అన్వేషించండి

NITI Aayog Meeting: ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం,కేసీఆర్ సహా 8 మంది సీఎంలు డుమ్మా

NITI Aayog Meeting: ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశానికి 7గురు ముఖ్యమంత్రులు హాజరు కాలేదు.

NITI Aayog Meeting: 


2047 లక్ష్యంగా..

దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ఆరోగ్యం, స్కిల్ డెవలెప్‌మెంట్‌, మహిళా సాధికారత, మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించనున్నారు. 2047 నాటికి భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న లక్ష్యంతో ఈ సమావేశం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ని సిద్దంచేయనున్నారు. నీతి అయోగ్ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌లు, కేంద్ర పాలిత ప్రాంతాల నేతలు, కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి చీఫ్‌గా ప్రధాని వ్యవహరిస్తారు. Viksit Bharat @ 2047: Role of Team India పేరిట ఈ సమావేశం జరపనున్నట్టు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది భారత్. అయితే...దేశం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది మోదీ సర్కార్. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ రూపు రేఖలు ఎలా ఉండాలన్నది ఈ సమావేశంలో నిర్దేశించనున్నారు. వికసిత్ భారత్ 2047కి సంబంధించిన బ్లూ ప్రింట్‌ని తయారు చేసేందుకు ఈ సమావేశం ఉపయోగపడనుంది. కేంద్రం ఇది కీలకమైన సమావేశం అని చెబుతున్నప్పటికీ..కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం హాజరు కాలేదు. మొత్తం 7గురు ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు. 

వీళ్లంతా రాలేదు..

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నట్టు వెల్లడించారు. అటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం ఎలాంటి కారణం చెప్పలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ప్రధానికి లేఖ రాశారు. ఢిల్లీ పాలనా వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా ఖాతరు చేయడం లేదని మండి పడ్డారు. అందుకే..తాము ఈ సమావేశాన్ని బైకాట్ చేస్తున్నట్టు వెల్లడించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ కూడా హాజరు కావడం లేదని ప్రకటించారు. పంజాబ్ సమస్యల్ని కేంద్రం పట్టించుకోవడం లేదని, అందుకే బైకాట్ చేస్తున్నామని తేల్చి చెప్పారు. ఇది కేవలం ఫోటో సెషన్‌లాగే మారుతోందని, సమస్యలు పరిష్కారం అవడం లేదని ఆరోపించారు. ఇక బీజేపీతో కయ్యం పెట్టుకున్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఆయనతో పాటు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీష్ కుమార్ కూడా రాలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల హాజరు కాలేదు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget