అన్వేషించండి

Tirumala Rental Prices: శ్రీవారి భక్తులకు షాక్ - భారీగా పెరిగిన వసతిగృహాల గదుల అద్దె!

Tirumala Rental Prices: తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ షాకిచ్చింది. వసతి గృహాల గదుల అద్దెను భారీగా పెంచేసింది. 500, 600 నుంచి వెయ్యి రూపాయలకు పెంచేశారు. 

Tirumala Rental Prices: తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ గట్టి షాకిచ్చింది. ఆధునికీకరణ పనులు చేపట్టిన అనంతరం ఇటీవల తెరిచిన కొన్ని వసతి గృహాల్లో గదుల అద్దెను భారీగా పెంచేసింది. ఈ నిర్ణయంపై సామాన్య, మధ్య తరగతి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల వ్యాప్తంగా అన్ని పాత వసతి కేంద్రాలను ఆధునికీకరించేందుకు ఇంజినీరింగ్ అధికారులు 110 కోట్ల రూపాయలతో టెండర్లను ఆహ్వానించి పనులు చేపట్టారు. ఏసీ, గీజర్ వంటి సదుపాయాలు కల్పించి అద్దెను పెంచేశారు. తిరుమలలో దాదాపు ఆరు వేల గదులు ఉన్నాయి. ఇప్పటికే తిరుమలలో మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల్లో ధరలను ఒక్కసారిగా 500, 600 రూపాయల నుంచి 1000 రూపాలయలు పెంచేశారు. 

750 రూపాయల నుంచి 1700 రూపాయలకు పెంపు..

ఈనెల ఒకటో తేదీ నుంచి నారాయణగిరి రెస్ట్ హౌస్ లోని 1, 2, 3లో గదులను 150 రూపాయల నుంచి జీఎస్టీతో కలిపి 1700 రూపాయలను చేశారు. నారాయణగిరి రెస్ట్ హౌస్ నాలుగులో ఒక్కో గదిని 750 రూపాయల నుంచి 1700 రూపాయలకు పెంచారు. కార్నర్ సూట్ ను జీఎస్టీతో కలిపి రూ.2200 చేశారు. స్పెషల్ టైప్ కాటేజెస్ లో రూ.750 ఉన్న గది అద్దెను జీఎస్టీతో కలిపి రూ.2800 చేశారు. భక్తులు గదుల అద్దెతో పాటు డిపాజిట్ ను అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంది. దీంతో గదిని 1700కు పొందితే డిపాజిట్ నగదుతో కలిపి 3400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరలపై సామాన్య భక్తుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆధ్యాత్మిక కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా కాకుండా భక్తుల కోణంలో చూడాలని కోరుతున్నారు. అద్దెను వీలయినంత వరకు తగ్గిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

ఇప్పటికే చాలా వరకు అతిథి గృహాల ధరలను పెంచిన టీటీడీ.. సాధారణ భక్తులు ఎక్కువగా వసతి పొందే రూ.50 అద్దెతో లభించే ఎన్ఎంసీ, ఎస్ఎన్సీ, ఏఎన్సీ, హెచ్వీసీ, రూ.100 అద్దెతో అందించే రాంభగీచా, వరాహ స్వామి గెస్ట్ హౌస్, ఎస్ఎన్జీహెచ్, హెచ్వీడీసీ, ఏటీసీ, టీబీసీ, సపత్గిరి అతిథి గృహాల్లో కూడా ఆధునికీకరణ పనులు పూర్తి చేసి గదుల అద్దె పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఈనెల 12వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్ఈడీ) టికెట్లను ఈనెల 9వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చేయనుంది. ఇప్పటికే ఈనెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దర్శన టికెట్లను ఆన్ లైన్ లో జారీ చేసిన విషయం తెలిసిందే. 

శుక్రవారం ఒక్కరోజే 4.53 కోట్ల రూపాయల హుండీ ఆదాయం

తిరుమలలో‌ వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. శనివారం శుక్రవారం ఒక్క రోజో 45,887 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 17,702 మంది తలనీలాలు సమర్పించగా.. 4.53 కోట్ల రూపాయలను భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget