అన్వేషించండి

Taj Mahal News: తాజ్‌మహల్‌కు పన్ను ఉంటుందా? నోటీసులు ఎందుకు వచ్చాయ్?

Taj Mahal News: ఆస్తి పన్ను, నీటి పన్ను కట్టాలని తాజ్ మహల్‌కు నోటీసులు రావడంపై అధికారులు ఏమంటున్నారు?

Taj Mahal News: ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన తాజ్‌మహల్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఆస్తి, నీటి పన్నుగా దాదాపు రూ.2 కోట్లు చెల్లించాలని ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్కియాలజికాల్ సర్వే అఫ్ ఇండియాకు పంపింది. 15 రోజుల వ్యవధిలోగా పన్నులు చెల్లించాలని, లేని పక్షంలో ఆస్తులను జప్తు చేస్తామని నోటిసుల్లో పేర్కొంది.

ఆగ్రా మున్సిపల్ అధికారులు ఈ ఏడాది, పోయిన ఆర్ధిక సంవత్సరానికి పన్నులను లెక్కించి రెండు నోటిసులు జారి చేసారు. నోటిసుల్లోని అంశాల ప్రకారం 2022 మార్చి 31 వరకు రూ.88,784  పన్ను మొత్తం కాగా, సమయానికి కట్టలేదు అని రూ.47,983 రూపాయలను వడ్డీ కింద లెక్కించారు. 2022-23 ఆర్దిక సంవత్సరానికి గాను రూ.11,098 ఆస్తి పన్నుగా విధించారు. ఇలా విధించిన మొత్తం పన్నుల విలువ రూ.1,47,826గా ఇండియా టుడే వెల్లడించింది. 

ఎందుకు?

ఈ నోటీసులపై ఆగ్రా మున్సిపల్ కమిషనర్ నిఖిల్ టీ ఫుండేను ప్రశ్నించగా తనకు తెలియదని సమాధానమిచ్చారు.

" తాజ్ మహల్‌కు సంబంధించి జారి చేసిన పన్ను నోటిసుల గురించి నాకు తెలియదు. పన్నుల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) సర్వే లో  భాగంగా నోటిసులు జారీ అయ్యుంటాయి. గవర్నమెంట్ భవనాలు, మతపరమైన ప్రదేశాలు వంటి అన్ని ప్రదేశాలకు వారు బకాయి ఉన్న మొత్తంతో నోటిసులు జారి చేసారు. చట్టపరంగా రాయితీలు ఇస్తున్నాము. తాజ్ మహల్‌కు సంబంధించి నోటిసులు జారి అయ్యుంటే వారిచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాము.                                                 "
-నిఖిల్, ఆగ్రా మున్సిపల్ కమిషనర్

తాజ్ మహల్ పన్ను బకాయిలపై ఆగ్రా మున్సిపాలిటీ జారి చేసిన నోటిసులపై ఆర్కియాలజికల్ సర్వే అఫ్ ఇండియా సుపెరింటెండింగ్ అర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ స్పందించారు.

తెలియకుండా

" ఇది ఆగ్రా మున్సిపాలిటీ వారి తప్పిదం. ఇలాంటి కట్టడాలపై ఆస్తి పన్ను ఉండదు. జీఐఎస్ సర్వే ఆధారంగా పన్నులు విధించే బాధ్యత ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించినట్టు మాకు తెలిసింది. మేము వాణిజ్యపరమైన పనుల కోసం నీటిని వాడుకోము కాబట్టి  నీటి పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పరిసరాల్లో పచ్చదనంకై మొక్కల కోసం నీటిని వినియోగిస్తాము. నీటిపన్ను, ఆస్తిపన్ను అని తాజ్ మహల్‌కు నోటిసులు ఇవ్వడం ఇదే తొలిసారి. పొరపాటుగా పంపించి ఉంటారు.. "
-రాజ్ కుమార్ పటేల్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా

ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్‌పై ప్రేమతో దీన్ని నిర్మించాడు. 1632 సంవత్సరంలో ప్రారంభమై,1653లో పూర్తయిన ఈ నిర్మాణానికి  నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. ఈ నిర్మాణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉంది. దీనికి 1983లో యునెస్కో గుర్తింపు కూడా లభించింది .ప్రపంచవ్యాప్తంగా ప్రజలు  దీనిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు.

Also Read: Bharat Jodo Yatra: 'జోడో యాత్రను వాయిదా వేసుకోండి'- రాహుల్ గాంధీకి ఆరోగ్యమంత్రి లేఖ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
APPSC Group -2 Results : ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
TTD  News Guidelines: తెలంగాణలో తిరుమలేశుడి భక్తులకు బిగ్ అలర్ట్- సిఫార్సు లేఖలపై ప్రత్యేక మార్గదర్శకాలు
తెలంగాణలో తిరుమలేశుడి భక్తులకు బిగ్ అలర్ట్- సిఫార్సు లేఖలపై ప్రత్యేక మార్గదర్శకాలు
HCU Land Dispute: ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs MI Match Highlights IPL 2025 | ముంబై పై 12పరుగుల తేడాతో లక్నో ఘన విజయం | ABP DesamAngkrish Raghuvanshi 50 vs SRH | ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసిన రఘువంశీKamindu Mendis Ambidextrous Bowling vs KKR | IPL 2025 లో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ ప్లేయర్Sunrisers Flat Pitches Fantasy | IPL 2025 లో టర్నింగ్ పిచ్ లపై సన్ రైజర్స్ బోర్లా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
APPSC Group -2 Results : ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
TTD  News Guidelines: తెలంగాణలో తిరుమలేశుడి భక్తులకు బిగ్ అలర్ట్- సిఫార్సు లేఖలపై ప్రత్యేక మార్గదర్శకాలు
తెలంగాణలో తిరుమలేశుడి భక్తులకు బిగ్ అలర్ట్- సిఫార్సు లేఖలపై ప్రత్యేక మార్గదర్శకాలు
HCU Land Dispute: ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
AP Nominated posts: కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
CSK Captain MS Dhoni:  చెన్నై కెప్టెన్ గా ధోనీ..! మ‌ళ్లీ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న వెట‌ర‌న్ ప్లేయ‌ర్..!! శ‌నివారం చెపాక్ లో ఢిల్లీతో మ్యాచ్
చెన్నై కెప్టెన్ గా ధోనీ..! మ‌ళ్లీ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న వెట‌ర‌న్ ప్లేయ‌ర్..!! శ‌నివారం చెపాక్ లో ఢిల్లీతో మ్యాచ్
Nagababu : పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
YS Sharmila : అసలు విషయం వదిలేస్తున్నారు, నచ్చినట్టు వాడుకుంటున్నారు- మీడియాపై షర్మిల ఆగ్రహం
అసలు విషయం వదిలేస్తున్నారు, నచ్చినట్టు వాడుకుంటున్నారు- మీడియాపై షర్మిల ఆగ్రహం
Embed widget