అన్వేషించండి

20 th July 2024 News Headlines: జులై 20న మీ స్కూల్‌ అసెంబ్లీలో చదవదగ్గ న్యూస్‌ హెడ్‌లైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు

20 th July School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.

20 th July 2024 News Headlines in Telugu For School Assembly: 

1. ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఎడతెరపిలేని వానలు కురవడంతో వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ధవళేశ్వరం, శ్రీశైలం సహా జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో ఇవాళ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గోదావరి ప్రవాహం పెరగడంతో విలీన గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

2. ఆంధ్రప్రదేశ్‌ కృత్రిమ మేధ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విశాఖ, అమరావతిని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హబ్‌గా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజల వ్యక్తిగత జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజయన్‌ ఉండాలని ఆయన అన్నారు.

3. అంగన్‌వాడీ కేంద్రాలను ప్లే స్కూళ్ల తరహాలో తీర్చిదిద్ది అక్కడే మూడో తరగతి వరకు విద్యాబోధన చేస్తామని తెంలగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ స్కూళ్లలో ప్రతి కేంద్రానికి ఒక టీచర్‌ను నియమిస్తామన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామన్న ఆయన... 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్‌ బడులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. త్వరలో విద్య, వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. 

4. తెలంగాణలో గ్రూప్‌-2 రాత పరీక్షలు వాయిదపడ్డాయి. ఆగస్టు 7, 8 జరగాల్సిన పరీక్షలను ల్ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రీ షెడ్యూలు చేసింది. గ్రూప్‌ 2 పరీక్షలను డిసెంబరులో నిర్వహిస్తామని, తేదీలను త్వరలో ప్రకటిస్తామని TGPSC వెల్లడించింది. తర్వాత ప్రకటిస్తామంది. సీఎం సూచనతో నిరుద్యోగుల కోరిక మేరకు గ్రూప్‌ 2 పరీక్షను వాయిదా వేశారు. 

5. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్లకు నేర విచారణల నుంచి సంపూర్ణ రక్షణ కల్పించే ఆర్టికల్‌ 361ని పరిశీలించేందుకు అంగీకారం తెలిపింది. బెంగాల్‌ గవర్నర్‌ తనను లైంగిక వేధింపులకు గురిచేశారన్న ఓ మహిళా ఉద్యోగి ఆరోపణల వివాదం నేపథ్యంలో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

6. 78వ స్వాతంత్ర దినోత్సవ ధీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2047 నాటికి భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. అప్పటికల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఈసారి స్వాతంత్ర్య వేడుకులను వికసిత్‌ భారత్‌ థీమ్‌తో నిర్వహిస్తారు. 

7. పాకిస్థాన్‌లో హిందూ జనాభ పెరిగింది. 2017లో దాయాది దేశంలో 35 లక్షల మంది హిందూ జనాభా ఉండగా 2023 నాటికి అది 38 లక్షలకు పెరిగిందని జన గణన తేల్చింది. పాకిస్థాన్‌లో అత్యధిక జన సంఖ్య గల మైనారిటీ వర్గం హిందువులేనని కూడా వెల్లడైంది. 2050 నాటికి పాక్‌లో హిందూ జనాభ రెట్టింపు కానుంది. 

8. మహిళల ఆసియాకప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. దాయాది పాకిస్తాన్‌ను మట్టి కరిపించి తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ కేవలం 108 పరుగులకే కుప్పకూలగా.. భారత జట్టు 14 ఓవర్లలోనే మూడే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


9. కరెంట్‌ అఫైర్‌
గర్బా నృత్య రూపం భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది?
 సమాధానం : గుజరాత్ 
10.  మంచిమాట 
బద్ద శత్రువు కన్నా అసూయతో రగిలిపోయే మిత్రుడే ప్రమాదకరం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget