అన్వేషించండి

Karnataka Maharashtra Row: వాటిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి: ఉద్ధవ్ ఠాక్రే

Karnataka Maharashtra Row: కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.

Karnataka Maharashtra Row: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్దవ్ ఠాక్రే )వర్గం అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray).. అసెంబ్లీలో సోమవారం ఓ డిమాండ్ చేశారు.  కర్ణాటక, మహారాష్ట్ర మధ్య నడుస్తున్న సరిహద్దు వివాదం (Karnataka Maharashtra Row) పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భాష, సరిహద్దుకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, మానవత్వానికి సంబంధించిన విషయం అని అన్నారు.

" మరాఠీ మాట్లాడే ప్రజలు తరతరాలుగా సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్నారు. వారి దైనందిన జీవితం, భాష, జీవనవిధానం అంతా మరాఠీలకు సంబంధించినది. ఈ అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం.. "కర్ణాటక ఆక్రమించుకున్న మహారాష్ట్ర" భూభాగాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి.                                 "
-ఉద్ధవ్ ఠాక్రే, శివసేన

శిందేపై

మరోవైపు ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఠాక్రే తప్పుబట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దూకుడుగా వ్యవహరిస్తుంటే మహారాష్ట్ర సీఎం మెతక వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు.

" మన ముఖ్యమంత్రి (ఏక్‌నాథ్ శిందే )ఈ అంశంపై ఒక్క మాట అయిన మాట్లాడారా? ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉంది. అక్కడ ప్రశాంత పరిస్థితులు ఉండేవి. అలాంటి ప్రాంతంలో హింస సృష్టిస్తున్నది ఎవరు? ఇప్పటికే కర్ణాటక చట్టసభలు సరిహద్దు సమస్య ముగిసిపోయిందని, ఒక అంగుళం భూమి కూడా పొరుగు రాష్ట్రానికి ఇచ్చేది లేదు అని చెబుతున్నాయి. సంరక్షకుడిగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం అలా నడుచుకుందా?                                                 "
-ఉద్ధవ్ ఠాక్రే, శివసేన

బెలగావి మున్సిపల్ కార్పొరేషన్ కర్ణాటక నుంచి మహారాష్ట్రలో విలీనం అవ్వడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు.. దానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారని ఉద్దవ్ అన్నారు. ఇలాగే మహారాష్ట్రలోని కొన్ని గ్రామ పంచాయితీలు తెలంగాణలో విలీనం చెయ్యాలని డిమాండ్ చేసినప్పుడు.. శిందే ప్రభుత్వానికి ఆ గ్రామ పంచాయితీలకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఉందా అని ఠాక్రే ప్రశ్నించారు.

సరిహద్దు సమస్య

భాష ఆధారంగా రాష్ట్రాలను విభజించిన తర్వాత 1957లో ఈ సమస్య ప్రారంభమైంది. ఇంతకముందు బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెలగావి తమదేనని, ఆ ప్రాంతంలో ఎక్కువ జనాభా మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్నారని మహారాష్ట్ర అంటుంది. ప్రస్తుతం కర్ణాటకలో 800లకు పైగా మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్న గ్రామాలు ఉన్నాయని అంటుంది. భాష ఆధారంగా రాష్ట్రాల పునర్విభజన చట్టం, 1967లో మహాజన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇచ్చిన సరిహద్దులను కర్ణాటక కొనసాగిస్తుంది.

Also Read: Lalu Prasad Yadav: కోలుకుంటున్న లాలూకు మరో షాక్- ఆ కేసు రీఓపెన్ చేసిన సీబీఐ!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Official Apology : క్షమాపణలు చెబుతున్న కొండ సురేఖ సహా వీఐపీలు, వ్యాపార సంస్థలు; ఈ సారీ చెప్పే ట్రెండ్‌ ఎలా మొదలైంది? 
క్షమాపణలు చెబుతున్న కొండ సురేఖ సహా వీఐపీలు, వ్యాపార సంస్థలు; ఈ సారీ చెప్పే ట్రెండ్‌ ఎలా మొదలైంది? 
CII Partnership Summit 2025 : భారీ పెట్టుబడితో వస్తున్న రెన్యూ కంపెనీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
భారీ పెట్టుబడితో వస్తున్న రెన్యూ కంపెనీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
Mancherial Crime News: మంచిర్యాల జిల్లాలో పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
మంచిర్యాల జిల్లాలో పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో కీలక అప్‌డేట్- టర్కీలో ప్లాన్ చేసిన ఉగ్రమూకలు
ఢిల్లీ పేలుడు కేసులో కీలక అప్‌డేట్- టర్కీలో ప్లాన్ చేసిన ఉగ్రమూకలు
Advertisement

