అన్వేషించండి

Top Headlines Today: జగన్ సహా ఐపీఎస్ అధికారిపై కేసు నమోదు; కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు - నేటి టాప్ న్యూస్

AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

జగన్ సహా ఐపీఎస్ అధికారిపై కేసు నమోదు

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సహా ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌లపై (Sunil Kumar) గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసులు వైసీపీ అధినేత జగన్, సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై కేసు ఫైల్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద తనను అరెస్ట్ చేసి వేధించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరితో పాటు మరికొందరు అధికారుల పేర్లనూ ఆయన ప్రస్తావించారు. కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని.. హత్యాయత్నం చేశారని చెప్పారు. తప్పుడు నివేదికలు ఇచ్చారని అన్నారు. ఇంకా చదవండి

కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూ కడుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు

బీఆర్‌ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే 14 మంది ప్రజాప్రతినిధులు పార్టీ మారగా... ఇప్పుడు మరికొందరు అదే లైన్‌లో ఉన్నారు. ఇవాళ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హస్తం గూటికి చేరనున్నారు. ఇదే బాటలో మరో ఆరేడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారనే టాగ్ బలంగా వినిపిస్తోంది. పార్టీ నేతల వలస కట్టడికి బీఆర్‌ఎస్ అధినాయకత్వం చేస్తున్న కట్టడి ఎలాంటి ఫలితం ఇవ్వడం లేదు. ఫిరాయింపులు నిరోధించేందుకు కోర్టుల్లో పోరాటం, నేతలను బుజ్జగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ప్రభావం చూపడం లేదు. ఇంకా చదవండి

పిఠాపురంలో తొలిసారిగా ఆ ప్రాజెక్ట్

చెత్త నుంచి కూడా సంపద సృష్టించి ఆదాయం పెంచుకునేలా మార్గాలు అన్వేషించే లక్ష్యంతో సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ (SLRM Project) చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం ఆ శాఖపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తొలిసారి కార్యాలయానికి వచ్చిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పవన్ సందర్శించారు. అనంతరం ఎస్ఎల్ఆర్ఎం వర్క్ షాప్‌లో పాల్గొన్నారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు.. భీమవరం, పిఠాపురం, గొల్లప్రోలులో ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నట్లు వివరించారు. డ్రైనేజ్ టు డైమండ్ అనే కాన్సెప్ట్‌తో ఈ ప్రాజెక్టును రూపొందించారని ఎల్ఎల్ఆర్ఎం రిసోర్స్ ప్రతినిధి శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఇంకా చదవండి

వైసీపీకి వైఎస్ఆర్‌కు సంబంధం లేదు - షర్మిల కీలక వ్యాఖ్యలు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉన్నారని ఆయనకు వైఎస్ఆర్‌సీపీకి సంబంధం లేదని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రకటించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం నెల రోజుల పాలనపై విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహాలపై ఏపీలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.  వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీ నాయకుడి గా రెండు సార్లు  గెలిచారన్నారు.  అలాంటి వ్యక్తి విగ్రహాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు.  వైసిపి కక్ష పూరిత చర్యలు చేసి ఉండొచ్చు . .మేము కాదనడం లేదు..కానీ వైఎస్ఆర్ ను దానికి బాద్యుడి నీ చేస్తే ఎలా అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్‌సీపీకి వైసీపీకి సంబంధం లేదన్నారు.  Ysr కాంగ్రెస్అంటే యువజన శ్రామిక రైతు పార్టీ ..వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదు... ఆయన కూ  వైసిపి కూ ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇంకా చదవండి

బీజేపీలో చేరనున్న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు

తెలంగాణలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు క్యూ కట్టగా.. మరో వైపు పార్టీకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. కేటీఆర్, హరీష్ రావు వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. వారు ఎవరితో చర్చలు జరిపారో స్పష్టత లేదు కానీ.. అత్యున్నత స్థాయి రాజకీయవర్గాలు మాత్రం.. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలో చేరడానికి ఒప్పందం జరిగిపోయిందని చెబుతున్నారు. ఇంకా చదవండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Train Accident: చెన్నై శివారులో రైలు ప్రమాదం - అతి వేగంతో గూడ్స్ రైలును ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్ రైలు, 2 భోగీలు దగ్ధం
చెన్నై శివారులో రైలు ప్రమాదం - అతి వేగంతో గూడ్స్ రైలును ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్ రైలు, 2 భోగీలు దగ్ధం
AIR India Flight: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం - తీవ్ర ఉత్కంఠ నడుమ సేఫ్ ల్యాండింగ్
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం - తీవ్ర ఉత్కంఠ నడుమ సేఫ్ ల్యాండింగ్
Telangana News: తెలంగాణలో సమగ్ర కులగణనపై ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణలో సమగ్ర కులగణనపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Andhra News: పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - తక్కువ ధరకే వంట నూనెలు
పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - తక్కువ ధరకే వంట నూనెలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CM Yogi Adityanath Kanya pujan | దసరా నవరాత్రుల ప్రత్యేక పూజ చేసిన గోరఖ్ పూర్ పీఠాధిపతి | ABP DesamPak vs Eng 1st Test Records | ముల్తాన్ టెస్ట్ మీద విరుచుకుపడుతున్న టెస్టు ప్రేమికులు | ABP DesamJoe Root Jersey Pics Viral | తడిసిన బట్టలను గ్రౌండ్ లో ఆరేసుకున్న జో రూట్ | ABP DesamAP Deputy CM Pawan Kalyan Palle Panduga | అసలేంటీ పల్లె పండుగ..పవన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ ఏంటీ..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Train Accident: చెన్నై శివారులో రైలు ప్రమాదం - అతి వేగంతో గూడ్స్ రైలును ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్ రైలు, 2 భోగీలు దగ్ధం
చెన్నై శివారులో రైలు ప్రమాదం - అతి వేగంతో గూడ్స్ రైలును ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్ రైలు, 2 భోగీలు దగ్ధం
AIR India Flight: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం - తీవ్ర ఉత్కంఠ నడుమ సేఫ్ ల్యాండింగ్
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం - తీవ్ర ఉత్కంఠ నడుమ సేఫ్ ల్యాండింగ్
Telangana News: తెలంగాణలో సమగ్ర కులగణనపై ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణలో సమగ్ర కులగణనపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Andhra News: పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - తక్కువ ధరకే వంట నూనెలు
పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - తక్కువ ధరకే వంట నూనెలు
Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Telangana Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Pawan Kalyan : ఏకంగా పవన్ పేరుతోనే దందాలు చేస్తున్న కాకినాడ DFO - డిప్యూటీ సీఎం రియాక్షన్ ఇదే !
ఏకంగా పవన్ పేరుతోనే దందాలు చేస్తున్న కాకినాడ DFO - డిప్యూటీ సీఎం రియాక్షన్ ఇదే !
Tesla Cybercab: డ్రైవర్ లేకుండా నడిచే కారు పరిచయం చేసిన మస్క్ - అంత తక్కువ ధరలోనా?
డ్రైవర్ లేకుండా నడిచే కారు పరిచయం చేసిన మస్క్ - అంత తక్కువ ధరలోనా?
Embed widget