Breaking News Telugu Live Updates: తెలంగాణ డీజీపీ కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకుల యత్నం
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
LIVE

Background
Telangana డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు
Telangana డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ను నిరసిస్తూ డీజీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోత రోహిత్ ఆధ్వర్యంలో ఆందోళన.. యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మోత రోహిత్
మీడియాలో వచ్చే వరకు పోలీసులు స్పందించకపోవడం హాస్యాస్పదం. నాలుగు రోజుల తర్వాత మంత్రి కేటీఆర్ నిందితులను శిక్షించాలని హోం మంత్రిని ఆదేశించడం విడ్డూరంగా ఉందన్నారు. నిందితులను గుర్తించి శిక్షించడంలో విఫలమైన పోలీసు యంత్రాంగం అందుకు బాధ్యత వహిస్తూ కేటీఆర్, హోంమంత్రి రాజీనామా చేయాలి. డీజీపీ స్పందించి అసలైన దోషులను అదుపులోకి తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
Janasena Party Meeting: మంగళగిరిలో మధ్యాహ్నం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 2గం.30ని.లకు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. సమావేశంలో పాల్గొన్న కార్యవర్గం, సభ్యులను ఉద్దేశించి సాయంత్రం పవన్ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగానికి హాజరు కావాలని మీడియాను ఆహ్వానించారు.
Hyderabad జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మరోసారి ఉద్రిక్తత
హైదరాబాద్: జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మరోసారి ఉద్రిక్తత
మైనర్ బాలిక కేసులో న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాలు, (జనసేన కార్యకర్తలు) నిరసన..
పోలీస్ స్టేషన్ ముట్టడించిన జనసేన
జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి పెద్దమ్మ గుడి వరకు భారీగా ట్రాఫిక్ జాం
భారీగా పోలీసులు మోహరింపు
కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు
Jubilee Hills Minor girl case: బాలిక రేప్ కేసులో మరో ముగ్గురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో మరో ముగ్గురు నిందితుల అరెస్ట్..
తమిళనాడు, కర్నాటక లో ముగ్గురు నిందితుల అరెస్ట్..
ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
రేప్ కేసులో పోలీసుల అదుపులో మొత్తం ఐదుగురు నిందితులు.. బాలిక రేప్ కేసులో కొనసాగుతున్న విచారణ..
Palnadu District: పల్నాడుజిల్లా నరసరావుపేట ఏరియా వైద్యశాల ఉద్రిక్తత
పల్నాడుజిల్లా నరసరావుపేట ఏరియా వైద్యశాల ఉద్రిక్తత.
తమకు సంబంధం లేకుండా టీడీపీ నేత కంచర్ల జల్లయ్య మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారంటూ ఆందోళన కు దిగిన కుటుంబ సభ్యులు.
తమ నేతలు వచ్చే వరకూ పోస్ట్ మార్టం చేయొద్దంటూ ఆందోళన కు దిగిన మృతుని కుటుంబ సభ్యులు.
పోలీసులతో వాగ్వాదానికి దిగిన మృతుని కుటుంబసభ్యులు.
మార్చురీ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగిన బంధువులు.
పోలీసులు, బంధువుల మధ్య తీవ్ర తోపులాట.
బంధువులను నెట్టివేసి పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని వైద్యశాల నుండి అంబులెన్స్ లో బొల్లాపల్లి మండలం రావులాపురం తరలించిన పోలీసులు.
మృతదేహాన్ని తరలించేందుకు అడ్డుపడ్డ బంధువులు.
బంధువులను తోసివేసి మృతదేహాన్ని తరలించిన పోలీసులు.
వైద్యశాలలో బైఠాయించి ఆందోళనకు దిగిన మృతుడు బంధువులు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

