అన్వేషించండి

Russia Ukraine War: ఉక్రెయిన్- రష్యా ఉద్రిక్తతలపై మోదీ సమీక్ష- పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడనున్న ప్రధాని!

ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడనున్నట్లు సమాచారం.

రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న భీకర యుద్ధంపై ప్రపంచదేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా ముప్పేట దాడి చేస్తోంది. రష్యా యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. భారత్ కూడా శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లడనున్నట్లు సమాచారం.

ప్రధాని సమీక్ష

మరోవైపు రష్యా-ఉక్రెయిన్​ పరిణామాలపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. యుద్ధ పరిణామాలు, భారత్​పై తక్షణ ప్రభావం, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమీక్షలో హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను ముఖ్యంగా విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చే విషయంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం 20 వేల మంది వరకు భారత పౌరులు ఉన్నారు. వీరందరినీ సురక్షితంగా భారత్ తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోంది. పిల్లల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.

70 స్థావరాలు

ఉక్రెయిన్​ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని రష్యా భీకర దాడులు చేపడుతోంది. ఉక్రెయిన్​లోని 70 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది రష్యా. ధ్వంసం చేసిన వాటిలో 11 ఎయిర్​ ఫీల్డ్స్​ కూడా ఉన్నట్లు తెలిపింది.

మరోవైపు తాము చేసిన ప్రతిదాడిలో 100 మందికిపైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.

Also Read: Ukraine War Visuvals: ఉక్రెయిన్‌పై రష్యా ఎలా విరుచుకుపడుతుందో తెలుసా ? ఇవిగో దృశ్యాలు

Also Read: Ukraine War Telugu Students : ఉక్రెయిన్‌లో విద్యార్థుల వేదన - ఇక్కడ తల్లిదండ్రుల ఆవేదన ! తెలుగు రాష్ట్రాల్లోనూ యుద్ధ కల్లోలం..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR:  వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
HYDRA Success: వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABPSunita Williams Coming back to Earth | Gravity లేకపోతే మన బతుకులు అథోగతేనా | ABP DesamAdilabad Bala Yesu Festival | క్రిస్మస్ కన్నా ఘనంగా చేసుకునే బాల యేసు పండుగ | ABP DesamPawan Kalyan Maha kumbh 2025 | ప్రయాగ్ రాజ్ లో ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR:  వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
HYDRA Success: వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
Viral News: మూడింటికే కోడి కూస్తోందట -కేసు పెట్టేశాడు - ఆర్డీవో ఏం తీర్పు చెప్పారంటే ?
మూడింటికే కోడి కూస్తోందట -కేసు పెట్టేశాడు - ఆర్డీవో ఏం తీర్పు చెప్పారంటే ?
KCR BRS Meeting: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
Andhra Pradesh and Telangana: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
PM Kisan Nidhi: ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లోకి రూ.2000 - ఈ రైతులకు మాత్రం డబ్బులు రావు!
ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లోకి రూ.2000 - ఈ రైతులకు మాత్రం డబ్బులు రావు!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.