By: Ram Manohar | Updated at : 09 Feb 2023 11:41 AM (IST)
ఇండియాలోనూ ట్విటర్ బ్లూ ఫీచర్ను లాంచ్ చేసింది ట్విటర్.
Twitter Blue in India:
బ్లూటిక్ ఫీచర్
ట్విటర్ను హస్తగతం చేసుకున్నాక ఎలన్ మస్క్ రెవెన్యూ పెంచుకునే మార్గాలు వెతుక్కుంటున్నారు. అందులో భాగంగానే..బ్లూ టిక్ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని ప్రకటించారు. అందుకు కొంత ధర కూడా నిర్ణయించారు. అంటే...ఇకపై ట్విటర్ యూజర్స్ ఎవరైనా బ్లూ టిక్ కావాలంటే కచ్చితంగా డబ్బు చెల్లించాల్సిందే. ఇప్పటికే ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చిన ట్విటర్..ఇప్పుడు ఇండియాలోనూ దీన్ని లాంఛ్ చేసింది. ఇండియా యూజర్స్ ట్విటర్ బ్లూ ఫీచర్ను వినియోగించుకోవాలనుకుంటే నెలకు రూ.650 చెల్లించాలి. ఇది వెబ్ యూజర్స్కి. అదే మొబైల్ యూజర్స్ అయితే..రూ.900 కట్టాలి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్లో ఈ సర్వీస్ మొదలైంది. అక్కడి వెబ్ యూజర్స్ నెలకు 8 డాలర్లు చెల్లిస్తేనే బ్లూ టిక్ ఉంటుంది. అదే ఏడాదికైతే 84 డాలర్లు చెల్లించాలి. అదే యాండ్రాయిడ్ యూజర్స్ అయితే ట్విటర్ బ్లూ టిక్ కోసం అదనంగా 3 డాలర్లు చెల్లించాలి. అయితే...ఇందులో నుంచి కొంత వాటా గూగుల్కు కమీషన్ కింద ఇచ్చేస్తుంది ట్విటర్. ఇండియాలో ఏడాది పాటు సబ్స్క్రిప్షన్ కోసం రూ. 6,800 కట్టాలని కంపెనీ వెల్లడించింది.
ఇదే ఫీచర్లు..
. ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లందరికీ బ్లూ టిక్ వచ్చేస్తుంది.
. యూజర్స్ తమ ట్వీట్లను ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.
. 4 వేల క్యారెక్టర్ల టెక్స్ట్ని పోస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది.
. 1080 పిక్సెల్ వీడియోనీ అప్లోడ్ చేసుకోవచ్చు.
. రీడర్ మోడ్కి యాక్సెస్ ఇస్తారు.
. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ల అకౌంట్లో కొన్ని యాడ్స్ కూడా వస్తాయి.
. ఈ యూజర్స్కి ప్రియారిటీ ఇస్తుంది కంపెనీ. రిప్లైలు, రీట్వీట్లను హైలైట్ చేస్తుంది.
త్వరలో ఎలాన్ మస్క్ ట్విట్టర్లో గోల్డ్ టిక్ను మెయింటెయిన్ చేయడానికి కంపెనీల నుంచి నెలకు 1,000 డాలర్లు వసూలు చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ సమాచారాన్ని కంపెనీ సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవర్రా ట్వీట్ ద్వారా పంచుకున్నారు. ట్విట్టర్లో కంపెనీలకు గోల్డ్ టిక్ ఇస్తారని సంగతి ఇప్పటికే తెలిసిందే. ఉదాహరణకు మీకు ఏదైనా మీడియా ఛానెల్ లేదా ప్రైవేట్ కంపెనీ ఉంటే ట్విట్టర్ దానికి గోల్డ్ టిక్ అందిస్తారు. సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవర్రా షేర్ చేసిన ట్వీట్లో, ట్విట్టర్ 'వెరిఫైడ్ ఫర్ ఆర్గనైజేషన్' అనే కొత్త ప్రతిపాదనను ప్రారంభిస్తున్నట్లు చూడవచ్చు. దీని కోసం కంపెనీలు నెలకు 1,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కంపెనీ తన ఉద్యోగుల ఖాతాను తన ఖాతాతో లింక్ చేయాలనుకుంటే దీని కోసం అదనంగా 50 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
దీంతో పాటు ఇటీవల వినిపిస్తున్న వార్తల ప్రకారం Twitter తన వినియోగదారులను ఏదైనా ట్వీట్ లేదా పోస్ట్ స్క్రీన్షాట్ తీయడానికి అనుమతించదు. షేర్ చేయడం ఒక్కటే ఆప్షన్ కానుంది. ట్విట్టర్ వినియోగదారులు పోస్ట్ లేదా ట్వీట్ స్క్రీన్ షాట్ తీస్తున్నప్పుడల్లా, స్క్రీన్షాట్కు బదులుగా ట్వీట్ను షేర్ చేయమని వారికి నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది వినియోగదారులు దీనిని నివేదించారు కూడా. ట్విట్టర్ ఈ చర్యను మొదట యాప్ పరిశోధకురాలు జేన్ మంచున్ వాంగ్ గమనించారు. స్క్రీన్షాట్ తీస్తున్నప్పుడు కొంతమంది వినియోగదారులకు ట్విట్టర్ పాప్-అప్ నోటిఫికేషన్ను పంపడాన్ని అతను గమనించాడు. స్క్రీన్షాట్లు తీయడానికి బదులు, ట్వీట్ను షేర్ చేసి, లింక్ను కాపీ చేయమని ట్విట్టర్ అడుగుతున్నట్లు వాంగ్ చెప్పారు.
Also Read: 7000 మంది ఉద్యోగులను తొలగించనున్న డిస్నీ- లే ఆఫ్ వెనుక అతిపెద్ద కారణం ఇదే
Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి
TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో ఎలక్ట్రానిక్ డివైజ్ వాడిన ముగ్గురు అరెస్ట్
Warangal CP: హోంగార్డుకు వరంగల్ సీపీ సత్కారం, అతను చేసిన పనికి సీపీ ఫిదా!
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Errabelli Dayakar Rao: త్వరలో బీసీ కుల వృత్తుల వారికి రూ.1లక్ష చొప్పున ఆర్థిక సహకారం: మంత్రి ఎర్రబెల్లి
Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !
CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?
CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్కే మొగ్గు చూపిన ధోని!
AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా