అన్వేషించండి

Bonda Uma: 9 నెలల్లో పూర్తవ్వాల్సిన పనులు, 4 ఏళ్లవుతున్నా కాలేదు: బోండా ఉమా

Bonda Uma: విజయవాడ మధురానగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.

Bonda Uma: వైసీపీ ప్రభుత్వంపై తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని చేతకాని సర్కారు అంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన బోండా ఉమా.. జగన్ మోహన్ రెడ్డి అసమర్ధ ముఖ్యమంత్రి అంటూ విమర్శలు గుప్పించారు. మధురా నగర్ డబుల్ రైల్వే లైన్ రైల్వే అండర్ బ్రిడ్జి పనుల వద్ద బోండా ఉమా సెల్ఫీ దిగారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2018లో రైల్వే శాఖ నుండి అనుమతులు తీసుకుని 18 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు చేపట్టామని తెలిపారు.

వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చే నాటికి రైల్వే అండర్ బ్రిడ్జి పనులు 70 శాతం పూర్తయ్యాయని, 2019 జనవరిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పనులు అలాగే కొనసాగిస్తే కేవలం 9 నెలల్లో పూర్తి అయి ఉండేవని బోండా ఉమా అన్నారు. కానీ డబుల్ లైన్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులు నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇంకా పూర్తి కాకపోవడంపై ఆయన విమర్శలు చేశారు. చేతకాని ప్రభుత్వం వల్లే ఈ దుస్థితి దాపురించిందని, జగన్ మోహన్ రెడ్డి అసమర్థ సీఎం కాదా అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బోండా ఉమా ఈ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. రైల్వే అండర్ బ్రిడ్జీ పనులు ఎప్పటి లోపు పూర్తి చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు పావలా ఎమ్మెల్యే అంటూ దుయ్యబట్టారు. 

ఉత్సాహంగా సాగుతున్న నారా లోకేష్ పాదయాత్ర

నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్తేజాన్ని రేకెత్తిస్తోంది. జనవరి 27వ తేదీన ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 77వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వెయ్యి కిలోమీటర్లకు చేరుకోనుంది. ఆధోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద లోకేష్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మార్క్ ను పూర్తి చేసుకుంటారు. ఈ సందర్భంగా నారా లోకేష్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ఆదోని బైపాస్ వద్ద స్థానికులతో లోకేష్ సమావేశం అవుతారు. వారి సమస్యలపై చర్చిస్తారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
BCCI Red Alert: ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీPBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
BCCI Red Alert: ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
Varsha Bollamma: ప్యాంట్, పంత్, లక్నో... వర్షా బొల్లమ్మ ఎక్కడి నుంచి ఎక్కడికి ముడి పెట్టింది మావా
ప్యాంట్, పంత్, లక్నో... వర్షా బొల్లమ్మ ఎక్కడి నుంచి ఎక్కడికి ముడి పెట్టింది మావా
Gold price: 98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
Balakrishna: 'జాట్' సక్సెస్ తర్వాత బాలకృష్ణతో... 'వీర సింహా రెడ్డి' కాంబో రిపీట్!
'జాట్' సక్సెస్ తర్వాత బాలకృష్ణతో... 'వీర సింహా రెడ్డి' కాంబో రిపీట్!
EV charging station :ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఎవరైనా పెట్టుకోవచ్చా? ఎంత ఖర్చు అవుతుంది?
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఎవరైనా పెట్టుకోవచ్చా? ఎంత ఖర్చు అవుతుంది?
Embed widget