వీడియోలు

SSMB 29 Priyanka Chopra First Look | రాజమౌళి - మహేశ్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చేసింది | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
Saurav Ganguly On Shami Selection | టీమిండియాలోకి మహ్మద్ షమిని  సెలక్ట్ చేయకపోవడంపై గంగూలీ సీరియస్ | ABP Desam
Chinnaswamy Stadium RCB | 2026లో  చిన్నస్వామి స్టేడియంపై బ్యాన్‌లో నో ఐపీఎల్ | ABP Desam
Ind vs SA | టాస్ కాయిన్ మార్చాలని డిసైడ్ అయిన బెంగాల్ క్రికెట్ అససియేషన్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Official Apology : క్షమాపణలు చెబుతున్న కొండ సురేఖ సహా వీఐపీలు, వ్యాపార సంస్థలు; ఈ సారీ చెప్పే ట్రెండ్‌ ఎలా మొదలైంది? 
క్షమాపణలు చెబుతున్న కొండ సురేఖ సహా వీఐపీలు, వ్యాపార సంస్థలు; ఈ సారీ చెప్పే ట్రెండ్‌ ఎలా మొదలైంది? 
CII Partnership Summit 2025 : భారీ పెట్టుబడితో వస్తున్న రెన్యూ కంపెనీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
భారీ పెట్టుబడితో వస్తున్న రెన్యూ కంపెనీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
Mancherial Crime News: మంచిర్యాల జిల్లాలో పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
మంచిర్యాల జిల్లాలో పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో కీలక అప్‌డేట్- టర్కీలో ప్లాన్ చేసిన ఉగ్రమూకలు
ఢిల్లీ పేలుడు కేసులో కీలక అప్‌డేట్- టర్కీలో ప్లాన్ చేసిన ఉగ్రమూకలు
Bihar Election Result  2025: బిహార్ లో నితీష్ మళ్లీ అధికారంలోకి వస్తారా?  ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతారా? గ్రహాలు ఏం చెబుతున్నాయ్!
బిహార్ లో నితీష్ మళ్లీ అధికారంలోకి వస్తారా? ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతారా? గ్రహాలు ఏం చెబుతున్నాయ్!
Vijay Deverakonda Rashmika Kiss: రష్మిక చేతికి విజయ్ ముద్దు... పబ్లిక్‌లో ఫస్ట్ టైమ్... ప్రేమను ఇలా చెప్పాడా?
రష్మిక చేతికి విజయ్ ముద్దు... పబ్లిక్‌లో ఫస్ట్ టైమ్... ప్రేమను ఇలా చెప్పాడా?
Highway Driving Tips: ఈ టిప్స్‌ పాటిస్తే హైవే సేఫ్‌గా ఎంత దూరమైనా వెళ్లి రావచ్చు, మీ కోసం 10 చిట్కాలు
హైవేపై లాంగ్‌ ట్రిప్‌ వేస్తున్నారా?, ఈ టిప్స్‌ కచ్చితంగా గుర్తు పెట్టుకోండి, మీ సేఫ్టీ కోసం
Rakul Preet Singh: రొమాంటిక్ రకుల్... బీచ్‌లో ఆల్మోస్ట్ బికినీ లుక్... కొంచెం ప్రేమను ఇవ్వండమ్మా
రొమాంటిక్ రకుల్... బీచ్‌లో ఆల్మోస్ట్ బికినీ లుక్... కొంచెం ప్రేమను ఇవ్వండమ్మా
Embed widget