అన్వేషించండి

27 th August 2024 School News Headlines Today: తెలంగాణలో సివిల్స్‌కు అర్హులైన యువతకు అభయహస్తం, భారత అమ్ముల పొదిలో మరో యుద్ధ నౌక వంటి మార్నింగ్ టాప్ న్యూస్‌

27 th August 2024 School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.

27 th August 2024 School News Headlines Today: 
నేటి ప్రత్యేకత
ఎయిర్ ఇండియా దినోత్సవం 
ఆస్ట్రేలియా క్రికెటర్ డోనాల్డ్ బ్రాడ్‌మాన్ జననం
 
తెలంగాణ వార్తలు: 
రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా తెలంగాణలో సివిల్స్‌కు అర్హులైన యువతకు సింగరేణి సంస్థ సౌజన్యంతో రూ. లక్ష ఆర్థిక సహాయం చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు. సెక్రటేరియట్‌లో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ తో కలిసి చెక్కులు అందజేశారు. 
 
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు: 
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఒబెరాయ్‌ సంస్థ ఆసక్తి చూపుతోంది. సెప్టెంబరు 20లోగా అన్నవరంలో హోటల్‌ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. హార్సిలీహిల్స్‌, పిచ్చుకల్లంకలోనూ పీపీపీ విధానంలో హోటళ్ల నిర్మాణంపై ఒబెరాయ్‌ హోటల్స్‌ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీబీఎస్‌ఈ పరీక్షా విధానంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ విధానంపై అమలుపై జరిగిన మదింపులో దిగ్ర్బాంతికర విషయాలు బహిర్గతమయ్యాయి. ఇప్పటివరకు బోధించిన సిలబస్‌పై మదింపు జరగగా దాదాపు 60 శాతం మందికిపైగా ఫెయిల్‌ అయ్యారు. ఏ సబ్జెక్టులోనూ కనీసం సగం మంది ఉత్తీర్ణులు కాలేదు.
 
జాతీయ వార్తలు : 
భారత అమ్ముల పొదిలో మరో యుద్ధ నౌక చేరనుంది. పూర్తి అణు సామర్థ్యంతో నిర్మించిన.. దేశ తొలి బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌’ త్వరలో భారత సైన్యంలో చేరనుంది. ప్రధాని ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు తొలి వారంలో INS అరిహంత్‌ను జాతికి అంకితం చేయనున్నారు. 
 
కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా కొత్త రాజకీయ పార్టీ స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ ప్రచారం జోరందుకుంది. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేలా పార్టీ పేరు అటల్ విచార్ మంచ్‌గా పెట్టనున్నట్లు తెలుస్తోంది.
 
జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి వచ్చాయి. తాజాగా రెండు పార్టీల పొత్తు ఖరారైంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒప్పందం ప్రకారం 32 చోట్ల కాంగ్రెస్‌, 51 స్థానాల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ పోటీ చేయనున్నాయి. 
 
మహిళలపై జరుగుతున్న నేరాలు క్షమించరాని పాపాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ మహిళల జీవితాలు, గౌరవాన్ని కాపాడడం ప్రభుత్వం సహా మనందరిపై ఉన్న అతి పెద్ద బాధ్యతని ప్రధాని స్పష్టం చేశారు.
 
అంతర్జాతీయ వార్తలు: 
ఆఫ్రికన్ దేశమైన బుర్కినా ఫాసోలో హింస చెలరేగింది. అల్-ఖైదాతో సంబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ అనే సాయుధ సమూహం ఊచకోతకు పాల్పడింది. ఈ మారణహోమంలో 200 మంది చనిపోయారు. 140 మంది గాయపడ్డారు. మృతుల్లో గ్రామస్థులు, సైనికులు ఉన్నారు.
క్రీడా వార్తలు: 
మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనుంది. ఈ క్రమంలో ఐసీసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. గ్రూప్-Aలో ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉండగా గ్రూప్-Bలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి. మొత్తం 23 మ్యాచులుంటాయి. ఈ టోర్నీ అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య జరుగుతుంది.
 
మంచిమాట
 
అజ్ఞానాన్ని తొలగించి... విజ్ఞానాన్ని పంచి.. క్రమశిక్షణ నేర్పేవాడే గురువు.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget