అన్వేషించండి

Bengal Governer Case : దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేదింపుల కేసు - రాజ్‌భవన్‌లోకి పోలీసులు రాకుండా నిషేధం

Bengal News : బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రాజ్ భవన్ ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో అక్కడి రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.


Sexual Harassment Complaint Against West Bengal Governor :  పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ పై నమోదైన లైంగిక వేధింపుల కేసు పెను సంచలనంగా మారింది.  గవర్నరు తనను లైంగికంగా వేధించినట్లు రాజ్‌భవన్‌లో పని చేస్తున్న ఉద్యోగిని రాజ్ భవన్ లో ఉండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆ ఫిర్యాదును పోలీసులు   హేర్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. 

బాధిత మహిళ 2019 నుంచి రాజ్‌భవన్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నారు.   రెండు సందర్భాల్లో గవర్నర్‌ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఏప్రిల్   నెల 24న గవర్నర్‌ ముందుకు వెళ్ళినప్పుడు లైంగికంగా వేధించారని, మళ్లీ గురువారం కూడా ఇదే పరిస్థితులు ఎదురుకావడంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల్ని ఆశ్రయించానని తెలిపారు. ఈ వ్యవహారంపై బెంగాల్ లో రాజకీయ దుమారం రేగుతోంది. 

రాజ్ భవన్‌లో పోలీసుల ఎంట్రీని గవర్నర్ నిషేధించారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361 ప్రకారం క్రిమినల్‌ ప్రొసీడింగ్‌ల నుంచి గవర్నర్‌కు మినహాయింపు ఉంది. అందుకే రాజ్ భవన్ లోకి పోలీసుల రాకను అనుమతించడం లేదు.  ఈ అంశంపై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. 

తనపై వచ్చిన లైంగిక వేదింపుల ఆరోపణలనుగవర్నర్ సీవీ ఆనంద బోస్ తీవ్రంగా ఖండించారు.అవన్నీ కల్పిత కథనాలు అన్నారు.  కల్పిత కథనాల్ని చూసి తాను భయపడనన్నారు.  చివరికి సత్యమే గెలుస్తుందని తెలిపారు.  ఈ  ప్రయత్నం ద్వారా ఎవరైనా రాజకీయంగా ప్రయత్నం పొందాలనుకుంటే వారిష్టమన్నారు.  రాష్ట్రంలో అవినీతి,  హింసపై తన పోరాటాన్ని ఎవనరూ ఆపలేరని  ప్రకటించారు. మాజీ బ్యూరోక్రాట్‌ అయిన బోస్‌ గత ఏడాది నవంబర్‌లో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు.  

 

గవర్నర్ గా నియమితలైనప్పటి నుండి ఆయన బెంగాల్ ప్రభుత్వంలో ఘర్షణాత్మక వైఖరితోనే ఉన్నారు. ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య తీవ్ర  విబేధాలు ఉన్నాయి. బెంగాల్ లో సంచలనం సృష్టించిన సందేశ్ ఖాళీ లైంగిక వేధింపుల కేసు విషయంలో గవర్నర్ చాలా దూకుడుగా స్పందించారు. ప్రభుత్వం సహకరించపోయినా సందేశ్‌ఖలీ వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వంపై రాజకీయ పరమైన విమర్శలు చేయడంలో ముందుంటారు.  

ఈ కేసు విషయంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది.  ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరింది. ఓ వైపు గవర్నర్ తప్పుడు ఫిర్యాదు అని ఆరోపిస్తున్నారు..మరోవైపు ఆయన తనకు రాజ్యాంగపరంగా ఉన్న ఇమ్యూనిటీని ఉపయోగించుకున్నారు. బాధితులు కేసు పెట్టి న్యాయం కోసం చూస్తున్నారు. ఈ అన్ని అంశాలతో రాజకీయంగా బెంగాల్ లో పెను దుమారం రేపుతోంది. 

ఎన్నికల ప్రచారంలో భాగంగాప్రధాని మోదీ శనివారం బెంగాల్ లో పర్యటించనున్నారు. అక్కడి ఎన్నికల్లో సందేశ్ ఖాలీ లైంగిక వేధింపుల కేసు హైలెట్ అవుతోంది. ఇలాంటి క్రమంలో గవర్నర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం పెను సంచలనంగా మారింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget