అన్వేషించండి

Titan Submarine : అంతా బాగుందన్నారు.. అంతలోనే ఘోరం, టైటాన్ సబ్‌మెరైన్ ఆఖరి మజిలీపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి!

Titan Submarine last mesage: All is good here : టైటానిక్ అన్వేషణకు వెళ్లి తునాతునకలైన టైటాన్ సబ్‌మెరైన్‌ కేసు విచారణలో వెలుగులోకి విస్తుపోయే విషయాలు . కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించని తయారీ సంస్థ

Titan Submarine Accident : సముద్ర గర్భంలోని అద్భుతం టైటానిక్ అన్వేషణకు వెళ్లి తునాతునకలైన టైటాన్ సబ్‌మెరైన్‌ కేసుకు సంబందించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది జూన్‌లో పాకిస్తాన్ బిలయనీర్ షెహజాదా దావూద్‌, ఆయన కుమారుడు సులేమాన్‌, ఓషన్‌ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ సహా ఐదుగురు అట్లాంటిక్ మహాసముద్రంలో జలసమాధి అయిన కేసు ప్రస్తుతం కోర్టులో విచారణ దశలో ఉంది. వీరు గతేడాది (2023) జూన్‌ 20న ఓషన్‌గేట్‌కు చెందిన టైటాన్ జలాంతర్గామిలో అట్లాంటిక్ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులో దాగి ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు బయలు దేరారు. ఆ తర్వాత కొద్ది గంటల్లో వారి నుంచి ఏ విధమైన సిగ్నల్స్ రాలేదు. వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టిన కెనడా, యూఎస్ కోస్ట్ గార్డులు.. టైటానిక్ నౌకకు 4 వందల 88 మీటర్ల దూరంలో టైటాన్ శిథిలాలను గుర్తించారు. అయితే అవి శిథిలం అవడానికి ముందు అందులో ఉన్న ప్రయాణికులు మాట్లాడిన మాటలు కోర్టు విచారణలో బయటకు వచ్చాయి. అంతా బాగానే ఉందని వారు చెప్పినవే ఆఖరి మాటలు కాగా.. ఆ తర్వాత కాసేపటికే ఘోరం జరిగిపోయింది. ఆ ప్రమాదానికి సంబంధించిన ఫొటో కూడా ఒకటి బయటకు వచ్చింది. అది రిమోటెడ్‌ వెహికల్‌తో తీసిన ఫొటోగా అధికారులు తెలిపారు.

అట్లాంటిక్ సముద్ర జలాల్లోకి వెళ్లిన రెండు గంటల్లోనే ప్రమాదం:

          2023లో జూన్‌లో సముద్ర అన్వేషకులు ఐదుగురితో కలిసి అట్లాంటిక్ జలాల్లోకి వెళ్లిన టైటాన్ జలాంతర్గామి.. తన ప్రయాణం మొదలు పెట్టిన రెండు గంటల్లోనే.. అందులో సాంకేతిక సమస్యలు తలెత్తి సముద్ర పీడానాన్ని తట్టుకోలేక ముక్కలైంది. ఈ ఘటనలో బ్రిటీష్ వ్యాపారి, ఫ్రాన్స్‌కు చెందిన మాజీ నావికాదళ అధికారితో పాటు ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై విచారణ మొదలు పెట్టిన అమెరికా కోస్టు గార్డు అధికారులు.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. రెండు వారాల పాటు సాగిన విచారణలో భాగంగా అధికారులు.. టైటాన్ యాత్రను రీక్రియేట్ చేశారు. ప్రమాదం జరిగిన రోజు ఉదయం 9 గంటలా 17 నిమిషాలకు టైటాన్ జలాల్లోకి ప్రవేశించగా.. మదర్‌ షిప్‌తో 10 గంటలా 45 నిమిషాల వరకు టచ్‌లోనే ఉంది. ఆ సమయానికి సబ్‌మెరైన్ 3 వేల 346 మీటర్ల లోతులో ఉంది. అధిక బరువును వదిలించుకునేందుకు రెండు బరువైన వస్తువులను కూడా వదిలించుకున్నట్లు మదర్‌షిప్‌నకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత కాసేపటికే మదర్‌ షిప్‌తో కమ్యూనికేషన్స్ తెగిపోయాయి.
టైటాన్ సబ్‌మెరైన్ తయారీ. నిర్వహణలో భారీ లోపాలు:

          ఈ విచారణలో టైటాన్ తయారీలోనే భారీ లోపాలు ఉన్నట్లు తేలింది. తయారీ పూర్తైన తర్వాత ఈ సబ్‌మెరైన్‌ను థర్డ్‌ పార్టీ పరీక్షలకు పంపకుండానే నేరుగా విధుల్లోకి దించారు. ఏ వాతావరణంలో ఎలా స్పందిస్తుంది.. సముద్రంలో జలపీడనం కలిగే ఒత్తిడిలో సబ్‌మెరైన్ సామర్థ్యం ఎంత అన్న పరీక్షలేవీ జరగలేదని విచారణలో తేలింది. అంతకు ముందు 2012, 2022లో నిర్వహించిన యాత్రల్లోనూ టైటాన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని.. సమద్ర అట్టడుగు ప్రయాణంలో దాదాపు 113 పరికరాలు దెబ్బతిన్నాయని.. 3 వేల 500 మీటర్ల లోతులో ఇంజిన్ మొరాయించి 26 గంటలపాటు ప్రయాణికులు సముద్ర గర్భంలో చిక్కుకుపోయిన ఉదంతాలు కూడా టైటాన్‌కు ఉన్నాయని.. అయినా ఓషన్‌గేట్‌ సంస్థ ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధమైన చర్యలు తీసుకోక పోవడం వల్లే 2023లో ఘోరం జరిగిందని విచారణలో స్పష్టమైంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BR Naidu Deepfake Videos: టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు
టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు
US Israel Strikes On Iran: దుబాయ్‌లో చిక్కుకున్న 'లెజెండ్' హీరోయిన్... ప్రధాని మోడీ సాయం కోరుతూ పోస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న 'లెజెండ్' హీరోయిన్... ప్రధాని మోడీ సాయం కోరుతూ పోస్ట్
కేవలం 50,000 డౌన్ పేమెంట్ తో Maruti WagonR కొంటే, నెలవారీ EMI ఎంత చెల్లించాలి
కేవలం 50,000 డౌన్ పేమెంట్ తో Maruti WagonR కొంటే, నెలవారీ EMI ఎంత చెల్లించాలి
Nagpur Blast News: నాగ్‌పూర్‌లోని ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 15 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
నాగ్‌పూర్‌లోని ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 15 మంది మృతి, అసలేం జరిగిందంటే !

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BR Naidu Deepfake Videos: టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు
టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Toxic Romantic Song : టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
Chronic Pain : ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
Embed widget