అన్వేషించండి

Bonda Uma: 9 నెలల్లో పూర్తవ్వాల్సిన పనులు, 4 ఏళ్లవుతున్నా కాలేదు: బోండా ఉమా

Bonda Uma: విజయవాడ మధురానగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.

Bonda Uma: వైసీపీ ప్రభుత్వంపై తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని చేతకాని సర్కారు అంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన బోండా ఉమా.. జగన్ మోహన్ రెడ్డి అసమర్ధ ముఖ్యమంత్రి అంటూ విమర్శలు గుప్పించారు. మధురా నగర్ డబుల్ రైల్వే లైన్ రైల్వే అండర్ బ్రిడ్జి పనుల వద్ద బోండా ఉమా సెల్ఫీ దిగారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2018లో రైల్వే శాఖ నుండి అనుమతులు తీసుకుని 18 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు చేపట్టామని తెలిపారు.

వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చే నాటికి రైల్వే అండర్ బ్రిడ్జి పనులు 70 శాతం పూర్తయ్యాయని, 2019 జనవరిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పనులు అలాగే కొనసాగిస్తే కేవలం 9 నెలల్లో పూర్తి అయి ఉండేవని బోండా ఉమా అన్నారు. కానీ డబుల్ లైన్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులు నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇంకా పూర్తి కాకపోవడంపై ఆయన విమర్శలు చేశారు. చేతకాని ప్రభుత్వం వల్లే ఈ దుస్థితి దాపురించిందని, జగన్ మోహన్ రెడ్డి అసమర్థ సీఎం కాదా అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బోండా ఉమా ఈ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. రైల్వే అండర్ బ్రిడ్జీ పనులు ఎప్పటి లోపు పూర్తి చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు పావలా ఎమ్మెల్యే అంటూ దుయ్యబట్టారు. 

ఉత్సాహంగా సాగుతున్న నారా లోకేష్ పాదయాత్ర

నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్తేజాన్ని రేకెత్తిస్తోంది. జనవరి 27వ తేదీన ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 77వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వెయ్యి కిలోమీటర్లకు చేరుకోనుంది. ఆధోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద లోకేష్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మార్క్ ను పూర్తి చేసుకుంటారు. ఈ సందర్భంగా నారా లోకేష్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ఆదోని బైపాస్ వద్ద స్థానికులతో లోకేష్ సమావేశం అవుతారు. వారి సమస్యలపై చర్చిస్తారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget