అన్వేషించండి

Pawan Kalyan: 'చెత్త నుంచి సంపద సృష్టించేలా ప్రణాళిక' - పిఠాపురంలో తొలిసారిగా ఆ ప్రాజెక్ట్, డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన

Andhrapradesh News: 12 గంటల్లో చెత్తను కలెక్ట్ చేయగలిగితే అది సంపదే అవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇందులో భాగంగా ఎల్ఎల్ఆర్ఎం ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు చెప్పారు.

Deputy CM Pawan Kalyan Panchayat Raj Department Review: చెత్త నుంచి కూడా సంపద సృష్టించి ఆదాయం పెంచుకునేలా మార్గాలు అన్వేషించే లక్ష్యంతో సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ (SLRM Project) చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం ఆ శాఖపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తొలిసారి కార్యాలయానికి వచ్చిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పవన్ సందర్శించారు. అనంతరం ఎస్ఎల్ఆర్ఎం వర్క్ షాప్‌లో పాల్గొన్నారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు.. భీమవరం, పిఠాపురం, గొల్లప్రోలులో ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నట్లు వివరించారు. డ్రైనేజ్ టు డైమండ్ అనే కాన్సెప్ట్‌తో ఈ ప్రాజెక్టును రూపొందించారని ఎల్ఎల్ఆర్ఎం రిసోర్స్ ప్రతినిధి శ్రీనివాసన్ పేర్కొన్నారు.

పిఠాపురం నుంచే తొలిసారిగా..

12 గంటల్లో చెత్తను కలెక్ట్ చేయగలిగితే అది సంపదే అవతుందని.. పనికి రాని చెత్త వేరే అవసరాలకు సంపదగా మారుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురంలో (Pithapuram) తొలిసారిగా ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్ట్ చేపడతున్నామని.. శ్రీనివాసన్ గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టుపై పని చేస్తున్నారని చెప్పారు. ప్రజలు సైతం ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీనిపై అవగాహన కల్పించేందుకు మాస్టర్ ట్రైనర్స్‌ను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. 'పంట కాల్వ కనిపిస్తే కొందరు డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, పరిశుభ్రత ప్రజలు బాధ్యతగా తీసుకోవాలి. పంచభూతాల్లో నీరు ఉంది. నీటిని మనం పూజలకు ఉపయోగిస్తాం. అలాంటి జలాన్ని కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ప్రస్తుతం పర్యావరణానికి అతి పెద్ద సమస్య ప్లాస్టిక్. ప్లాస్టిక్, చెత్తా చెదారంతో ఇబ్బందులు వస్తున్నాయి. మనం గోవులను పూజిస్తాం. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం బాధాకరం. ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టులో ఈ ఇబ్బందులు తొలుగుతాయి. ఈ ప్రాజెక్టును మా కార్యాలయంలో.. మా పార్టీ ఆఫీసులో ప్రారంభిస్తాం. ఈ ప్రాజెక్టును అమలు చేయగలిగితే పంచాయతీలు, మున్సిపాల్టీలకు ఆదాయం వస్తుంది.' అని పవన్ వివరించారు.

'రూ.2,600 కోట్ల ఆదాయం'

రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఎల్ఆర్ఎం ప్రాజెక్టును అమలు చేస్తే రూరల్ ప్రాంతంలో ఏడాదికి రూ.2,600 కోట్ల ఆదాయం వస్తుందని పవన్ తెలిపారు. 2.45 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. ఇప్పటివరకూ చిన్న చిన్న గ్రామాల్లోనే మాత్రమే అమలు చేసిన ఈ ప్రాజెక్టును మరింత విస్తృతం చేయాలని సూచించారు. 'గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలను నిర్వీర్యం చేశారు. పంచాయతీలకు నిధులు లేవు. పూర్తిగా ప్రక్షాళన చేపట్టి స్వయం సమృద్ధి ఉండేలా పంచాయతీలను రూపొందించాల్సి ఉంటుంది. భీమవరం డంపింగ్ యార్డ్ విషయంలోనూ ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్ట్ అమలు చేస్తున్నాం. చెత్తలో కూడా ఐశ్వర్యం ఉంది అని చెప్పడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం' అని వివరించారు.

'కూరగాయలు, పండ్లు తీసుకురండి'

జనసేన ఎంపీలకు గురువారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంపై దృష్టి సారించాలని నిర్దేశించారు. ప్రతి నెలా ఒక రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు సైతం ఈ నిబంధన పాటించాలని సూచించారు. అలాగే, తనను కలిసేందుకు వచ్చిన వారు బొకేలు తీసుకు రావొద్దని.. కూరగాయలు, పండ్లు తీసుకురావాలని సూచించారు. కళ్లకు ఇంపుగా కనిపించేవి కాదని.. పది మంది కడుపు నింపేవి, పేదలకు ఉపయోగపడేవి ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. అలా వచ్చిన పండ్లు, కూరగాయలను అనాథ శరణాలయాలకు పంపిస్తానని స్పష్టం చేశారు.

Also Read: Raghurama Krishnam Raju: టీడీపీ ఎమ్మెల్యే రఘురామ ఫిర్యాదు - మాజీ సీఎం జగన్ సహా ఐపీఎస్ అధికారిపై కేసు నమోదు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget