దీపాలి

మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర అప్‌డేట్ వస్తోంది. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతునిస్తూ ఉద్దవ్ ఠాక్రే  చేసిన ప్రకటన షాక్ ఇచ్చింది. పైగా భాజపాతో మళ్లీ కలిసేందుకు అవకాశాలున్నాయన్న సంకేతాలూ ఇచ్చింది ఆ ప్రకటన. ఇప్పుడు మరో ఆసక్తికర అంశం చర్చకు వచ్చింది. త్వరలోనే మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కలవబోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అందులో నిజమెంత అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. మరాఠీ నటి దీపాలి సాయేద్ చేసి ట్వీట్‌ చేయటంతోనే
ఇది తెరపైకి వచ్చింది. వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాలపై చర్చించి, మళ్లీ కలిసిపోయేందుకు త్వరలోనే కలుస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. భాజపా నేతలు కొందరు, వీరిద్దరి భేటీకి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు చెప్పారు దీపాలి. తనను తాను శివసేన లీడర్‌గా చెప్పుకునే దీపాలి ఈ ట్వీట్ చేయటం శివసేనను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. పార్టీలో తనకు ఏ క్యాడర్ లేదని స్పష్టం చేసింది శివసేన. 2019లో ముంబ్ర-కల్వా నియోజకవర్గం నుంచి శివసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు దీపాలి. అంతకు ముందు 2014లో ఆప్ తరపున అహ్మదానగర్‌ నుంచి పోటీ చేసి, అప్పుడు కూడా ఓటమి పాలయ్యారు.

 

అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు..

"శివసైనికుల మనోభావాలు దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి ఏక్‌నాథ్ శిందే, ఉద్దవ్ ఠాక్రే మరో రెండు రోజుల్లో కలవనున్నారు. శివసైనికుల అభిప్రాయాలేంటో శిందే పూర్తిగా అర్థం చేసుకున్నారు. అటు ఠాక్రే కూడా శిందే అసహనానికి కారణాలేంటో అడిగి తెలుసుకున్నారు. అందుకే కొందరు భాజపా నేతలు వీళ్లిద్దరి మధ్య సమావేశం ఏర్పాటు చేసేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు" అని ట్వీట్ చేశారు దీపాలి సాయేద్. తన ట్విటర్‌ డిస్క్రిప్షన్‌లోనూ "శివసేన నేత" అని రాసుకున్నారు దీపాలి. ఈమె ట్వీట్ చేసిన విషయాన్ని తెలుసుకున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. "నేను సాధారణ కార్యకర్తలాంటి వాడిని. శిందే, ఠాక్రే మధ్య మీటింగ్ జరుగుతుందన్న విషయమైతే నా వరకూ రాలేదు" అని వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండు వారాలు దాటినా, ఇప్పటి వరకూ కేబినెట్ విస్తరణ చేపట్టకపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సంజయ్ రౌత్. ఒకవేళ వాళ్లు మంత్రి వర్గ విస్తరణ చేసి, మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించినా..వాళ్లపై అనర్హత వేటు పడుతుందన్న భయంతో ఉన్నారని అన్నారు. 40 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఈ అభద్రతా భావంతోనే ఉన్నారని చెప్పారు సంజయ్ రౌత్.  సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ కొనసాగుతున్నందున, కేబినెట్ విస్తరణ చేపట్టేలరని స్పష్టం చేశారు. 

 

 
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: పినరయి విజయన్‌‌ను గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్న మోదీ.. కేరళలో మార్పు తప్పదు- రేవంత్ రెడ్డి
పినరయి విజయన్‌‌ను గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్న మోదీ.. కేరళలో మార్పు తప్పదు- రేవంత్ రెడ్డి
Ambani Family Car Collection: అంబానీ ఫ్యామిలీ వద్ద లగ్జరీ కార్ల కలెక్షన్.. వాటి ధరలు చూస్తే మైండ్ బ్లాక్!
అంబానీ ఫ్యామిలీ వద్ద లగ్జరీ కార్ల కలెక్షన్.. వాటి ధరలు చూస్తే మైండ్ బ్లాక్!
Hyderabad News: గోల్కొండలో బాలికపై అఘాయిత్యాన్ని అడ్డుకున్న యువకుడు.. పిలిచి సత్కరించిన సీపీ సజ్జనార్
గోల్కొండలో బాలికపై అఘాయిత్యాన్ని అడ్డుకున్న యువకుడు.. పిలిచి సత్కరించిన సీపీ సజ్జనార్
Podharillu Serial Today April 7th:మాధవ్‌ పెళ్లి చూపులు ఏమయ్యాయి..? అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారా లేదా...?
పొదరిల్లు: మాధవ్‌ పెళ్లి చూపులు ఏమయ్యాయి..? అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారా లేదా...?

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sayali Surve: సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
Revanth Reddy Soft Hindutva: కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
Monsoon in India 2026: ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
First Night Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
Embed widget